Vande Bharat: వందేభారత్ పై మరోసారి రాళ్ల దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucknow: అధునాతన సౌలభ్యాలతో రూపొంధించిన రైలు వందేభారత్. కాగా ఇది దేశం లోనే మొదటి హైస్పీడ్ రైలు. ఈ హైస్పీడ్ వందేభారత్ రైలును లక్నో లో ఈ ఏడాది జులై లో ప్రారంభించారు. అయితే ఈ రైలు తరచుగా రాళ్ళ దాడికి గురవుతుంది. ఇప్పటికే 4 సార్లు రాళ్ళ దాడికి గురైన ఈ రైలు గురువారం మరోసారి రాళ్ళ దాడికి గురైంది. దీనితో నాలుగు నెలల్లో ఈ రైలు రాళ్ళ దాడికి గురికావడం ఇది ఐదో సారి. వివరాలలోకి వెళ్తే.. గురువారం గోరఖ్పూర్ నుంచి లక్నోకు బయలుదేరింది వందేభారత్. ఈ నేపథ్యంలో వందేభారత్ రసౌలీ స్టేషన్ సమీపం లోకి రాగానే కదులుతున్న రైలుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. రాళ్లు విసరడం వల్ల రైలు లోని సి6 కోచ్ లోని అద్దం పగిలిపోయింది.
Read also:Telangana Election 2023: నవంబర్ 30 హాలీడే కాదు.. ఓటింగ్ డే..
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. రాళ్ల దాడిపై జీఆర్పీ, ఆర్పీఎఫ్ దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ నేపథ్యంలో ఉత్తర రైల్వే సీనియర్ డీసీఎం రేఖా శర్మ మాట్లాడుతూ.. సీసీటీవీలను పరిశీలించి నిందితులను పట్టుకుంటామని.. అలానే ఈ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా ఈ ఏడాది జులై 7వ తేదీన గోరఖ్పూర్ నుండి లక్నో వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కాగా ఈ రైలు జులై 9వ తేదీ నుండి ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. అయితే ఈ రైలు సేవలు ప్రారంభమైన 2 రోజుల్లోనే అంటే జులై 11వ తేదీన రాళ్ల దాడికి గురైంది. ఈ దాడిలో రైలు అద్దాలు దెబ్బతినడంతో పాటు పై భాగం కూడా దెబ్బతింది. అలానే ఆగస్టు 3వ తేదీన గోరఖ్పూర్ జంక్షన్ లోని వాషింగ్ యార్డులో రైలు అద్దాలు పగులగొట్టారు.
Read also:TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
ఆ తరువాత ఆగస్టు 6వ తేదీన బారాబంకి లోని సఫేదాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మరో సారి ఈ రైలు రాళ్ల దాడికి గురైంది. ఈ ఘటనలో ఒక కోచ్ యొక్క రెండు అద్దాలు పగిలిపోయాయి. అలానే సెప్టెంబర్ 15న మల్హౌర్ స్టేషన్లో గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేసి సి-4 కోచ్ కిటికీని ధ్వంసం చేశారు. కాగా నిన్న మరోసారి దుండగులు రాళ్లతో దాడి చేశారు. దీనితో లక్నో వందే భరత్ రైలు రాళ్ళ దాడికి గురికావడం నాలుగు నెలల్లో ఇది ఐదోసారి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!