Presidential Election: విపక్షాల్లో చీలిక..! కేసీఆర్ బాటలో కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు దేశరాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు… కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. తాము నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని.. కాంగ్రెస్, దాని మిత్రాలను కోరనుంది బీజేపీ. ఇందులో భాగంగా విపక్షాలతో చర్చల జరిపే బాధ్యతను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు అప్పగించింది. విపక్షాలు అభ్యర్థిని నిలబెట్టకుండా.. తాము నిలిపే అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని కోరేందుకు సిద్ధమయ్యాయి. ప్రెసిడెంట్ పదవికి పోటీ పడే అభ్యర్థిని ప్రకటించకుండా.. మద్దతు ఇవ్వాలని కోరడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, ఇదే సమయంలో.. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.. అందులో భాగంగా టీఎంసీ సుప్రీం, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. బీజేపీయేతర పక్షాలతో సమావేశం ఏర్పాటు చేయగా.. విపక్షాల్లో చీలక స్పష్టంగా కనిపిస్తోంది.
Read Also: Dowry ban: ఆ ఊళ్లో వరకట్నం నిషేధం..
Also Read
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
హస్తినలో ఇవాళ మమతా బెనర్జీ నిర్వహించే సమావేశానికి… దూరంగా ఉండాలని ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు.. ఆయన వెళ్లకపోవడమే కాదు.. ఆ పార్టీ నుంచి కూడా ఎవ్వరినీ పంపించడంలేదు.. కాంగ్రెస్ పార్టీని ఈ సమావేశానికి ఆహ్వానించడంతో.. ఆ పార్టీతో కలిసి వేదిక పంచుకోవడం ఇష్టంలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీఆర్ఎస్ ప్రకటించింది. ఇక, ఆమ్ఆద్మీ పార్టీ చీప్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారు.. దీదీ నిర్వహిస్తోన్న విపక్షాల భేటీకి హాజరుకావడంలేదని పేర్కొంది ఆప్.. దీంతో, దీదీ ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశానికి ఏయే పార్టీల అధినేతలు వెళతారన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది.
మమతా బెనర్జీ 22 పార్టీలకు ఆహ్వానాలు పంపితే… కొన్ని పార్టీలు మాత్రమే స్పందించాయి. కాంగ్రెస్ పార్టీ తమ ప్రతినిధుల పేర్లను నిర్ణయించింది. ఇక, ఈ సమావేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే.. కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్షం లేదన్న ఆయన.. విపక్షాల ఐక్యతను దెబ్బతీయకూడను అనే ఉద్దేశంతోనే మమతా బెనర్జీ నిర్వహిస్తోన్న సమావేశానికి వెళ్లనున్నట్టు తెలిపారు. మరోవైపు.. రాహుల్ గాంధీ ఈడీ విచారణ వ్యవహారంలో మేం ఎవరి మద్దతు కోరలేదని స్పష్టం చేశారు ఖర్గే.. కాగా, ఇప్పటికే రెండు రోజుల పాటు రాహుల్ గాంధీని సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ.. ఇవాళ మూడో రోజు కూడా రాహుల్ను విచారించనున్నారు.
తాజావార్తలు
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
-
Elon Musk: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
-
Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
-
Vaibhav Sooryavanshi-BCCI: అసలు వైభవ్ సూర్యవంశీ మా ప్రణాళికల్లోనే లేడు.. పెద్ద బాంబ్ పేల్చిన బీసీసీఐ!
-
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్లకు గట్టి పోటీ
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!