Nihar Thackeray: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. ఏక్నాథ్ షిండేకు మద్దతు ప్రకటించిన బాల్ ఠాక్రే మనవడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bal Thackeray’s grandson supports CM Ek Nath Shinde: మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్ తగిలింది. శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే మనవడు నిహార్ ఠాక్రే, సీఎం ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలిపాడు. త్వరలో జరిగే అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ముంబై ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పారు. నవంబర్ 3న జరుగుతున్న అంధేరీ ఉపఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే పార్టీ నుంచి రుతుజా లట్కేను ఉద్ధవ్ ఠాక్రే పోటీలో నిలబెడుతుండగా.. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం మద్దతుతో బీజేపీ ముర్జీ పటేల్ ను రంగంలోకి దింపింది.
శివసేనలో చీలిక వచ్చిన తర్వాత జరగబోతున్న మొదటి ఎన్నిక ఇదే కావడంతో ఇరు వర్గాలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. బాల్ ఠాక్రే మొదటి కుమారుడు బింధు మాధవ్ ఠాక్రే కుమారుడే ఈ నిహార్ ఠాక్రే. వృత్తిరీత్యా న్యాయవాది. అసలు శివసేనపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో ఏక్ నాథ్ షిండేతో పోరాడుతున్న లీగల్ టీమ్ లో నిహార్ ఠాక్రే కూడా ఉన్నారు. ఏక్ నాథ్ షిండే తన తాత ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని.. అందుకే మద్దతు ఇచ్చానని నిహార్ ఠాక్రే చెప్పారు.
Also Read
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
Read Also: Unstoppable with NBK: ‘భీమ్లానాయక్’ ఫస్ట్ ఛాయిస్ ఎవరు!?
దసరా వేడుకల్లో షిండేతో నిహార్ ఠాక్రే వేదికను పంచుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే అన్నయ్య జైదేవ్ ఠాక్రే కూడా ఏక్ నాథ్ షిండేతో వేదికను పంచుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే, అతని కుమారుడు ఆదిత్య ఠాక్రే మినహా మిగిలిన కుటుంబం అంతా ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే క్యాంపులోనే ఉన్నారు. బింధుమాధవ్ ఠాక్రే రోడ్డు ప్రమాదంలో మరణించారు. నిహార్ ఠాక్రే బీజేపీలో ఉన్న మాజీ మంత్రి హర్షవర్థన్ పాటిట్ కుమార్తె అంకితా పాటిల్ ను వివాహం చేసుకున్నారు. రాజకీయాల గురించి పెద్దగా ఆలోచించలేదని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపబోనని బాలా సాహెబ్ స్పష్టంగా చెప్పారని.. కారణాలు ఏమైనా కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. 2019లో ప్రజలు పాలించమని అధికారం ఇచ్చిన పార్టీలే ఇప్పుడు అధికారంలో ఉన్నాయని నిహార్ ఠాక్రే అన్నారు.
తాజావార్తలు
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!