Ayodhya Rama: అయోధ్య రాములోరి ప్రాణ ప్రతిష్ఠ.. చేనేత కార్మికులకు చేతినిండా పని..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Rama: ‘బనారాసి చీరలు’ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. ఈనెల (జనవరి 22న) అయోధ్య రామమందిరాన్ని ప్రారంభం కానుండటంతో.. బనారసీ చీరలకు ఒక్కసారిగా ఆర్డర్లు పెరిగాయి. ఎందుకు అనుకుంటున్నారా. రాముడి బాల్యం నుంచి రావణ సంహారం వరకు బనారసీ చీరలో అన్ని ముఖ్యమైన అంశాలు ముద్రించి వేయాలని నేత కార్మికులకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆర్డర్ ఇచ్చేవారు చీర అంచులపై శ్రీరామ నామాలు ఉండేలా చూడాలన్నారు. ఒక్కో చీర సగటు ధర రూ.7 వేల నుంచి రూ.లక్ష ఉంటుంది. అయితే ఈ చీరను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ తరహా చీరల తయారీకి ఆర్డర్లు వస్తున్నాయని వారణాసిలోని ముబారక్ పూర్ కంపెనీకి చెందిన చేనేత కార్మికుడు అనిసూర్ రెహమాన్ తెలిపారు. జనవరి 22న, ఇలాంటి చీరలు ధరించి, వారి మహిళలు తమ ప్రాంతాల్లో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారని రెహమాన్ తెఇపారు. మరో చేనేత కార్మికుడు మదన్ కంపెనీ మాట్లాడుతూ.. బనారసీ చీర పల్లుపై రామదర్బార్ ఫోటో ఉండాలని అమెరికా నుంచి రెండు ఆర్డర్లు వచ్చాయన్నారు. ఇలాంటి ఆదేశాలతో వారణాసిలో ‘బనారాసి చీరలు’ నేసే చేనేత కార్మికులు చేతినిండా పని వచ్చి ఫుల్ బిజీ అయ్యామని తెలిపారు. రామ మందిరం నిర్మాణం, ప్రారంభం సందర్భంగా చేనేత కార్మికులందరికి చేతినిండా పని ఉందని అన్నారు. ఇదంతా ఆరాముడి లీల అన్నారు.
Read also: CM Revanth Reddy: యశోద ఆస్పత్రిలో సీఎం.. వెంకట్రెడ్డిని పరామర్శించిన రేవంత్ రెడ్డి
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
మరోవైపు ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభం కానుంది. ఈ వేడుక కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ వేడుకలకు దేశం నలుమూలల నుంచి బహుమతులు అందుతున్నాయి. అందులో భాగంగానే తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్య రామాలయానికి పంపనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. లక్ష శ్రీవారి లడ్డూలను అయోధ్యకు చేరవేయనున్నారు. ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని చెప్పారు. తిరుమలలోని పోటులో ఈ లడ్డూలను టీటీడీ ప్రత్యేకంగా తయారు చేస్తోంది. సాధారణంగా తిరుమలలో భక్తులకు విక్రయించే లడ్డూలు 75 గ్రాములు. అయితే అయోధ్యకు వచ్చే భక్తులకు లక్ష లడ్డూలను ఉచితంగా అందించనున్నారు. త్వరలో ఈ లడ్డూలు అయోధ్యకు చేరుకోనున్నాయి. ఇక తెలంగాణ నుంచి అయోధ్య రామ మందిరానికి 118 తలుపులు దారి. హైదరాబాద్లోని బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో ఇవి రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి రామ్కి రెండు జతల బంగారు పాదుకలను కూడా రాబోతున్నాయి. హైదరాబాద్ సిటీకి చెందిన అయోధ్య భాగ్య నగర సీతారామ ఫౌండేషన్ దాదాపు రూ. 1.03 కోట్ల విలువైన బంగారు పాదుకలను హైదరాబాద్ నగరానికి చెందిన అయోధ్య భాగ్య నగర సీతారామ ఫౌండేషన్ అందిస్తుంది. కాగా.. ఈ పాదుకలను 25 రోజుల పాటు శ్రమించి శిల్పులు ఎంతో వైవిధ్యంగా రూపొందించారు.
Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు!
-
Sambarala Yeti Gattu: క్లైమాక్స్కు చేరుకున్న సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా మూవీ.. చివరి షెడ్యూల్తో భారీ అప్డేట్!
-
Hormonal Imbalance in Women: తెలియకుండా చేసే ఈ అలవాట్లు మహిళల హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.. ఈరోజే మార్చుకోండి!
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!