Arunachal Pradesh: 21 మందిపై లైంగిక దాడికి పాల్పడిన వార్డెన్కు మరణశిక్ష!
- లైంగిక దాడి కేసులో అరుణాచల్ప్రదేశ్ కోర్టు సంచలన తీర్పు
- లైంగిక దాడికి పాల్పడిన వార్డెన్కు మరణశిక్ష!
- 21 మందిపై వార్డెన్ అఘాయిత్యం
- మాజీ ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో టీచర్కు 20 ఏళ్ల జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరుణాచల్ప్రదేశ్లో 2014-2022 వరకు 21 మందిపై లైంగిక దాడికి పాల్పడిన హాస్టల్ వార్డెన్కు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి మరణశిక్ష విధిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇదే కేసులో మాజీ ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో టీచర్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు డిప్యూటీ సీఎం పవన్కు ఆహ్వానం
Also Read
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
అరుణాచల్ప్రదేశ్లోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో లైంగిక దాడుల వ్యవహారం 2022లో వెలుగు చూసింది. తన 12 ఏళ్ల కవల కుమార్తెలను హాస్టల్ వార్డెన్ లైంగికంగా వేధిస్తున్నాడని ఓ తండ్రి ఫిర్యాదు చేశాడు. మరికొందరు బాధితులు కూడా ఇటువంటి ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో వార్డెన్ అరాచకాలు బయటపడ్డాయి. 2014-22 మధ్యకాలంలో 21 మంది మైనర్లపై అతడు లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడినట్లు తేలింది. బాగ్రా హాస్టల్ వార్డెన్గా ఉన్న సమయంలో 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల ఆరుగురు బాలురుతో సహా కనీసం 21 మంది మైనర్లపై దాడి చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది.
ఇది కూడా చదవండి: సరిగమప సీజన్ 16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ గ్రాండ్ లాంచ్
గతేడాది జులైలో దాఖలు చేసిన ఛార్జిషీట్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. లైంగిక దాడికి పాల్పడేముందు బాధితులకు వార్డెన్ మత్తుమందు ఇచ్చేవాడని తేలింది. ఈ విషయాలు బయటకు చెప్పకూడదని బెదిరింపులకు పాల్పడేవాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆరుగురు బాధితులు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారని తేలింది. వార్డెన్ ఆగడాల గురించి ఓ మహిళా టీచర్కు బాధిత చిన్నారులు చెప్పినప్పటికీ.. పై అధికారుల దృష్టికి ఆమె తీసుకెళ్లలేదని దర్యాప్తులో వెల్లడైంది. విచారణ జరిపిన పోక్సో న్యాయస్థానం వార్డెన్కు మరణశిక్ష విధించగా.. మాజీ ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో మహిళా టీచర్కు 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది.
ఇది కూడా చదవండి: Godhra Train Burning Case: “గోద్రా రైలు దహనం”పై జనవరి 15న సుప్రీంకోర్టు విచారణ..
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?