PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న విమానం అస్సాంలోని మోరాన్లోని హైవేపై ల్యాండ్ అయింది. ఇది చారిత్రాత్మక ల్యాండింగ్గా నిలిచింది. ఈశాన్య రాష్ట్రాల్లో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ(ELF) వద్ద విమానం ల్యాండ్ అయింది. ఇది దేశ వ్యూహాత్మక, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది. అత్యవసర సమయాల్లో భారత వైమానిక దళ యుద్ధ విమానాలు టేకాఫ్, ల్యాండ్ అయ్యేల ఈ నేషనల్ హైవేని అభివృద్ధి చేశారు. శనివారం ఈ రన్వేను ప్రధాని మోడీ ప్రారంభించారు.…
Assam Flood: అసోంలో వరదల కారణంగా అక్కడ పరిస్థితి మరింత దిగజారుతోంది. గురువారం మరో ఆరుగురు మరణించారు. వీరిలో నలుగురు గోలాఘాట్కు చెందినవారు కాగా, ఒక్కొక్కరు దిబ్రూగఢ్, చరైడియో నుండి వచ్చారు.
Assam Flood: అస్సోం రాష్ట్రంలో భారీ వరదలు ముంచెత్తాయి. వరదలతో ధేమాజీలో ఆదివారం మరో ఇద్దరు మరణించారు. దీంతో, ఈ ఏడాది వరదలు, తుఫాన్, కొండ చరియలు విరిగిపడటంతో దాదాపు 44 మందికి పైగా చనిపోయారని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధికారులు పేర్కొన్నారు.