Arunachal Pradesh: ఇండియా-చైనా బోర్డర్ లో తప్పినపోయిన 19 మంది కూలీలు.. ఏడుగురి రెస్క్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arunachal Pradesh Workers Missing: మూడు వాారాలుగా అరుణాచల్ ప్రదేశ్, చైనా బోర్డర్ లో కనిపించకుండా పోయిన 19 మంది కూలీల్లో ఏడుగురు కూలీలను భారత వైమానికి దళం రెస్క్యూ చేసింది. కూలీలు కనిపించకుండా పోయిన ప్రాంతం చైనా సరిహద్దుకు అతిసమీపంలో ఉండటంతో కొంత ఆందోళన నెలకొంది. ఈ నెల ప్రారంభంలో ఎల్ఏసీ సమీపంలోని అరుణాచల్ ప్రదేశ్ మారుమూల జిల్లా కురంగ్ కుమే జిల్లాలో అస్సాంకు చెందిన 19 మంది కూలీలు తప్పిపోయారు. ప్రస్తుతం వీరిలో ఏడుగురు కూలీలను గుర్తించారు. వీరంతా చైనా, భారత్ సరిహద్దుల్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్( బీఆర్వో) నిర్మిస్తున్న రోడ్డు పనుల కోసం అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు వచ్చారు.
అయితే ఈ నెల ఈద్ అల్-అదా జరుపుకునేందుకు అస్సాంకు తిరిగి వెళ్లడానికి కాంట్రాక్టర్ నిరాకరించడంతో కూలీలు మూడు బృందాలుగా ఏర్పడి క్యాంపు నుంచి తప్పించుకున్నారు. అయితే మారుమూల ప్రాంతం కావడంతో మూడు వారాలుగా వీరి ఆచూకీ కనుక్కోవడం కష్టం అయింది. సేర్చ్, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన భారత వైమానిక దళం హెలికాప్టర్లు హురీ సమీపంలోని డామన్ లో శుక్రవారం ఏడుగురు కూలీలను రక్షించారు. ప్రస్తుతం రక్షించబడిన కూలీలు మాట్లాడే పరిస్థితిలో లేరు. తప్పిపోయిన కూలీల్లో ఇప్పటికే ఒకరు మరణించారు. ఫురాక్ నదిలో ఒక కార్మికుడి మృతదేహాన్ని కనుక్కున్నారు. జూలై 13న స్థానిక పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు కురుంగ్ కుమే జిల్లా ఎస్పీ వెల్లడించారు.
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
Read Also: Asaduddin Owaisi: మాంసం దుకాణాల మూసివేతపై అసదుద్దీన్ ఫైర్
మిగిలిన కూలీల కోసం ఎస్డీఆర్ఎఫ్ తో పాటు వాయుసేన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం రెస్క్యూ చేయబడ్డ కూలీలకు వైద్య సహాయం అందిస్తున్నారు. మిలిగిన 11 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం చైనా- ఇండియా బోర్డర్ లో అరుణాచల్ ప్రదేశ్ లో నిర్మితమవుతున్న రోడ్డు వ్యూహాత్మకంగా చాలా కీలకం అయినది. ఇది చైనా బోర్డర్ కు కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇదిలా ఉంటే కార్మికులను తీసుకువచ్చిన అస్సాం లఖీంపూర్ కు చెందిన సబ్ కాంట్రాక్టర్ పై కేసు నమోదు అయింది.
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!