India-China: ముమ్మాటికీ అరుణాచల్ మాదే.. చైనా వ్యాఖ్యల్ని ఖండించిన భారత్
- అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగం
- తమదేనన్న చైనా వ్యాఖ్యల్ని ఖండించిన భారత్
- తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్
- ఇంకా అధికారికంగా స్పందించని చైనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరుణాచల్ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం అని.. విడదీయరాని భాగం అని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్ప్రదేశ్ మహిళను అదుపులోకి తీసుకోవడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. షాంఘై విమానాశ్రయంలో 18 గంటల పాటు నిర్బంధించడంపై తప్పుపట్టింది. భారతీయ మహిళ పాస్పోర్టును నిరాకరించడంపై భారత్ నిరసన వ్యక్తం చేసిందని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. చైనాకు తమ వాదనను వినిపించామని.. నిర్బంధంపై ఇంకా చైనా వివరణ ఇవ్వలేదని విదేశాంగ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Ayodhya : అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం- కాషాయ పతాకాన్ని ఆవిష్కరించిన మోదీ
Also Read
- CM Vijay - Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?
- Road Tax: ఆ కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్న్యూస్.. 50% రోడ్ టాక్స్ మినహాయింపు!
- Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
- IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన థాంగ్డోక్ అనే మహిళ నవంబర్ 21న లండన్ నుంచి జపాన్కు వెళ్లే విమానం ఎక్కింది. ట్రాన్సిట్హాల్ట్ కోసం విమానం చైనాలోని షాంఘైలో ఆగింది. దీంతో థాంగ్డోక్కు చెందిన పాస్పోర్ట్ను ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. పుట్టిన ప్రాంతం అరుణాచల్ప్రదేశ్ అని ఉండడంతో ఇమిగ్రేషన్ అధికారులు 18 గంటల పాటు నిర్బంధించారు. పాస్పోర్ట్ చెల్లదని, అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని, తమ దేశం పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకోమని హేళన చేసినట్లుగా బాధితురాలు సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం తనను ఆహారం కొనేందుకు కూడా అనుమతించలేదని, భారత దౌత్య సిబ్బంది సహాయంతో తాను అక్కడి నుంచి బయటపడ్డానని తెలిపింది.
ఇది కూడా చదవండి: Story Board : అమరావతి పూర్తవ్వకపోతే చంద్రబాబుకు కష్టాలేనా.?
చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు వ్యవహరించిన తీరుపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ముమ్మాటికీ భారత్లో భాగమని.. విడదీయరాని భాగం అని పేర్కొంది. భారత పాస్పోర్టుతో ప్రయాణించేందకు పూర్తి అర్హురాలు అని చైనాకు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
CM Vijay – Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?
-
YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
-
Fertility Rate: పిల్లలను కనలేం బాబోయ్.. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న సేమ్ సీన్.. కారణాలేంటి?
-
Lenin: ‘అయ్యగారు’ మాట మేరకే లెనిన్ వాయిదా?
-
Oh..! Sukumari Teaser: ఐశ్వర్య రాజేష్ను ముట్టుకుంటే షాక్ కొడుతుందా?.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ఓ..! సుకుమారి’ టీజర్!
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!