Vande Bharat: వందేభారత్ పై మరోసారి రాళ్ల దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucknow: అధునాతన సౌలభ్యాలతో రూపొంధించిన రైలు వందేభారత్. కాగా ఇది దేశం లోనే మొదటి హైస్పీడ్ రైలు. ఈ హైస్పీడ్ వందేభారత్ రైలును లక్నో లో ఈ ఏడాది జులై లో ప్రారంభించారు. అయితే ఈ రైలు తరచుగా రాళ్ళ దాడికి గురవుతుంది. ఇప్పటికే 4 సార్లు రాళ్ళ దాడికి గురైన ఈ రైలు గురువారం మరోసారి రాళ్ళ దాడికి గురైంది. దీనితో నాలుగు నెలల్లో ఈ రైలు రాళ్ళ దాడికి గురికావడం ఇది ఐదో సారి. వివరాలలోకి వెళ్తే.. గురువారం గోరఖ్పూర్ నుంచి లక్నోకు బయలుదేరింది వందేభారత్. ఈ నేపథ్యంలో వందేభారత్ రసౌలీ స్టేషన్ సమీపం లోకి రాగానే కదులుతున్న రైలుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. రాళ్లు విసరడం వల్ల రైలు లోని సి6 కోచ్ లోని అద్దం పగిలిపోయింది.
Read also:Telangana Election 2023: నవంబర్ 30 హాలీడే కాదు.. ఓటింగ్ డే..
Also Read
- Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. రాళ్ల దాడిపై జీఆర్పీ, ఆర్పీఎఫ్ దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ నేపథ్యంలో ఉత్తర రైల్వే సీనియర్ డీసీఎం రేఖా శర్మ మాట్లాడుతూ.. సీసీటీవీలను పరిశీలించి నిందితులను పట్టుకుంటామని.. అలానే ఈ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా ఈ ఏడాది జులై 7వ తేదీన గోరఖ్పూర్ నుండి లక్నో వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కాగా ఈ రైలు జులై 9వ తేదీ నుండి ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. అయితే ఈ రైలు సేవలు ప్రారంభమైన 2 రోజుల్లోనే అంటే జులై 11వ తేదీన రాళ్ల దాడికి గురైంది. ఈ దాడిలో రైలు అద్దాలు దెబ్బతినడంతో పాటు పై భాగం కూడా దెబ్బతింది. అలానే ఆగస్టు 3వ తేదీన గోరఖ్పూర్ జంక్షన్ లోని వాషింగ్ యార్డులో రైలు అద్దాలు పగులగొట్టారు.
Read also:TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
ఆ తరువాత ఆగస్టు 6వ తేదీన బారాబంకి లోని సఫేదాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మరో సారి ఈ రైలు రాళ్ల దాడికి గురైంది. ఈ ఘటనలో ఒక కోచ్ యొక్క రెండు అద్దాలు పగిలిపోయాయి. అలానే సెప్టెంబర్ 15న మల్హౌర్ స్టేషన్లో గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేసి సి-4 కోచ్ కిటికీని ధ్వంసం చేశారు. కాగా నిన్న మరోసారి దుండగులు రాళ్లతో దాడి చేశారు. దీనితో లక్నో వందే భరత్ రైలు రాళ్ళ దాడికి గురికావడం నాలుగు నెలల్లో ఇది ఐదోసారి.
తాజావార్తలు
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
Purusha : భార్యల టార్చర్లు, మగాళ్ల కష్టాలు..క్షేమంగా వెళ్లి లాభంగా రండి వైబ్’లో ‘పురుష:’ ట్రైలర్!
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!