Arvind Kejriwal: రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపిన అరవింద్ కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీకి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ అధ్యక్షులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసుల బిల్లు కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు వ్యతిరేకంగా లోక్సభతోపాటు, రాజ్యసభలోనూ వ్యతిరేకంగా ఓటు వేసినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలుపుతూ .. రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ.. ఆయనకు లేఖ కూడా రాశారు.
Read also: Skanda: బోయపాటి- రామ్ పోతినేని ‘స్కంద’ గుమ్మడికాయ కొట్టేశారు
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
అరవింద్ కేజ్రీవాల్ తన లేఖలో ఢిల్లీ సర్వీసుల బిల్లును తిరస్కరించి.. వ్యతిరేకంగా ఓటు వేసినందుకు మీకు ధన్యవాదాలు. కాంగ్రెస్ ఇచ్చిన మద్దతుకు ఢిల్లీలోని కోట్లాది ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ.. మీకు ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. ఢిల్లీ ప్రజల హక్కుల కోసం పార్లమెంటులో ఎంతో పోరాడుతున్నారని.. రాజ్యాంగం పట్ల మీకున్న విధేయత దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని.. రాజ్యాంగాన్ని అణగదొక్కే వారికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో మీ మద్దతు కోసం ఎదురు చూస్తున్నామని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశ రాజధానిలోని పరిపాలన సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్కి అప్పగించేలా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటి నుంచి ఢిల్లీ ప్రభుత్వం దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని కోరుతూ జాతీయ పార్టీలతోపాటు.. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతీయ పార్టీలను అరవింద్ కేజ్రీవాల్ మద్ధతు కోరిన విషయం తెలిసిందే. లోక్సభలో ఈ బిల్లు పొందిన తరువాత రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 131 మంది ఓట్లు వేయగా, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. లోక్సభ, రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో రాష్ట్రపతి ఆమోదం లభించిన అనంతరం ఢిల్లీ సర్వీసెస్ బిల్లు కాస్త చట్టంగా మారిపోతుంది.
తాజావార్తలు
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!