Arvind Kejriwal: 2024లో బీజేపీ గెలిచినా.. 2029లో ఆ పార్టీ నుంచి దేశాన్ని విముక్తి చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత బీజేపీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీకి ఆప్ అతిపెద్ద ముప్పుగా ఉందని, అందుకే తమ పార్టీపై, నేతలపై అన్ని వైపుల నుంచి దాడులు చేస్తోందని కేజ్రీవాల్ అన్నారు. తాను అనేక దాడుల్ని ఎదుర్కొంటున్నానని, ఇప్పుడు తనను అరెస్ట్ చేయాలని బీజేపీ అనుకుంటుందని, తనను అరెస్ట్ చేసినా, తన ఆలోచనల్ని బీజేపీ అడ్డుకోగలదా..? అని సవాల్ విసిరారు.
Read Also: Neti Bharatham: ఒకే పాత్రతో ‘నేటి భారతం’ సినిమా.. ఆసక్తికరంగా ట్రైలర్
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
అరవింద్ కేజ్రీవాల్ ఇలా విశ్వాస పరీక్ష పెట్టుకోవడం ఇది రెండో సారి. 70 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తామని చెబుతూ.. బీజేపీ నేతలు తమ ఇద్దరు ఎమ్మెల్యేలను సంప్రదించారిన ఆయన మరోసారి ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లు, వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ ఇచ్చారని, అయినా కూడా తమ ఎమ్మెల్యేలు తలొగ్గలేదని చెప్పారు.
2024 ఎన్ని్కల్లో బీజేపీ గెలిచినప్పటికీ, 2029లో బీజేపీ నుంచి దేశాన్ని ఆప్ విముక్తి చేస్తుందని కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు మమ్మల్ని అధికారంలోకి దించాలని చెబుతున్నారని, ఇదే హామీతో మీరు ప్రజల్ని ఓట్లు అడగండి, నేనే మీ కోసం పనిచేస్తా అని అన్నారు. బీజేపీ భవిష్యత్తుపై భయం ఉందని అందుకు కారణం ఆప్ అని కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీ కేంద్ర ఏజెన్సీల ద్వారా తమ మంత్రుల్ని అరెస్ట్ చేసిన తీరును దేశం మొత్తం చూసిందని, ప్రజలు మూర్ఖులని వారు భావిస్తున్నారా.?? అంటూ ప్రశ్నించారు. వారు రామ భక్తులమని చెప్పుకుంటారు, కానీ ఆస్పత్రుల్లో ప్రజలకు వైద్యం అందించరని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్బుక్ CX15 భారత్లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!