జమ్మూకాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లలో 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు భద్రతా దళాలు పేర్కొన్నాయి. నిఘా వర్గాల సమాచారంతో ఆపరేషన్ పూర్తి చేసినట్లు ఫోర్స్ మేజర్ జనరల్ ధనంజయ్ జోషి విలేకరులకు తెలిపారు. కాశ్మీర్లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఆపరేషన్లు చేపట్టినట్లు పేర్కొ్న్నారు. మార్చిలో జరిగిన ఒక సర్చాచ్ హత్యలో ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒకరు ఉన్నారని పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా. వారిని కనుగొని మట్టుబెడతామని చెప్పారు.
ఇది కూడా చదవండి: Amazfit Bip 6: 1.97 అంగుళాల డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, 14 రోజుల బ్యాటరీ లైఫ్తో అమెజ్ఫిట్ బిప్ 6 విడుదల..!
కేలార్లోని ఎత్తైన ప్రాంతాల్లో ఉగ్రవాద సంస్థ ఉనికి గురించి మే 12న సైన్యానికి సమాచారం అందిందని చెప్పారు. మరుసటి రోజు ఉదయం కదలికను చూసిన భద్రతా దళాలు ఉగ్రవాదులను సవాలు చేశాయి. కానీ వారు ఎదురుకాల్పులతో స్పందించారని, భద్రతా దళాలు త్వరలోనే మట్టుబెట్టాయన్నారు. ఇక రెండో ఆపరేషన్ ట్రాల్లో సరిహద్దు గ్రామంలో జరిగిందన్నారు. గ్రామాన్ని చుట్టుముడుతుండగా ఉగ్రవాదులు వేర్వేరు ఇళ్లలో మోహరించి కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఈ సమయంలో గ్రామస్తులను రక్షించడంపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. అనంతరం ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు వెల్లడించారు. ఆరుగురు ఉగ్రవాదులలో ఒకరైన షాహిద్ కుట్టే రెండు ప్రధాన దాడుల్లో పాల్గొన్నాడని పేర్కొన్నారు. జర్మన్ పర్యాటకుడిపై దాడి కూడా ఉందన్నారు. పుల్వామాలో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులు జైష్-ఎ-మొహమ్మద్ (JeM) కు చెందినవారు. ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వాని, యావర్ అహ్మద్ భట్గా గుర్తించారు.
ఇది కూడా చదవండి: Defence Budget: ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ బడ్జెట్ భారీగా పెంపు.. ఎంతంటే..!