Bangladesh: భారత్ షేక్ హసీనాని అప్పగించాలి, లేదంటే.. బంగ్లాదేశ్ వార్నింగ్..
- షేక్ హసీనాను మాకు అప్పగించాలి..
- ఇండియాను కోరిన బంగ్లాదేశ్ నేత..
- లేకుంటే తీవ్ర నిరసన తెలియజేస్తామంటూ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆ దేశంలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ గురువారం ఆమెకు వారెంట్ ఇష్యూ చేసింది. ఈ ఏడాది జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనల్లో షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు, పలువురి చావుకు కారణమైనట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆగస్టులో అక్కడి పరిస్థితులు హింసాత్మకంగా మారడంతో హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.
ఇదిలా ఉంటే, హసీనాను అప్పటించే ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుంటే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తామని బంగ్లాదేశ్ హెచ్చరించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో న్యాయ సలహాదారుగా ఉన్న ఆసిఫ్ నజ్రుల్ ఈ మేరకు భారత్ని హెచ్చరిస్తూ కామెంట్స్ చేశారు. నవంబర్ 18లోగా హసీనాతో పాటు 45 మంది సహ నిందితులను హాజరుపరచాలని అక్కడి కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆసిఫ్ గురువారం మాట్లాడారు. తమకు చాలా చట్టపరమైన ఏర్పాట్లు ఉంటాయని, అయితే “భారత్ దీన్ని నిజాయితీగా అర్థం చేసుకుంటే, హసీనా (బంగ్లాదేశ్కు) తిరిగి రావడానికి భారతదేశం ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది” అని అన్నారు. భారత్, బంగ్లాదేశ్ల మధ్య ఇప్పటికే నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరిందని చెప్పారు.
Also Read
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
Read Also: Bomb threats: ఆగని బాంబు బెదిరింపులు.. ఈ రోజు 6 ఇండిగో విమానాలకు బెదిరింపులు..
విచారణ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత హసీనాని తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ అధికారికంగా కోరుతుందని నజ్రుల్ గత నెలలో మీడియాతో చెప్పారు. ఇదిలా ఉంటే, హసీనాకు ఆశ్రయం కల్పించడం ఒక హంతకుడికి, నేరస్థుడికి ఆశ్రయం కల్పించినట్లేనని హసీనా ప్రధాన ప్రత్యర్థి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సీనియర్ జాయింట్ సెక్రటరీ జనరల్ అడ్వకేట్ రుహుల్ కబీర్ రిజ్వీ అన్నారు. దౌత్యప్రక్రియ ద్వారా ఆమెను మేము బంగ్లాదేశ్కి తీసుకురావాల్సి ఉందని, ఆమె దాదాపుగా 200 కేసుల్ని ఎదుర్కొంటోందని చెప్పారు. హసీనా ప్రభుత్వ పతనం తరువాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసలో వందలాది మంది మరణించారు, జూలై మధ్యలో నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి మరణించిన వారి సంఖ్య 1,000 కంటే ఎక్కువగా ఉంది.
తాజావార్తలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..