Anju Love Story: పాక్ నుంచి ఇండియాకు వచ్చిన అంజూ.. “మా అమ్మను కలిసేది లేదంటున్న పిల్లలు..”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anju Love Story: పాకిస్తాన్ వ్యక్తితో ప్రేమలో పడి అతని కలిసేందుకు వెళ్లిన అంజూ అనే మహిళ గురించి దేశం మొత్తం చర్చించింది. ఇలా వెళ్లిన అంజూ, ఆ దేశంలోని ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో నివసిస్తున్న స్నేహితుడు నస్రుల్లాను పెళ్లి చేసుకుంది. అంతే కాకుండా ముస్లిం మతాన్ని స్వీకరించి తన పేరు ఫాతిమాగా మార్చుకుంది.
అయితే ఇటీవల అంజూ పాకిస్తాన్ నుంచి స్వదేశం భారత్కి వచ్చింది. పెళ్లై అప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అంజూ, వారందరిని వదిలేసి పాకిస్తాన్ వెళ్లింది. అయితే ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లలు రాజస్థాన్ లోని భివాడీలో ఉన్నారు. ఇంట్లో ఉన్న పిల్లల్ని ప్రశ్నించగా.. తాము ఆమెను కలమని చెప్పారు. ఈ వారం ఢిల్లీకి చేరుకున్న అంజూ ఆచూకీ తెలియరాలేదు. ఆమె ఇంకా భివాడీకి చేరుకోలేదు, తన పిల్లల్ని కలవలేదు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Fire Accident: తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం..
ప్రస్తుతం అంజూ నివసించిన రెసిడెన్షియల్ సొసైటీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని వాహనాలను, అపరిచిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరోకి చెందిన, అంజూ పిల్లలు 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడిని ప్రశ్నించింది. ప్రస్తుతం ఆమెపై కేసు దర్యాప్తు జరుగుతోంది. పలువురి వాంగ్మూలాలు నమోదు చేసినట్లు భివాడీ ఎస్పీ దీపక్ సైనీ తెలిపారు. అవసరమైతే అంజూను ప్రశ్నించడంతో పాటు అరెస్ట్ చేయవచ్చని అన్నారు.
ఇటీవల వాఘా సరిహద్దు ద్వారా అంజూ భారత్ చేరుకుంది. ఆమెను పంజాబ్ పోలీసులు, స్పై ఏజెన్సీ విచారించిన తర్వాత బుధవారం డిల్లీకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెను ప్రశ్నించగా.. నేను ఇప్పుడు ఏం మాట్లాడనని అంజూ చెప్పారు. మరోవైపు ఆమె భర్త అరవింద్ కూడా అంజూ గురించి మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం లేదు. వీరిద్దరు విడాకులు తీసుకునేందుకు మరో మూడు నుంచి ఐదు నెలల సమయం పట్టనుంది. అంజు ఇండియాకు రావడానికి ఒక నెల మాత్రమే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందింది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆమె తన పిల్లల సంరక్షణను విడాకుల తర్వాత మాత్రమే పొందవచ్చు.
తాజావార్తలు
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
-
Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Japan Earthquake: జపాన్లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
-
Anirudh : అనిరుథ్ – కావ్య మారన్ పెళ్లి.. కన్ఫర్మ్ చేసిన ఫ్యామిలీ మెంబర్
-
IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!