Pakistan-Bangladesh: పాక్-బంగ్లాదేశ్ చెట్టాపట్టాల్.. “సార్క్” పునరుద్ధరణపై చర్చ..
- పాక్-బంగ్లాదేశ్ చెట్టాపట్టాల్..
- న్యూయార్క్ వేదికగా ఇరు దేశాధినేతల భేటీ..
- సార్క్ పునరుద్ధరణపై ఇరువురి చర్చలు..
Pakistan-Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా గద్దె దిగినప్పటి నుంచి ఆ దేశం పాకిస్తాన్కి దగ్గరవుతోంది. అక్కడ ఇస్లామిక్ రాడికల్ గ్రూపులు పాకిస్తాన్తో బంగ్లాదేశ్ సంబంధాలు పెంచుకోవాలని చెబుతున్నాయి. దీనికి తగ్గట్లుగానే మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్తో తెగ చర్చలు జరుపుతోంది. భారత్ని ఇబ్బంది పెట్టేలా బంగ్లాదేశ్ ప్రవర్తిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్ ప్రధానితో, బంగ్లాదేశ్ అధినేత మహ్మద్ యూనస్ న్యూయార్క్లో సమావేశమయ్యారు. భారత్ సభ్యదేశంగా ఉన్న ‘‘దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ(సార్క్)’’ని పునరుద్ధరించాలని పిలుపునిచ్చాయి.
సార్క్లో భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మాల్దీవులు మరియు నేపాల్లు సభ్యదేశాలుగా ఉన్నాయి. అయితే, 2016 నుంచి ఈ గ్రూప్ ప్రభావవంతంగా లేదు. 2014లో నేపాల్ రాజధాని ఖాట్మాండులో చివరిసారిగా సార్క్ ద్వైవార్షిక శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. అయితే, ఇప్పుడు పాక్, బంగ్లాలు భారత వ్యతిరేఖ భావాలను కలిగి ఉన్నాయి. సార్క్ పునరుద్ధరణని కోరుతున్నాయి. బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మహ్మద్ యూనస్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ) సందర్భంగా కలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించారు. దీంట్లో సార్క్ ప్రధాన అంశంగా నిలిచింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Narsingi Police Station: నార్సింగి పోలీస్ స్టేషన్ లో జానీ, హర్షసాయి రేప్ కేసుల దర్యాప్తు
పాక్-బంగ్లాలు సార్క్ పునరుద్ధరణను ఎందుకు కోరుకుంటున్నాయి..?
ఆగస్టులో బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు.ఇప్పుడు పాక్ లాగే బంగ్లా కూడా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ఆర్థిక సహకారాన్ని పెంచడానికి సార్క్ని పునరుద్ధరించాలని పిలుపునిచ్చింది. బుధవారం యూనస్ షరీఫ్ని కలిశారు. సార్క్ పునరుద్ధరణకు పాక్ మద్దతు ఉంటుందని షరీఫ్ హామీ ఇచ్చారు.
సార్క్ చార్టర్ నిబంధనల ప్రకారం.. ఏదైనా ఒక సభ్యదేశం హాజరుకాకుంటే శిఖరాగ్ర సమావేశాలు జరపలేరు. 2016లో సార్క్ సమావేశాలు ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సి ఉంది. అయితే, హాజరయ్యేందుకు భారత్ ఇష్టం చూపలేదు. 2016లో పఠాన్ కోట్, ఉరీ దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి. ఈ నేపథ్యంలోనే సార్క్ సమావేశాలకు హాజరయ్యేందుకు భారత్ నిరాకరించింది. భారత్ దారిలోనే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్ కూడా నిరాకరించాయి.
2016 జనవరిలో పఠాన్కోట్ ఎయిర్బేస్పై పాక్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది సహా 8 మంది మృతి చెందగా, 38 మంది గాయపడ్డారు. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం(జేఐటీ) సందర్శించింది. అన్ని వివరాలను భారత్ సమర్పించింది. జైషే మహ్మద్ ఈదాడికి పాల్పడినట్లు సాక్ష్యాలు అందించింది. అయితే, విచారణ తర్వాత పాక్ చేరిన ఈ టీం, భారత్ కావాలనే డ్రామా చేస్తోందని, పాకిస్తాన్ని కించపరిచేలా, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చేస్తుందని ఆరోపించింది.
2016లో సెప్టెంబర్ 18న సార్క్ సమావేశానికి రెండు నెలల ముందు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత సైనిక శిబిరంపై ఉగ్రదాది చేశారు. ఇందులో 19 మంది సైనికులు మరణించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 28న భారత సైన్యం పాక్పై సర్జికల్ స్ట్రైక్ చేసింది. దీని తర్వాత 2019, ఫిబ్రవరి 14న పుల్వామా దాడికి పాల్పడింది. ఆ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ఉగ్రశిబిరాలపై వైమానిక దాడి చేసింది. పుల్వామా దాడి జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ పనిగా గుర్తించింది.
2022లో అప్పటి పాక్ విదేశాంగ ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ భారతదేశమే సార్క్ ప్రక్రియను అడ్డుకుంటుందని ఆరోపించారు. అతని ప్రకటన తర్వాత అప్పటి భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. సార్క్ సమావేశాలు ఆగిపోవడానికి నేపథ్యం అందరికి తెలుసని, పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని అప్పటి నుంచి శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించడానికి ఏకాభిప్రాయం కుదరలేదని అన్నారు.
- Tags
- Bangladesh
- india
- Pakistan
- SAARC
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!