Nihar Thackeray: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. ఏక్నాథ్ షిండేకు మద్దతు ప్రకటించిన బాల్ ఠాక్రే మనవడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bal Thackeray’s grandson supports CM Ek Nath Shinde: మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్ తగిలింది. శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే మనవడు నిహార్ ఠాక్రే, సీఎం ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలిపాడు. త్వరలో జరిగే అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ముంబై ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పారు. నవంబర్ 3న జరుగుతున్న అంధేరీ ఉపఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే పార్టీ నుంచి రుతుజా లట్కేను ఉద్ధవ్ ఠాక్రే పోటీలో నిలబెడుతుండగా.. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం మద్దతుతో బీజేపీ ముర్జీ పటేల్ ను రంగంలోకి దింపింది.
శివసేనలో చీలిక వచ్చిన తర్వాత జరగబోతున్న మొదటి ఎన్నిక ఇదే కావడంతో ఇరు వర్గాలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. బాల్ ఠాక్రే మొదటి కుమారుడు బింధు మాధవ్ ఠాక్రే కుమారుడే ఈ నిహార్ ఠాక్రే. వృత్తిరీత్యా న్యాయవాది. అసలు శివసేనపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో ఏక్ నాథ్ షిండేతో పోరాడుతున్న లీగల్ టీమ్ లో నిహార్ ఠాక్రే కూడా ఉన్నారు. ఏక్ నాథ్ షిండే తన తాత ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని.. అందుకే మద్దతు ఇచ్చానని నిహార్ ఠాక్రే చెప్పారు.
Also Read
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
Read Also: Unstoppable with NBK: ‘భీమ్లానాయక్’ ఫస్ట్ ఛాయిస్ ఎవరు!?
దసరా వేడుకల్లో షిండేతో నిహార్ ఠాక్రే వేదికను పంచుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే అన్నయ్య జైదేవ్ ఠాక్రే కూడా ఏక్ నాథ్ షిండేతో వేదికను పంచుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే, అతని కుమారుడు ఆదిత్య ఠాక్రే మినహా మిగిలిన కుటుంబం అంతా ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే క్యాంపులోనే ఉన్నారు. బింధుమాధవ్ ఠాక్రే రోడ్డు ప్రమాదంలో మరణించారు. నిహార్ ఠాక్రే బీజేపీలో ఉన్న మాజీ మంత్రి హర్షవర్థన్ పాటిట్ కుమార్తె అంకితా పాటిల్ ను వివాహం చేసుకున్నారు. రాజకీయాల గురించి పెద్దగా ఆలోచించలేదని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపబోనని బాలా సాహెబ్ స్పష్టంగా చెప్పారని.. కారణాలు ఏమైనా కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. 2019లో ప్రజలు పాలించమని అధికారం ఇచ్చిన పార్టీలే ఇప్పుడు అధికారంలో ఉన్నాయని నిహార్ ఠాక్రే అన్నారు.
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్మన్ గిల్ అవుట్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!