Bihar: బీహార్లో కూలిన మరో బ్రిడ్జి.. 15 రోజుల్లో 7కి చేరిన సంఖ్య
- బీహార్లో కూలిన మరో బ్రిడ్జి
- 15 రోజుల్లో 7కి చేరిన సంఖ్య
- భారీ వరదలే కారణమని కమిషనర్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో మరో బ్రిడ్జి కూలిపోయింది. 15 రోజుల్లో ఇది ఏడో ఘటన కావడం విశేషం. వరుసగా వంతెనలు కూలడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఆర్జేడీ నేతలు.. నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయినా కూడా వంతెనలు కూలుతూనే ఉన్నాయి.
ఇది కూడా చదవండి: CM Chandrababu: రాజధాని పునర్ నిర్మాణం చేసి తీరాల్సిందే.. చంద్రబాబు భావోద్వేగం
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
బీహార్లోని సివాన్ జిల్లాలో గండకి నదిపై వంతెన కూలిపోవడంతో 15 రోజుల వ్యవధిలో ఏడవ ఘటన చోటు చేసుకుంది. డియోరియా బ్లాక్లో ఉన్న ఈ చిన్న వంతెన అనేక గ్రామాలను మహరాజ్గంజ్తో కలుపుతుంది. డియోరియా బ్లాక్లోని వంతెన మరమ్మతుల్లో ఉందని డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ ముఖేష్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. భారీ వర్షాలు, నదుల ఉప్పెన కారణంగా బ్రిడ్జిలు కూలుతున్నాయని ముఖేష్ కుమార్ తెలిపారు. దీనిపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ జరుపుతోందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Immunity Boost Drinks : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని కాపాడుకోవాలా.. వీటిని తాగాల్సిందే..
ఈ సంఘటన తెల్లవారుజామున 5 గంటలకు జరిగిందన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వంతెన 1982-83లో నిర్మించినట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా వంతెనపై మరమ్మతు పనులు జరుగుతున్నాయని కుమార్ తెలిపారు. ఇటీవల మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్గంజ్ వంటి జిల్లాల్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలపై దర్యాప్తు చేయడానికి బీహార్ ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
ఇది కూడా చదవండి: Hathras stampede: హత్రాస్ తొక్కిసలాటపై రష్యా అధినేత పుతిన్ సంతాపం..
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!