మాస్క్ ధరిస్తున్న వారు 2శాతమేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఫస్ట్, రెండో వేవ్ దేశాన్ని ఎంతగా వణికించిందో అందరూ మర్చిపోయారు. మాస్క్లు ధరించకుండా బయట తిరుగుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో కేవలం 2శాతం మంది మాత్రమే మాస్కులు ధరిస్తున్నారని ‘లోకల్ సర్కిల్స్’ అనే సామాజిక సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న ప్రతి ముగ్గురులో ఒకరు మాస్కు ధరించటం లేదనిఈ సర్వే తెలిపింది.
ఈ ఏడాది ఏప్రిల్తో పోల్చితే మాస్క్ పెట్టుకునేవారి సంఖ్య సెప్టెంబర్లో 29శాతం పడిపోయిందని తెలిపింది. కరోనా వైరస్లలో అత్యంత వేగంగా వ్యాపించే లక్షణమున్న ఒమిక్రాన్ వైరస్ బయటపడినవేళ ఈ సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా 364 జిల్లాల్లో 25వేల మంది నుంచి వివరాలు సేకరించారు. ”మీ ప్రాంతంలో బయట తిరుగుతున్నవారిలో ఎంతమంది మాస్క్లు పెట్టుకుంటున్నారు?” అని ప్రశ్నించారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ఈ నేపథ్యంలో వచ్చిన సమాధానాల్ని క్రోడీకరించగా, వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సరైన పద్ధతిలో మాస్క్లు ధరిస్తున్నవారు కేవలం 2శాతం మందే ఉన్నారు. ఎక్కడా ఎవరూ మాస్క్లు పెట్టుకోవటం లేదని సర్వేలో పాల్గొన్న 8 శాతం మంది చెప్పారు. దేశంలో ఇప్పటికే 21 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఈ సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మాస్క్లు ధరించటం లేదని వచ్చిన సమాధానం తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తుంది. 5శాతం మంది మాస్క్ల్ని సరిగ్గా ధరిస్తున్నారు. సరిగ్గా ధరించనివారు 38శాతం మంది ఉన్నారు. ఏ తరహా మాస్క్లు ధరిస్తున్నారన్న ప్రశ్నకు, 63శాతం మంది బట్టతో చేసిన మాస్క్లు ధరిస్తున్నామని చెప్పారు. 21శాతం మంది ఒకసారి వాడిపడేసేవి, ఎన్-95 మాస్క్లు 8శాతం మంది, కెఎన్-95, డబ్ల్యూ-95 తరహా మాస్క్ల్ని 3శాతం మంది వాడుతున్నారని ఈ సర్వేలో తేలింది.
ఏది ఏమైనా మాస్క్లు ధరించడం అసరమని ఇప్పటికే ప్రభుత్వం మాస్క్ ధరించకుంటే రూ.1000 జరిమానా విధించిన విషయం తెల్సిందే.. స్వీయ రక్షణే ఈ వైరస్ నుంచి కాపాడుతుందని వైద్యులు పదేపదే చెబుతున్నా ప్రజల్లో నిర్లక్ష్యం మాత్రం పోవడం లేదు. ఇప్పటికైనా స్వీయ రక్షణ జాగ్రత్తలు పాటించకున్నా, మాస్క్లు ధరించకుంటే మరోసారి ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!