Arvind Kejriwal: ప్రభుత్వాలను హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్ బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: బీజేపీపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను వరుసగా హత్య చేస్తున్న సీరియర్ కిల్లర్ బీజేపీ అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సర్కారును కూడా కూల్చేందుకు బీజేపీ యత్నించిందని, బీజేపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలోకి లాక్కోవాలని యత్నించిందని.. కానీ ఆప్ నేతలు వారి బుట్టలో పడలేదని ఆయన అన్నారు. తన బలాన్ని నిరూపించుకునేందుకు అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు తాను సిద్ధమన్నారు. తమ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్లలేదనే విషయాన్ని బల పరీక్షలో నిరూపిస్తానని తెలిపారు. ఆప్ ప్రభుత్వం సోమవారం ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం తీసుకురానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ఢిల్లీలో బీజేపీ చేపట్టిన ‘ఆపరేషన్ కమలం’, ఢిల్లీ మద్యం పాలసీలో అవినీతి ఆరోపణలపై కేజ్రీ సర్కారు ఢిల్లీ అసెంబ్లీ పత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో కేజ్రీవాల్ బీజేపీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఇరికించేందుకు సీబీఐ ఎంతో ప్రయత్నించిందని… ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో ఒక్క పావలాను కూడా పట్టుకోలేకపోయారని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఇది జరిగిన మరుసటి రోజే మనీష్ను ఒక బీజేపీ నేత సంప్రదించారని… ఆప్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకురావాలని… ముఖ్యమంత్రి పదవిని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లను ఇస్తామని ఆఫర్ ఇచ్చారని చెప్పారు. అయితే మనీష్ ఈ ఆఫర్ను తిరస్కరించారని… దీంతో వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలను కలిసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలందరూ వజ్రాలని… వారిని ఎవరూ కొనలేరని అన్నారు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Congress: కాంగ్రెస్కు మరో షాక్.. ఆజాద్కు మద్దతుగా 5గురు నేతలు రాజీనామా
తమ 40 మంది ఎమ్మెల్యేలను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఒక్కొక్కరికి రూ. 20 కోట్లు ఆఫర్ చేసిందని ఆప్ ఆరోపించింది. “బిజెపి అనేక ప్రభుత్వాలను కూల్చివేసింది. ఇప్పుడు వారు ఢిల్లీ వైపు మొగ్గు చూపారు. మన దేశంలో ప్రభుత్వాల వరుస హత్యలు జరుగుతున్నాయి” అని కేజ్రీవాల్ అన్నారు. ఇటీవలి సంవత్సరాలలో ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టడానికి బీజేపీ 277 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరోపించారు. “ఇటీవలి సంవత్సరాలలో 277 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసింది. ఆపరేషన్ కమలం కోసం బీజేపీ రూ.5,500 కోట్లు ఖర్చు చేసింది, రూ.800 కోట్లు ఢిల్లీ కోసం ఉంచింది” అని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీకి అంత డబ్బు ఎలా వచ్చిందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. “ఖరీదైన చమురు, ఇంధనం, నిత్యావసరాల నుంచి వచ్చే డబ్బు అంతా ఎమ్మెల్యేల కొనుగోలుకే వినియోగిస్తున్నారు. జీఎస్టీ (వస్తు సేవల పన్ను), ద్రవ్యోల్బణం నుంచి వచ్చిన డబ్బులన్నీ ఎమ్మెల్యేలను కొనడం, బిలియనీర్ స్నేహితుల రుణాలు మాఫీ చేయడం అనే రెండు పనుల కోసం వెచ్చిస్తున్నారు.” అని కేజ్రీవాల్ అన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!