Vande Bharat: వందేభారత్ పై మరోసారి రాళ్ల దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucknow: అధునాతన సౌలభ్యాలతో రూపొంధించిన రైలు వందేభారత్. కాగా ఇది దేశం లోనే మొదటి హైస్పీడ్ రైలు. ఈ హైస్పీడ్ వందేభారత్ రైలును లక్నో లో ఈ ఏడాది జులై లో ప్రారంభించారు. అయితే ఈ రైలు తరచుగా రాళ్ళ దాడికి గురవుతుంది. ఇప్పటికే 4 సార్లు రాళ్ళ దాడికి గురైన ఈ రైలు గురువారం మరోసారి రాళ్ళ దాడికి గురైంది. దీనితో నాలుగు నెలల్లో ఈ రైలు రాళ్ళ దాడికి గురికావడం ఇది ఐదో సారి. వివరాలలోకి వెళ్తే.. గురువారం గోరఖ్పూర్ నుంచి లక్నోకు బయలుదేరింది వందేభారత్. ఈ నేపథ్యంలో వందేభారత్ రసౌలీ స్టేషన్ సమీపం లోకి రాగానే కదులుతున్న రైలుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. రాళ్లు విసరడం వల్ల రైలు లోని సి6 కోచ్ లోని అద్దం పగిలిపోయింది.
Read also:Telangana Election 2023: నవంబర్ 30 హాలీడే కాదు.. ఓటింగ్ డే..
Also Read
- AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
- CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
- IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
- CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. రాళ్ల దాడిపై జీఆర్పీ, ఆర్పీఎఫ్ దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ నేపథ్యంలో ఉత్తర రైల్వే సీనియర్ డీసీఎం రేఖా శర్మ మాట్లాడుతూ.. సీసీటీవీలను పరిశీలించి నిందితులను పట్టుకుంటామని.. అలానే ఈ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా ఈ ఏడాది జులై 7వ తేదీన గోరఖ్పూర్ నుండి లక్నో వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కాగా ఈ రైలు జులై 9వ తేదీ నుండి ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. అయితే ఈ రైలు సేవలు ప్రారంభమైన 2 రోజుల్లోనే అంటే జులై 11వ తేదీన రాళ్ల దాడికి గురైంది. ఈ దాడిలో రైలు అద్దాలు దెబ్బతినడంతో పాటు పై భాగం కూడా దెబ్బతింది. అలానే ఆగస్టు 3వ తేదీన గోరఖ్పూర్ జంక్షన్ లోని వాషింగ్ యార్డులో రైలు అద్దాలు పగులగొట్టారు.
Read also:TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
ఆ తరువాత ఆగస్టు 6వ తేదీన బారాబంకి లోని సఫేదాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మరో సారి ఈ రైలు రాళ్ల దాడికి గురైంది. ఈ ఘటనలో ఒక కోచ్ యొక్క రెండు అద్దాలు పగిలిపోయాయి. అలానే సెప్టెంబర్ 15న మల్హౌర్ స్టేషన్లో గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేసి సి-4 కోచ్ కిటికీని ధ్వంసం చేశారు. కాగా నిన్న మరోసారి దుండగులు రాళ్లతో దాడి చేశారు. దీనితో లక్నో వందే భరత్ రైలు రాళ్ళ దాడికి గురికావడం నాలుగు నెలల్లో ఇది ఐదోసారి.
తాజావార్తలు
-
Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
-
AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
-
Ajay Bhupathi: ‘మంగళవారం’లో హీరోయిన్ పాయల్ రాజ్ఫుత్ క్యారెక్టర్పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
-
RCB Player: యాడ్ షూట్ నుంచి డేటింగ్ వరకు.. ఆ నటితో ఆర్సీబీ ప్లేయర్కు పెళ్లి..?
-
Hi: ఆగస్టు 14న కవిన్తో కలిసి ‘హాయ్’ అంటూ నయనతార హంగామా
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!