Ram Mandir: దేవాలయాల గురించి పూర్తిగా తెలియని కొందరు, మేమే తెలివైన వాళ్లమని మాట్లాడుతూ.. గుడులను కడితే డబ్బులు వృధా, దేవాలయాల వల్ల ఏం జరుగుతుంది.? అని ప్రశ్నిస్తుంటారు. అలాంటి వారికి అయోధ్యలోని రామ మందిరమే సమాధానంగా నిలుస్తుంది. ఒక దేవాలయం ఎంత ఆర్థిక మార్పును తీసుకువస్తుందో, ఆ ప్రాంత ఆర్థిక ముఖచిత్రాన్ని ఎలా మారుస్తుందనే దానికి రామ మందిరం సాక్ష్యంగా నిలుస్తోంది. టెంపులు టూరిజం వల్ల ప్రజల వ్యాపారాలు పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Read Also: Biryani Tax Scam: హైదరాబాద్ బిర్యానీ హోటళ్లలో భారీ స్కాం.. ఏకంగా రూ. 70 వేల కోట్లు..!
తాజాగా ఇండియాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెనేజ్మెంట్ లక్నో(IIM-L) విడుదల చేసిన తాజా అధ్యయనం ప్రకారం, రామ మందిర నిర్మాణం తర్వాత అయోధ్య, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గణనీయమైన ఆర్థిక మార్పులు చోటుచేసుకున్నాయి. ‘‘ ది ఎకనామిక్ రెనైసాన్స్ ఆఫ్ అయోధ్య: ఏ కేస్ స్టడీ ఆన్ రామ్ మందిర్’’ పేరుతో రిపోర్ట్ను విడుదల చేసింది. రామ మందిర నిర్మాణం తర్వాత ఈ ప్రాంతానికి పర్యటాకుల తాకిడి పెరిగిందని చెప్పింది.
ఆలయ ప్రారంభానికి ఏడాదికి 1.7 లక్షల మంది వస్తే, 2024 జనవరి తర్వాత తొలి 6 నెలల్లోనే 11 కోట్లకు పైగా సందర్శకులు అయోధ్యకు వచ్చారు. ఇది కొన్ని నెలల్లోనే 60 రెట్ల పెరుగుదల. అయోధ్య ప్రాంతంలో సుమారుగా రూ. 400 కోట్ల జీఎస్టీ పన్నులు వసూలయ్యాయి. స్థానిక వ్యాపారులు ఐటీ రిజిస్ట్రేషన్లు, ట్యాక్స్లు చెల్లించడం పెరిగింది. ఇన్నాళ్లు పనుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు సొంత గ్రామాలకు తిరిగి వస్తున్నారు. రివర్స్ మైగ్రేషన్ జరుగుతోంది. హోటల్స్ సంఖ్య పెరిగింది. ఆటో రిక్షాలు, హోమ్ స్టేలు, హోటళ్లు పెరిగాయి. రియల్ ఎస్టే్ట్ రంగం పుంజుకుంది. గతంలో వీధి వ్యాపారుల సంఖ్య 500 ఉంటే, ఇప్పుడు ఇది 2000లను దాటింది. ఒకప్పుడు బట్టల షాపులు 150 ఉంటే, ఇప్పుడు 500కు చేరాయి. బ్యాంకులు 15 ఉంటే, 60కు పెరిగాయి.
