మాస్క్ ధరిస్తున్న వారు 2శాతమేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఫస్ట్, రెండో వేవ్ దేశాన్ని ఎంతగా వణికించిందో అందరూ మర్చిపోయారు. మాస్క్లు ధరించకుండా బయట తిరుగుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో కేవలం 2శాతం మంది మాత్రమే మాస్కులు ధరిస్తున్నారని ‘లోకల్ సర్కిల్స్’ అనే సామాజిక సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న ప్రతి ముగ్గురులో ఒకరు మాస్కు ధరించటం లేదనిఈ సర్వే తెలిపింది.
ఈ ఏడాది ఏప్రిల్తో పోల్చితే మాస్క్ పెట్టుకునేవారి సంఖ్య సెప్టెంబర్లో 29శాతం పడిపోయిందని తెలిపింది. కరోనా వైరస్లలో అత్యంత వేగంగా వ్యాపించే లక్షణమున్న ఒమిక్రాన్ వైరస్ బయటపడినవేళ ఈ సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా 364 జిల్లాల్లో 25వేల మంది నుంచి వివరాలు సేకరించారు. ”మీ ప్రాంతంలో బయట తిరుగుతున్నవారిలో ఎంతమంది మాస్క్లు పెట్టుకుంటున్నారు?” అని ప్రశ్నించారు.
Also Read
- Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
- US: అమెరికాలో ఘోరం.. స్టోర్లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
- Mamata Banerjee: కదులుతున్న తృణమూల్ పునాదులు.. వరుస షాక్లతో దీదీ విలవిల..
- DK Shivakumar: కర్ణాటక సీఎం రేసులో భారీ ట్విస్ట్.. పీసీసీ చీఫ్కు డీకే రాజీనామా..!
ఈ నేపథ్యంలో వచ్చిన సమాధానాల్ని క్రోడీకరించగా, వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సరైన పద్ధతిలో మాస్క్లు ధరిస్తున్నవారు కేవలం 2శాతం మందే ఉన్నారు. ఎక్కడా ఎవరూ మాస్క్లు పెట్టుకోవటం లేదని సర్వేలో పాల్గొన్న 8 శాతం మంది చెప్పారు. దేశంలో ఇప్పటికే 21 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఈ సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మాస్క్లు ధరించటం లేదని వచ్చిన సమాధానం తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తుంది. 5శాతం మంది మాస్క్ల్ని సరిగ్గా ధరిస్తున్నారు. సరిగ్గా ధరించనివారు 38శాతం మంది ఉన్నారు. ఏ తరహా మాస్క్లు ధరిస్తున్నారన్న ప్రశ్నకు, 63శాతం మంది బట్టతో చేసిన మాస్క్లు ధరిస్తున్నామని చెప్పారు. 21శాతం మంది ఒకసారి వాడిపడేసేవి, ఎన్-95 మాస్క్లు 8శాతం మంది, కెఎన్-95, డబ్ల్యూ-95 తరహా మాస్క్ల్ని 3శాతం మంది వాడుతున్నారని ఈ సర్వేలో తేలింది.
ఏది ఏమైనా మాస్క్లు ధరించడం అసరమని ఇప్పటికే ప్రభుత్వం మాస్క్ ధరించకుంటే రూ.1000 జరిమానా విధించిన విషయం తెల్సిందే.. స్వీయ రక్షణే ఈ వైరస్ నుంచి కాపాడుతుందని వైద్యులు పదేపదే చెబుతున్నా ప్రజల్లో నిర్లక్ష్యం మాత్రం పోవడం లేదు. ఇప్పటికైనా స్వీయ రక్షణ జాగ్రత్తలు పాటించకున్నా, మాస్క్లు ధరించకుంటే మరోసారి ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : పెట్రోల్ భారం.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక వ్యవస్థ ఎటు వైపు?
-
GT vs RCB: సిక్సర్ల సునామీ.. స్టేడియంలో ఆర్సీబీ శివతాండవం! గుజరాత్ టైటాన్స్ గెలవాలంటే 255 కొట్టాల్సిందే..
-
Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
-
Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
-
Astro Scam : జ్యోతిష్యం పేరుతో జేబుకు జలక్.. కొత్త సైబర్ స్కామ్ అలర్ట్.!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!