Assam: అస్సాంలో మరో మదర్సా కూల్చివేత.. ఈ సారి రంగంలోకి దిగిన స్థానికులు
Fourth Assam Madrassa Demolished: అస్సాంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నెలవుగా మారుతున్నాయి మదర్సాలు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడి.. మదర్సాలే కేంద్రంగా ఉగ్రవాద కర్యకలాపాలకు పాల్పడుతున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వీరంతా మదర్సాల్లో టీచర్లుగా పనిచేస్తూ.. స్థానికులను ఉగ్రవాద భావజాలం వైపు తీసుకెళ్తున్నారు. దీంతో అస్సాం ప్రభుత్వం వీరిపై ఉక్కుపాదం మోపుతోంది. అల్ ఖైదా ఉగ్రసంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న అన్సరుల్లా బంగ్లాటీమ్ అస్సాం కేంద్రంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోంది. హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమాలను చేపట్టింది. ఇప్పటికే అన్సరుల్లా బంగ్లా టీం ఉగ్రవాద సంస్థకు సంబంధించి కార్యకరలాపలకు పాల్పడుతున్న వారిని వరసగా అరెస్ట్ చేస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు అస్సాం పోలీసులు 40 మందిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా బ్రహ్మపుత్ర నదికి అటూఇటూగా ఉన్న జిల్లాల్లో ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
Read Also: OTT: హిందీ మినహా ఆ మూడు భాషల్లో ‘సీతారామం’!
Also Read
ఇదిలా ఉంటే అస్సాం ప్రభుత్వం మదర్సాల వివరాలను కోరింది. అక్రమంగా నిర్వహిస్తున్న మదర్సాలు కూల్చివేస్తోంది. ఏ మదర్సాలు అయితే ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాయో వాటిని ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చేస్తున్నాయి. అన్ని మదర్సాల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని ఇప్పటికే సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఉగ్రవాద చర్యలకు పాల్పడితే మదర్సాలను తప్పకుండా కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే అస్సాంలో పలు జిల్లాల్లో మూడు మదర్సాలను కూల్చేశారు. తాజాగా మరో మసీదును స్థానికులే నేలమట్టం చేశారు.
అస్సాంలోని గోల్పరా జిల్లాలో ఓ మసీదులో బంగ్లాదేశీయులు ఉగ్రవాద కార్యకలపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. స్థానికులు దానిని కూల్చివేశారు. ఇద్దరు బంగ్లాదేశీయలు అమీనుల్ ఇస్లాం, జహంగీర్ అలోమ్ అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీమ్ సభ్యుల అని.. వారు 2020-22 మధ్య మదర్సాలో బోధించారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వీరిద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ కూల్చివేతలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేదని పోలీసులు వెల్లడించారు. జీహాదీ కార్యకలాపాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు ఈ చర్యలకు పాల్పడ్డారు. అస్సాంలో ఉగ్రవాద సంస్థలు స్లీపర్ సెల్స్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎవరైనా రాష్ట్రం వెలుపల నుంచి మదర్సాలో, మసీదుల్లో బోధనలకు వస్తే తప్పుకుండా ప్రభుత్వం పోర్టల్ లో వారి సమాచారం నమోదు చేయాలని అస్సాం ప్రభుత్వం ఆదేశించింది.
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!