Agniveer recruitment: అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మార్చిన సైన్యం.. వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agniveer recruitment: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆర్మీలో ‘అగ్నివీర్’ పథకాన్ని తీసుకువచ్చింది. దీనిపై పలు పార్టీల నుంచి వ్యతిరేకత వచ్చినా.. హింసాత్మక చర్యలకు పాల్పడిని కేంద్ర వెనక్కి తీసుకోలేదు. అయితే అగ్నివీర్ పథకానికి యువత నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. పెద్ద ఎత్తున యువకులు అగ్నివీరులుగా మారడానికి అప్లై చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అగ్నివీర్ రిక్రూట్మెంట్ పథకంలో మార్పులు చేయబోతోంది సైన్యం.
ఇండియన్ ఆర్మీ ఫోర్స్లో చేరాలనుకునే అభ్యర్థుల కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియలో మార్పులను ప్రకటించింది. ఈ పథకం కింద సైన్యంలో చేరాలనుకునే వారు ముందుగా ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ)కి హాజరుకావాలి. ఆ తరువాత ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్ట్లకు హాజరు కావాలి. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ ఫిబ్రవరి మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది.
Also Read
- Pakistan: పాకిస్తాన్కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్పై బౌంటీ పెంపు..
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
Read Also: CM KCR : సీఎం కేసీఆర్తో మహారాష్ట్ర నేతలు భేటీ..
అంతకుముందు అగ్నివీర్ రిక్రూట్మెంట్ లో అభ్యర్థులు మొదటగా ఫిజికల్ ఫిట్ నెస్, ఆ తరువాత మెడికల్ టెస్టులకు హాజరయ్యేవారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఉమ్మడి ప్రవేశపరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ తరువాత మెరిట్ జాబితా ఆధారంగా శిక్షణకు ఎంపికయ్యేవారు. అయితే ఫిజికల్, మెడికల్ టెస్టుల కోసం రిక్రూట్మెంట్ ర్యాలీలను నిర్వహించడంలో అయ్యే ఖర్చులను తగ్గించడానికి ఎంపిక ప్రక్రియలో మార్పు చేసినట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ప్రవేశ అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఫిజికల్, మెడికల్ టెస్టులకు హాజరుఅవుతారు. దీంతో పరిపాలన, రవాణా ఖర్చులు తగ్గుతాయని భావిస్తున్నారు.
గతంలో ఉన్న రిక్రూట్మెంట్ ప్రక్రియలో దేశవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ స్క్రీనింగ్ కేంద్రాల వద్ద లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తుండటంతో ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. 2023-24 తదుపరి రిక్రూట్మెంట్ నుండి సైన్యంలో చేరేందుకు సిద్ధంగా ఉన్న దాదాపు 40,000 మంది అభ్యర్థులకు కొత్త ప్రక్రియ వర్తిస్తుంది. మొదటి ఆన్లైన్ సీఈఈ ఏప్రిల్లో దేశవ్యాప్తంగా దాదాపు 200 స్థానాల్లో నిర్వహించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!