Annamalai: అన్నామలైకి జాతీయ స్థాయిలో కీలక పోస్ట్.!
- తమిళనాడు బీజేపీకి కొత్త అధ్యక్షుడు..
- అన్నామలైకి జాతీయ స్థాయిలో కీలక పోస్ట్ లభించే అవకాశం..
- అమిత్ షా వ్యాఖ్యలతో క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు పొడిచింది. చెన్నైలో ఈ రోజు జరిగిన సమావేశంలో పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. పళనిస్వామి నేతృత్వంలో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఇదే రోజు తమిళనాడు బీజేపీ చీఫ్గా అన్నామలై దిగిపోయి, కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, తమిళనాడులో బీజేపీకి ఊపు తెచ్చిన పేరు మాత్రం అన్నామలైకి చెందుతుంది. సింగిల్ డిజిట్ ఓట్ షేర్ నుంచి బీజేపీకి డబుల్ డిజిట్ ఓట్ షేర్ సంపాదించడంలో అన్నామలై సక్సెస్ అయ్యారు.
Read Also: Nara Lokesh: టీటీడీ గోశాలలో గోవుల మరణాల ప్రచారంపై మంత్రి నారా లోకేష్ రియాక్షన్..
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
40 ఏళ్ల మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై పార్టీ చీఫ్గా తప్పుకోవడం సంచలనంగా మారిన తరుణంలో, అమిత్ షా వ్యాఖ్యలను బట్టి చూస్తే కేంద్ర స్థాయిలో అన్నామలైకి కీలక పోస్టు లభించే అవకాశం కనిపిస్తోంది. ‘‘తమిళనాడు బీజేపీ యూనిట్ అధ్యక్షుడిగా, కె అన్నామలై ప్రశంసనీయమైన విజయాలు సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలను ప్రజలకు చేరవేసినా లేదా పార్టీ కార్యక్రమాలను గ్రామగ్రామాలకు తీసుకెళ్లినా, అన్నామలై సహకారం అపూర్వమైనది. పార్టీ జాతీయ స్థాయిలో అన్నామలై సంస్థాగత నైపుణ్యాలను బీజేపీ ఉపయోగించుకుంటుంది’’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.
జూన్ 2021లో అన్నామలై బీజేపీ తమిళనాడు చీఫ్గా ఎన్నికయ్యారు. డీఎంకేని ధీటుగా ఎదుర్కొన్న నేతగా అన్నామలై పేరు సంపాదించారు. ‘‘ఎన్ మన్ ఎన్ మక్కల్’’ పాదయాత్ర ద్వారా బీజేపీని తమిళనాడులో ప్రతీ గ్రామానికి తీసుకెళ్లారు. దీని ఫలితంగా బీజేపీ ఓట్ షేర్ పెరిగింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం రాకున్నప్పటికీ ప్రజల ఆదరణ దక్కింది. ఈ ఓట్ షేర్ చూసే ప్రస్తుతం అన్నాడీఎకేం బీజేపీతో పొత్తుకు సిద్ధమైంది. అన్నాడీఎంకే ఉన్న ఓట్ల శాతంతో, బీజేపీ కలిస్తే అధికారం సాధించవచ్చని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటుంది.
- Tags
- Amit Shah
- annamalai
- bjp
- DMK
- Tamil Nadu
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..