Vande Bharat: వందేభారత్ పై మరోసారి రాళ్ల దాడి..
Lucknow: అధునాతన సౌలభ్యాలతో రూపొంధించిన రైలు వందేభారత్. కాగా ఇది దేశం లోనే మొదటి హైస్పీడ్ రైలు. ఈ హైస్పీడ్ వందేభారత్ రైలును లక్నో లో ఈ ఏడాది జులై లో ప్రారంభించారు. అయితే ఈ రైలు తరచుగా రాళ్ళ దాడికి గురవుతుంది. ఇప్పటికే 4 సార్లు రాళ్ళ దాడికి గురైన ఈ రైలు గురువారం మరోసారి రాళ్ళ దాడికి గురైంది. దీనితో నాలుగు నెలల్లో ఈ రైలు రాళ్ళ దాడికి గురికావడం ఇది ఐదో సారి. వివరాలలోకి వెళ్తే.. గురువారం గోరఖ్పూర్ నుంచి లక్నోకు బయలుదేరింది వందేభారత్. ఈ నేపథ్యంలో వందేభారత్ రసౌలీ స్టేషన్ సమీపం లోకి రాగానే కదులుతున్న రైలుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. రాళ్లు విసరడం వల్ల రైలు లోని సి6 కోచ్ లోని అద్దం పగిలిపోయింది.
Read also:Telangana Election 2023: నవంబర్ 30 హాలీడే కాదు.. ఓటింగ్ డే..
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. రాళ్ల దాడిపై జీఆర్పీ, ఆర్పీఎఫ్ దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ నేపథ్యంలో ఉత్తర రైల్వే సీనియర్ డీసీఎం రేఖా శర్మ మాట్లాడుతూ.. సీసీటీవీలను పరిశీలించి నిందితులను పట్టుకుంటామని.. అలానే ఈ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా ఈ ఏడాది జులై 7వ తేదీన గోరఖ్పూర్ నుండి లక్నో వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కాగా ఈ రైలు జులై 9వ తేదీ నుండి ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. అయితే ఈ రైలు సేవలు ప్రారంభమైన 2 రోజుల్లోనే అంటే జులై 11వ తేదీన రాళ్ల దాడికి గురైంది. ఈ దాడిలో రైలు అద్దాలు దెబ్బతినడంతో పాటు పై భాగం కూడా దెబ్బతింది. అలానే ఆగస్టు 3వ తేదీన గోరఖ్పూర్ జంక్షన్ లోని వాషింగ్ యార్డులో రైలు అద్దాలు పగులగొట్టారు.
Read also:TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
ఆ తరువాత ఆగస్టు 6వ తేదీన బారాబంకి లోని సఫేదాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మరో సారి ఈ రైలు రాళ్ల దాడికి గురైంది. ఈ ఘటనలో ఒక కోచ్ యొక్క రెండు అద్దాలు పగిలిపోయాయి. అలానే సెప్టెంబర్ 15న మల్హౌర్ స్టేషన్లో గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేసి సి-4 కోచ్ కిటికీని ధ్వంసం చేశారు. కాగా నిన్న మరోసారి దుండగులు రాళ్లతో దాడి చేశారు. దీనితో లక్నో వందే భరత్ రైలు రాళ్ళ దాడికి గురికావడం నాలుగు నెలల్లో ఇది ఐదోసారి.
తాజావార్తలు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!