Jammu Kashmir: కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. కాశ్మీర్ పండిట్ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Another Kashmiri Pandit Shot Dead By Terrorists in jammu kashmir: జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. మరో కాశ్మీరీ పండిట్ను కాల్చిచంపారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని చౌదరి గుండ్ ప్రాంతంలోని అతని నివాసానికి సమీపంలో పూరన్ క్రిషన్ భట్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటన శనివారం జరిగింది. కాల్పుల్లో గాయపడిన క్రిషన్ భట్ ను షోపియాన్ ఆస్పత్రికి తరలించిన తర్వాత మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు వేట ప్రారంభించాయి. ఘటన జరిగిన ప్రాంతాన్ని చుట్టుమట్టి గాలింపు చేపడుతున్నాయి.
Read Also: GN Saibaba: ప్రొఫెసర్ సాయిబాబా జైల్లోనే.. మావోయిస్టు లింకుల కేసులో విడుదలపై సుప్రీం స్టే
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
క్రిషన్ భట్ కు ఇద్దరు పాఠశాలకు వెళ్లే పిల్లలు ఉన్నారు. 7వ తరగతి చదువుతున్న అమ్మాయితో పాటు 5వ తరగతి చదువుతున్న అబ్బాయి ఉన్నారు. కొద్ది నెలల క్రితం షోపియాన్ జిల్లాలో ఓ యాపిల్ తోటలో పనిచేస్తున్న సునీల్ కుమార్ ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఘటనలో సునీల్ కుమార్ సోదరుడు పింటూ కుమార్ గాయపడ్డాడు. ఆగస్టు 16న ఈ ఘటన జరిగింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడే ఉగ్రవాదులు కాశ్మీరీ పండిట్ ను టార్గెట్ చేసి చంపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘తిరంగా ర్యాలీ’లో పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహించినందుకు వీరిద్దరిని లక్ష్యంగా చేసుకున్నట్లు అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన ‘కాశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్’ తెలిపింది.
ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో వరసగా హిందువులను, పండిట్లను, వలస కూలీలు, స్థానికేతరులను టార్గెట్ గా చేసుకుంటూ దాడులకు పాల్పడుతున్నాయి ఉగ్రవాద సంస్థలు. ఇలా కొత్తరకం హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతున్నాయి. గతంలో మేనెలలో బుద్గామ్ జిల్లాలో రాహుల్ భట్ అనే కాశ్మీరీ పండిట్ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న క్రమంలో అతి దగ్గర నుంచి ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఘటనపై అప్పట్లో కాశ్మీర్ లో ఉన్న హిందువులు అంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత అమ్రీన్ భట్ అనే టీవీ నటిని కూడా కాల్చిచంపారు ఉగ్రవాదులు. ఆ తరువాత ఓ హిందూ మహిళా ఉపాధ్యాయురాలిని, స్థానికేతరుడైన బ్యాంకు మేనేజర్ తో పాటు బీహార్ వలస కూలీలపై కాల్చుపులు జరిపి ప్రాణాలు తీశారు టెర్రరిస్టులు. గతేడాది అక్టోబర్ నెలలో ఐదు రోజుల్లో ఏడుగురు పౌరులు మరణించారు. ఇందులో ఓ కాశ్మీరీ పండిట్ ఉండగా.. ఓ సిక్కు, ఇద్దరు వలస హిందువులు ఉన్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!