Ayodhya Ram Mandir: అయోధ్య రాముడికి వేల కోట్లలో విరాళాలు.. ఇప్పటి వరకు లెక్క ఎంతంటే..
- అయోధ్య రాముడికి వేల కోట్లలో విరాళాలు..
- ఇప్పటి వరకు రూ. 5500 కోట్ల డొనేషన్స్..
- దేశంతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి భక్తుల విరాళాలు..
- ఆలయం నిర్మాణం తర్వాత నుంచి పెరిగిన వేగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరానికి వేల కోట్లలో విరాళాలు వస్తున్నాయి. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మితమైన సంగతి తెలిసిందే. ఒక్క మనదేశం నుంచే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుంచి విరాళాలు వస్తున్నాయి. గత 10 నెల్లలో రూ. 11 కోట్ల విదేశీ విరాళాలతో పాటు గత మూడేళ్లలో అయోధ్య రామమందిరానికి బంగారం, వెండితో సహా రూ. 2000 కోట్లకు పైగా విరాళాలు అందాయి. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు రూ.5500 కోట్ల భారీ విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది.
Read Also: 100 Variety Foods: 100 రకాల పిండి వంటలతో అల్లుడికి ఘనస్వాగతం పలికిన అత్తమామలు..
Also Read
- Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
- Viral: ఫుడ్ పాయిజనింగ్కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
- Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్లో బీజేపీ క్లీన్ స్వీప్!
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
ఉత్తర ప్రదేశ్ అయోధ్యలో చారిత్రాత్మక రామమందిరానికి 2020లో ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. 2021 ఆలయ నిర్మాణం కోసం నిధుల ప్రచారంలో రూ. 3500 కోట్లు వచ్చాయి. అయోధ్య రామమందిర్ ట్రస్ట్ దేశం, అంతర్జాతీయంగా ప్రతి భాగం నుండి విరాళాలు అందించిన వారికి 10,000 పైగా రసీదులను ముద్రించింది. ఈ ఏడాది జనవరిలో అట్టహాసంగా ఆలయం ప్రారంభమైంది. జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ ఆలయాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 24 నాటికి కొత్తగా నిర్మించిన ఆలయానికి 25 కేజీల బంగారం, వెండి ఆభరణాలతో సహా దాదాపు రూ. 25 కోట్ల విరాళాలు వచ్చాయి.
శంకస్థాపన కార్యక్రమం తర్వాత నుంచి భక్తులు రామ్ లల్లాకు విరాళాలు ఇస్తున్నారు. అయితే, ఆలయం ప్రారంభం తర్వాత నుంచి విరాళాల్లో వేగం పెరిగింది. ఆలయానికి రోజూ లక్షల్లో విరాళాలు వస్తున్నాయి. అయోధ్య రామమందిర ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆన్లైన్ చెల్లింపు వ్యవస్థ ద్వారా కూడా భక్తులు విరాళాలను అందిస్తున్నారు. అలాగే బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను భౌతిక రూపాల్లో విరాళాలుగా ఇస్తున్నారు. డిపాజిట్లతో పాటు చెక్కు, డ్రాఫ్ట్లు మరియు నగదు విరాళాలతో సహా అన్ని రూపాల్లో ట్రస్ట్ విరాళాలను స్వీకరిస్తుందని రామమందిర్ ట్రస్ట్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ప్రకాష్ గుప్తా తెలిపారు.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!