Budaun Double Murder: చిన్నారుల హత్య కేసులో ఏం తేలిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ప్రదేశ్లోని బుదౌన్ డబుల్ మర్డర్ కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులను ఓ బార్బర్ అత్యంత దారుణంగా చంపేశాడు. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసుల కాల్పుల్లో నిందితుడు కూడా హతమయ్యాడు.
గర్భవతిగా ఉన్న తన భార్యకు డెలివరీ ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు ఇవ్వాలంటూ నిందితుడు సాజిద్.. పరిచయస్తుడైన వినోద్ ఇంటికి మంగళవారం సాయంత్రం వెళ్లాడు. ఆ డబ్బులు అప్పుగా ఇచ్చేందుకు వినోద్ భార్య సంగీత అంగీకరించింది. అయితే ఆమె లోపలికి వెళ్లినప్పుడు.. ఇంట్లో ఆడుకుంటున్న ఆమె కుమారుడు ఆయుష్ (12)ను సాజిద్ మేడపైకి తీసుకువెళ్లి కత్తితో పొడిచి చంపాడు. ఆయుష్ సోదరులైన అహాన్(7), పియూష్(6) అదే సమయంలో అక్కడికి రావడంతో వారిపైనా దాడికి తెగబడ్డాడు. వీరిలో అహాన్ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పియూష్ మాత్రం స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ పరిణామంతో స్థానికులు, చిన్నారుల కుటుంబ సభ్యులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
పిల్లలను చంపిన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారై సమీప అడవుల్లోకి వెళ్లిపోయాడు. అక్కడ పోలీసులకు తారసపడి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఎదురు కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడని పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే కోపోద్రిక్తులైన స్థానికులు.. సాజిద్ దుకాణాన్ని తగలబెట్టారు.
స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో వైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అలాగే హత్యకు గల కారణాలను కూడా అన్వేషిస్తున్నారు. తాజాగా నిందితుడు సాజిద్ సోదరుడు గౌరవ్ కుమార్ బిష్ణోయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో అతన్ని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలపై లోతుగా విచారిస్తున్నారు. నిందితుడి సోదరుడి నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
మరోవైపు చిన్నారులకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు పోలీసులకు అందింది. ఇద్దరు పిల్లలు, ఆయుష్, అహాన్లకు వీపు, ఛాతీ, కాళ్ళపై 14 దెబ్బలు, 23 కత్తిపోట్లు ఉన్నట్లుగా తేలింది. 23 కత్తిపోట్లు శరీరంపై బలంగా ఉన్నాయని రిపోర్టులో తేలింది. ఈ కారణం చేతనే ఇద్దరు చిన్నారులు చనిపోయినట్లుగా డాక్టర్లు తెలిపారు. ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చిందన్న అంశంపై దర్యాప్తు సాగిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి సోదరుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. అతని నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు. ఇదిలా ఉంటే పాత కక్షలతోనే ఈ దారుణం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అసలేం జరిగిందో తెలియాలంటే నిందితుడి సోదరుడు ఏం చెబుతాడో చూడాలి. నిందితుడి బార్చర్ షాపు.. బాధిత కుటుంబం నివసించే దగ్గరే ఉంది.
#WATCH | Budaun Double Murder Case | On the arrest of the second accused, Javed- who is the brother of accused Sajid, Gaurav Kumar Bishnoi, SHO civil lines, Budaun, says, "He (Javed) is in police custody. The investigation is going on and whatever comes out, it'll be told in the… pic.twitter.com/l2lhPrrqsI
— ANI (@ANI) March 21, 2024
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!