Assam Flood: అస్సోంలో భారీ వరదలు.. నిరాశ్రయులైన 2,593 మంది
- అస్సోం రాష్ట్రంలో భారీగా వరదలు..
- జలదిగ్బంధంలోకి వెళ్లిన 671 గ్రామలు..
- ఇప్పటి వరకు నిరాశ్రయులైన 2593 మంది..
- సహాయ చర్యలు కొనసాగిస్తున్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam Flood: అస్సోం రాష్ట్రంలో భారీ వరదలు ముంచెత్తాయి. వరదలతో ధేమాజీలో ఆదివారం మరో ఇద్దరు మరణించారు. దీంతో, ఈ ఏడాది వరదలు, తుఫాన్, కొండ చరియలు విరిగిపడటంతో దాదాపు 44 మందికి పైగా చనిపోయారని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాలతో దిబ్రూగఢ్ లోని బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో పాటు శివసాగర్ లోని మరో రెండు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సోనిత్ పూర్, బార్ పేట, కరీం గంజ్ లోని నదులు ఉప్పొంగిపోయాయి. అసోంలోని 12 జిల్లాల్లో 2. 62 లక్షల మంది వరదల వల్ల ప్రభావితమైనట్లు అధికారులు చెప్పుకొచ్చారు. దాదాపు 671 గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లినట్లు చెప్పారు. ఇక, 2, 593 మంది నిరాశ్రయులు కాగా.. 44 సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారని స్టేట్ డిజాస్టర్ అధికారులు తెలిపారు.
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
అయితే, పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. ధేమాజీ జిల్లాలో 300 మంది, టిన్సుకియాలో 20 మంది, దిబ్రూగఢ్ లో ముగ్గురిని బోట్ల ద్వారా రక్షించిట్లు అధికారులు చెప్పారు. ధేమాజీ జిల్లాలో పడవల ద్వారా దాదాపు వెయ్యి జంతువులను సైతం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇవే కాకుండా, పలు ప్రాంతాల్లో వరదల వల్ల రోడ్లు, వంతెనలు, కట్టలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక, కేంద్రమంత్రి సోనోవాల్ దిబ్రూగఢ్ నియోజకవర్గంలో వరద పరిస్థితిని పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని దాటడంతో.. అక్కడ వరద పరిస్థితిని కూడా కేంద్రమంత్రి పరిశీలించారు.
తాజావార్తలు
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
-
MS Dhoni Retirement: ఎంఎస్ ధోనీ చివరి మ్యాచ్ ఆడనున్నాడా?.. చెపాక్లో ఎమోషనల్ ఫేర్వెల్?
-
TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..