Nihar Thackeray: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. ఏక్నాథ్ షిండేకు మద్దతు ప్రకటించిన బాల్ ఠాక్రే మనవడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bal Thackeray’s grandson supports CM Ek Nath Shinde: మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్ తగిలింది. శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే మనవడు నిహార్ ఠాక్రే, సీఎం ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలిపాడు. త్వరలో జరిగే అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ముంబై ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పారు. నవంబర్ 3న జరుగుతున్న అంధేరీ ఉపఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే పార్టీ నుంచి రుతుజా లట్కేను ఉద్ధవ్ ఠాక్రే పోటీలో నిలబెడుతుండగా.. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం మద్దతుతో బీజేపీ ముర్జీ పటేల్ ను రంగంలోకి దింపింది.
శివసేనలో చీలిక వచ్చిన తర్వాత జరగబోతున్న మొదటి ఎన్నిక ఇదే కావడంతో ఇరు వర్గాలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. బాల్ ఠాక్రే మొదటి కుమారుడు బింధు మాధవ్ ఠాక్రే కుమారుడే ఈ నిహార్ ఠాక్రే. వృత్తిరీత్యా న్యాయవాది. అసలు శివసేనపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో ఏక్ నాథ్ షిండేతో పోరాడుతున్న లీగల్ టీమ్ లో నిహార్ ఠాక్రే కూడా ఉన్నారు. ఏక్ నాథ్ షిండే తన తాత ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని.. అందుకే మద్దతు ఇచ్చానని నిహార్ ఠాక్రే చెప్పారు.
Also Read
- Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
Read Also: Unstoppable with NBK: ‘భీమ్లానాయక్’ ఫస్ట్ ఛాయిస్ ఎవరు!?
దసరా వేడుకల్లో షిండేతో నిహార్ ఠాక్రే వేదికను పంచుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే అన్నయ్య జైదేవ్ ఠాక్రే కూడా ఏక్ నాథ్ షిండేతో వేదికను పంచుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే, అతని కుమారుడు ఆదిత్య ఠాక్రే మినహా మిగిలిన కుటుంబం అంతా ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే క్యాంపులోనే ఉన్నారు. బింధుమాధవ్ ఠాక్రే రోడ్డు ప్రమాదంలో మరణించారు. నిహార్ ఠాక్రే బీజేపీలో ఉన్న మాజీ మంత్రి హర్షవర్థన్ పాటిట్ కుమార్తె అంకితా పాటిల్ ను వివాహం చేసుకున్నారు. రాజకీయాల గురించి పెద్దగా ఆలోచించలేదని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపబోనని బాలా సాహెబ్ స్పష్టంగా చెప్పారని.. కారణాలు ఏమైనా కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. 2019లో ప్రజలు పాలించమని అధికారం ఇచ్చిన పార్టీలే ఇప్పుడు అధికారంలో ఉన్నాయని నిహార్ ఠాక్రే అన్నారు.
తాజావార్తలు
-
Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్గా..
-
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్తో నెలల తరబడి తాజాగా..!
-
Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
-
AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!