Ditwah Cyclone: దిత్వా తుఫాన్ అప్డేట్.. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- బంగాళాఖాతంలో బలహీనపడుతున్న దిత్వా తుపాను..
- పశ్చిమ మధ్య మరియు దక్షిణ పశ్చిమ బంగాళాఖాతం..
- తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ తీరాలకు దగ్గరగా వాయుగుండం ..
Ditwah Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను వేగంగా తీరం వైపు చేరుకుంటోంది. చెన్నైకి తూర్పున కేవలం 50 కిలోమీటర్లు, తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కదులుతోంది. వాతావరణ శాఖ అర్ధరాత్రికల్లా ఇది మరింత దగ్గరగా, తీరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరం వరకూ చేరే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రేపు పలు జిల్లాల్లో వర్షాలు మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల వర్షపాతం నమోదవుతోంది.
Read Also: T-Safe : తెలంగాణ పోలీసుల ముందడుగు.. మహిళా భద్రతకు ‘టీ-సేఫ్’ విప్లవాత్మక విధానం
Also Read
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
- CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు... రైట్ రాయల్గా బతకాలి..
బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుపాను బలహీన పడుతుంది.. ఈ వాయుగుండం పశ్చిమ మధ్య మరియు దక్షిణ పశ్చిమ బంగాళాఖాతం, తమిళనాడు పుదుచ్చేరి మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చాలా దగ్గరగా కదులుతోంది. గత ఆరు గంటల్లో ఇది 3 కిలో మీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదిలింది. చెన్నైకి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 140 కిలో మీటర్లు, కడలూరుకు 160 కిలో మీటర్లు, నెల్లూరుకు 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది… ఈ తీవ్ర వాయుగుండం కేంద్రం తీరానికి కేవలం 35 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
Read Also: T-Safe : తెలంగాణ పోలీసుల ముందడుగు.. మహిళా భద్రతకు ‘టీ-సేఫ్’ విప్లవాత్మక విధానం
ఈ దిత్వా తుపాను అర్ధరాత్రి వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగి.. ఆ తర్వాత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరి కొన్ని గంటల్లో చెన్నై తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో అత్యంత చేరువ కానుంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.. ఇక ఈ సాయంత్రం 5 గంటల వరకు కొడవలూరు (నెల్లూరు): 38.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. నెల్లూరు: 36.7 మి.మీ, తడ (తిరుపతి): 33.5 మి.మీల వర్షపాతం నమోదు అయ్యింది.. అయితే, దిత్వా తుపాను బలహీన పడిన కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు.. మరి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి నేపథ్యంలో రైతులు, మత్సకారులు, తీరప్రాంత ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!