కోవిడ్తో పీఠాధిపతి కన్నుమూత… కుంభమేళా హాజరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. కుంభమేళా కోవిడ్ హాట్స్పాట్గా మారిందనే విమర్శలు ఆదినుంచి వినిపిస్తున్నాయి.. దాని తగ్గట్టుగానే క్రమంగా పీఠాధిపతులు కన్నుమూయడం కలకలం రేపుతోంది.. తాజాగా, శ్రీ పంచాయతీ అఖాడా నిరంజనీకి చెందిన శ్రావణ్ నాథ్ మఠాధిపతి, జవహర్ లాల్ నెహ్రూ కాలేజ్ మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడైన శ్రీ మహంత్ లఖన్ గిరి కన్నుమూశారు.. అనారోగ్యంబారినపడి మూడు వారాల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయనకు .. కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది.. మహంత్ లఖన్ గిరిని మొదట జగ్జీత్పూర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా.. ఆ తర్వాత రిషికేశ్లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.. అయితే, అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.. అయితే, ఉత్తరాఖండ్లోని కుంభమేళాలో పాల్గొన్నారాయన.. అక్కడే ఆయనకు కోవిడ్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇక, కుంభమేళాలో పాల్గొని కరోనా సోకి మృతిచెందిన మఠాధిపతుల సంఖ్య నాలుగు చేరింది.
అయితే, ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తితో కుంభ మేళా ముసిగినట్టు నిర్వహకులు ముందే ప్రకటించారు.. అప్పటి నుంచి క్రమంగా భక్తులు సంఖ్య తగ్గిపోయింది.. ఇది అధికారికంగా ఏప్రిల్ 30న ముగియనుంది.. మరోవైపు.. 5 రోజుల వ్యవధిలో కుంభమేళాలో దాదాపు 1,700 మందికి కోవిడ్ సోకడం కలకలం రేగింది.. ఉత్తరాఖండ్లో సోమవారం 5,058 కోవిడ్ కేసులు నమోదు కాగా.. డెహ్రాడూన్లో 2,034, హరిద్వార్ లో 1,002 వెలుగు చూశాయి.. ఇక, కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో మహా కుంభమేళాకు అనుమతించడంపై సర్కార్పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Pulwama Attack: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుల్వామా దాడి సూత్రధారి.. హమ్జా బుర్హాన్ను కాల్చి చంపిన దుండగులు
- Diesel: డీజిల్ కొరత, ధరల పెరుగుదల వేళ శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
తాజావార్తలు
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
-
Sharvari Wagh: షూటింగ్లో అలియాను చూసి ఎన్నో నేర్చుకున్నా: శార్వరీ
-
Ruturaj Gaikwad: ముగిసిన సీఎస్కే ప్రయాణం.. ధోనీ రిటైర్మెంట్పై CSK కెప్టెన్ సంచలన ప్రకటన..
-
US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
-
Dragon: ‘డ్రాగన్’లో..తారక్ పాత్రపై ప్రశాంత్ నీల్ బిగ్ క్లారిటీ..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!