Annamalai: మాజీ సీఎం జయలలితపై సంచలన వ్యాఖ్యలు చేసిన అన్నామలై.. ఏమన్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మాజీ సీఎం, దివంగత జయలలితను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్రవిడ రాజకీయాలకు కేంద్రంగా ఉన్న తమిళనాడులో జయలలిత ‘‘హిందుత్వ నాయకురాలి’’గా ఉందని అన్నారు. ఆమె అందరి కన్నా ఉన్నతమైన హిందుత్వ నాయకురాలిగా పిలిచారు. ఇటీవల పీటీఐతో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జయలలిత మరణం అనంతరం అన్నాడీఎంకే హిందుత్వ భావజాలానికి దూరమైన తర్వాత తమిళనాడులో ఏర్పడిన శూన్యతను పూరించడానికి బీజేపికీ మంచి అవకాశం ఉందని అన్నారు.
‘‘జయలలిత జీవించి ఉన్నంత వరకు ఆమె తమిళనాడులో అందరికన్నా చాలా ఉన్నతమైన హిందుత్వ నాయకురాలు. 2014కి ముందు, బీజేపీలో జయలలిత వంటి లీడర్లు కలిసి ఉన్నప్పుడు, హిందుత్వ భావజాలం ఉన్న ఓటర్లకు సహజంగానే జయలలిత ఒక ఛాయిస్. ఆమె తన హిందూత్వ భావజాలాన్ని బహిరంగంగా ప్రదర్శించేవారు’’ అని అన్నామలై వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మద్దతునిచ్చారని, 2002-03లో తమిళనాడులో మతమార్పిడి నిరోధక చట్టాన్ని రూపొందించిన బీజేపీయేతర నాయకురాలిగా జయలలిత చరిత్ర సృష్టించారని చెప్పారు.
Also Read
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
Read Also: Arvind Kejriwal: రాహుల్ గాంధీకే కాదు, కేజ్రీవాల్కి కూడా పాకిస్తాన్ నుంచి మద్దతు..బీజేపీ ఫైర్
అయితే, అన్నామలై ప్రకటనపై జయలలిత స్నేహితురాలు వీకే శశికళ స్పందించారు. అన్నామలై చేసిన వ్యాఖ్యలు ఆయనకు జయలలితపై ఉన్న అజ్ఞానాన్ని, అపార్థాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొన్నాయని అన్నారు. జయలలిత లాంటి ప్రజా నాయకుడిని ఎవరూ ఇరుకున పెట్టలేరని శశికళ చెప్పారు. ఆమె చివరి శ్వాస వరకు ఎంజీఆర్ చూపిన బాటలోనే నిజమైన ద్రవిడ నాయకురాలిగా జీవించారని హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా అన్ని వర్గాల వారు కీర్తించుకునే నాయకురాలని, అమ్మ కుల మత అడ్డంకుల్ని అధిగమించిన గొప్ప నాయకురాలని, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు.
జయలలితకు దేవుడిపై విశ్వాసం ఉందనే విషయం అందరికీ తెలిసిందేనని, అయితే ఆమె ఎప్పుడూ ఒకే మతాన్ని నమ్మలేదని శశికళ అన్నారు. అందరినీ సమానంగా చూసే ఏకైక నాయకురాలు జయలలిత అని శశికళ అన్నారు. ఇదిలా ఉంటే అన్నామలై జయలలితను హిందుత్వ నాయకురాలిగా పేర్కొనడంపై అన్నాడీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది. అందరూ ఒక్కటే, దేవుడు ఒక్కడే అనేది అన్నాడీఎంకే సిద్ధాంతాల్లో ఒకటని, మా నాయకురాలు అమ్మ ఆ సిద్ధాంతంపై ఆధారపడి జీవించారని చెప్పింది. అన్నామలై ప్రకారం చూస్తే మా నాయకురాలు హిందుత్వానికి గొప్ప నాయకుడిగా ఉండాలి కానీ మోడీ కాదని, అన్నామలై జూన్ 4 తర్వాత ఏఐడీఎంకేలో చేరడాన్ని స్వాగతిస్తానని, ఫలితాల తర్వాత అన్నామలై రాజకీయ గుర్తింపు ఉండబోదని ఆ పార్టీ అధికార ప్రతినిధి కోవై సత్యన్ అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
ట్రెండింగ్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!