Ayodhya gangrape: గ్యాంగ్ రేప్ నిందితుకు డీఎన్ఏ టెస్ట్ డిమాండ్.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ వ్యాఖ్యలపై దుమారం..
- అయోధ్య గ్యాంగ్రేప్పై అఖిలేష్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు..
- డీఎన్ఏ టెస్ట్ చేయాలనే వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం..
- నిందితుల్లో సమాజ్వాదీ పార్టీ కార్యకర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya gangrape: అయోధ్య గ్యాంగ్రేప్ ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో 12 ఏళ్ల చిన్నారిపై రెండు నెలల పాలు అత్యాచారం జరిగినట్లు తెలిసింది. లైంగిక వేధింపుల కారణంగా మైనర్ గర్భవతి కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) కార్యకర్త మోయిద్ ఖాన్తో పాటు రాజు ఖాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో నిందితులకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘‘అకృత్యాల విషయంలో, కేవలం ఆరోపణలు చేయడం మరియు రాజకీయాలు చేయడం ద్వారా కాకుండా, నిందితులకు DNA పరీక్షలు చేయడం ద్వారా న్యాయానికి మార్గం కనుగొనాలి’’ అని అన్నారు. దోషులు ఎవరైనప్పటికీ చట్టప్రకారం శిక్షించాలి. అయితే డీఎన్ఏ పరీక్షలో ఆరోపణలు నిజం కాదని తెలిస్తే, సంబంధిత ప్రభుత్వ అధికారులను కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Read Also: Joe Biden: నన్ను మోసం చేయడం ఆపండి.. ఇజ్రాయెల్ ప్రధానిపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..
Also Read
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
- Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
- AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
డీఎన్ఏ వ్యాఖ్యలపై అధికార బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అఖిలేష్ యాదవ్ నిందితులని సమర్థిస్తున్నాడని, ఇది రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ల మనస్తత్వమని విమర్శించింది. ఈ ఘటనపై ప్రతిపక్ష ఇండియా కూటమి మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించింది. ‘‘మొయీద్ఖాన్ ముస్లిం కావడం, బాధితురాలు నిషాద్ సామాజికవర్గానికి చెందిన మైనర్ బాలిక కావడం వల్లే రేపిస్టులను రక్షించాలని ఇంత ఆరాటమా? ఓట్ల కోసమే పీడీఏ గురించి మాట్లాడుతున్నారా? ఇదీ ముస్లిం బుజ్జగింపుల ఎత్తు. వెనుకబడిన వర్గాలను ఎస్పీ ఎప్పుడూ దోపిడీ చేస్తోంది. కానీ ఈసారి అన్యాయం జరగబోదు’’ అని బీజేపీ ఐటీ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్లో పోస్ట్ చేశారు.
యూపీ డిప్యూటీ సీఎం కేశమ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ బంటు అని విమర్శించారు. మీరు వెనకడినవారు, దళితుల గురించి మరిచిపోయారు, మీకు ఓటు బ్యాంక్ రాజకీయాలే కావాలని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్పీ చీఫ్ మాయావతి మాట్లాడుతూ.. మీరు ఎంత మంది నిందితులకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాని అఖిలేష్ని ప్రశ్నించారు.అయోధ్య సామూహిక అత్యాచార కేసులో బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల్ని ఆమె సమర్థించారు. అఖిలేష్ ప్రకటనపై బాలల హక్కుల పరిరక్షణ కమిష్ చైర్పర్సన్ ప్రియాంక్ కనూంగో ఫైర్ అయ్యారు. బాలికపై అత్యాచారం జరిగితే నిందితుల్ని సమర్థిస్తున్నారని ఇదే మీ డీఎన్ఏ అంటూ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
-
Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
-
China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
-
DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
-
Samantha: పాత గాయాల్ని రేపుతున్న సమంత కామెంట్స్?
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!