Karnataka: అల్లాపై బీజేపీ నేత వ్యాఖ్యలు.. కలెక్టరేట్ ముందు ముస్లింల ప్రార్థనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: బీజేపీ నేత, మాజీ మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యలపై ముస్లింలు మండిపడుతున్నారు. ఆయన ఇటీవల నమాజ్, అల్లాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ముస్లింలు నిరసన తెలుపుతున్నారు. కర్ణాటక శివమొగ్గ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు ముస్లిం సంఘాల సభ్యులు భారీగా చేరుకుని ఆజాన్ పఠించారు. భారీగా హాజరైన ముస్లింలు ప్రార్థనలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ముందు కూడా ఇదే విధంగా చేస్తామని హెచ్చరించారు.
Read Also: Crime News: కన్నతల్లిని చంపి ఐదు ముక్కలు చేసిన కూతురు.. రెండు నెలలుగా ఇంట్లోనే
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ఈశ్వరప్ప మా తల్లిదండ్రులపై మాట్లాడితే వదిలేస్తాం, కానీ అల్లా, అజాన్ గురించి కామెంట్స్ చేశారని, కావాలంటే కర్ణాటక అసెంబ్లీ ముందు కూడా అజాన్ చదువుతాం, మేం పరికివాళ్ల కాదని, ముస్లిం సమాజం అంతా ఏకం కావాలని అని కలెక్టరేట్ ముందు హాజరైన ముస్లింలు అన్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై శివమొగ్గ పోలీసులు 107 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం చేయవద్దని, వారిని వదిలిపెట్టబోమని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు, విచారణ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే ఈశ్వరప్ప వ్యాఖ్యలపై జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ఇలాంటి సున్నితమైన విషయాలపై వివాదాలకు బీజేపీనే కారణం అని ఆరోపించారు. ఏ బీజేపీ నాయకుడైనా వారి పరిమితుల్లో ఉండాలని సూచించారు. దేశం శాంతియుతంగా ఉండాలన్నారు. మతసామరస్యాన్ని చెడగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ.. ఆజాన్ కోసం ఉపయోగించ లౌడ్ స్పీకర్లు ప్రజలకు, ముఖ్యంగా పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులకు, ఆస్పత్రితో రోగులకు ఇబ్బంది కలిగిస్తున్నాయని అన్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!