Agniveer recruitment: అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మార్చిన సైన్యం.. వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agniveer recruitment: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆర్మీలో ‘అగ్నివీర్’ పథకాన్ని తీసుకువచ్చింది. దీనిపై పలు పార్టీల నుంచి వ్యతిరేకత వచ్చినా.. హింసాత్మక చర్యలకు పాల్పడిని కేంద్ర వెనక్కి తీసుకోలేదు. అయితే అగ్నివీర్ పథకానికి యువత నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. పెద్ద ఎత్తున యువకులు అగ్నివీరులుగా మారడానికి అప్లై చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అగ్నివీర్ రిక్రూట్మెంట్ పథకంలో మార్పులు చేయబోతోంది సైన్యం.
ఇండియన్ ఆర్మీ ఫోర్స్లో చేరాలనుకునే అభ్యర్థుల కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియలో మార్పులను ప్రకటించింది. ఈ పథకం కింద సైన్యంలో చేరాలనుకునే వారు ముందుగా ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ)కి హాజరుకావాలి. ఆ తరువాత ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్ట్లకు హాజరు కావాలి. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ ఫిబ్రవరి మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది.
Also Read
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
Read Also: CM KCR : సీఎం కేసీఆర్తో మహారాష్ట్ర నేతలు భేటీ..
అంతకుముందు అగ్నివీర్ రిక్రూట్మెంట్ లో అభ్యర్థులు మొదటగా ఫిజికల్ ఫిట్ నెస్, ఆ తరువాత మెడికల్ టెస్టులకు హాజరయ్యేవారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఉమ్మడి ప్రవేశపరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ తరువాత మెరిట్ జాబితా ఆధారంగా శిక్షణకు ఎంపికయ్యేవారు. అయితే ఫిజికల్, మెడికల్ టెస్టుల కోసం రిక్రూట్మెంట్ ర్యాలీలను నిర్వహించడంలో అయ్యే ఖర్చులను తగ్గించడానికి ఎంపిక ప్రక్రియలో మార్పు చేసినట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ప్రవేశ అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఫిజికల్, మెడికల్ టెస్టులకు హాజరుఅవుతారు. దీంతో పరిపాలన, రవాణా ఖర్చులు తగ్గుతాయని భావిస్తున్నారు.
గతంలో ఉన్న రిక్రూట్మెంట్ ప్రక్రియలో దేశవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ స్క్రీనింగ్ కేంద్రాల వద్ద లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తుండటంతో ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. 2023-24 తదుపరి రిక్రూట్మెంట్ నుండి సైన్యంలో చేరేందుకు సిద్ధంగా ఉన్న దాదాపు 40,000 మంది అభ్యర్థులకు కొత్త ప్రక్రియ వర్తిస్తుంది. మొదటి ఆన్లైన్ సీఈఈ ఏప్రిల్లో దేశవ్యాప్తంగా దాదాపు 200 స్థానాల్లో నిర్వహించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
-
Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
-
Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!