Anju Love Story: పాక్ నుంచి ఇండియాకు వచ్చిన అంజూ.. “మా అమ్మను కలిసేది లేదంటున్న పిల్లలు..”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anju Love Story: పాకిస్తాన్ వ్యక్తితో ప్రేమలో పడి అతని కలిసేందుకు వెళ్లిన అంజూ అనే మహిళ గురించి దేశం మొత్తం చర్చించింది. ఇలా వెళ్లిన అంజూ, ఆ దేశంలోని ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో నివసిస్తున్న స్నేహితుడు నస్రుల్లాను పెళ్లి చేసుకుంది. అంతే కాకుండా ముస్లిం మతాన్ని స్వీకరించి తన పేరు ఫాతిమాగా మార్చుకుంది.
అయితే ఇటీవల అంజూ పాకిస్తాన్ నుంచి స్వదేశం భారత్కి వచ్చింది. పెళ్లై అప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అంజూ, వారందరిని వదిలేసి పాకిస్తాన్ వెళ్లింది. అయితే ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లలు రాజస్థాన్ లోని భివాడీలో ఉన్నారు. ఇంట్లో ఉన్న పిల్లల్ని ప్రశ్నించగా.. తాము ఆమెను కలమని చెప్పారు. ఈ వారం ఢిల్లీకి చేరుకున్న అంజూ ఆచూకీ తెలియరాలేదు. ఆమె ఇంకా భివాడీకి చేరుకోలేదు, తన పిల్లల్ని కలవలేదు.
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
Read Also: Fire Accident: తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం..
ప్రస్తుతం అంజూ నివసించిన రెసిడెన్షియల్ సొసైటీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని వాహనాలను, అపరిచిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరోకి చెందిన, అంజూ పిల్లలు 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడిని ప్రశ్నించింది. ప్రస్తుతం ఆమెపై కేసు దర్యాప్తు జరుగుతోంది. పలువురి వాంగ్మూలాలు నమోదు చేసినట్లు భివాడీ ఎస్పీ దీపక్ సైనీ తెలిపారు. అవసరమైతే అంజూను ప్రశ్నించడంతో పాటు అరెస్ట్ చేయవచ్చని అన్నారు.
ఇటీవల వాఘా సరిహద్దు ద్వారా అంజూ భారత్ చేరుకుంది. ఆమెను పంజాబ్ పోలీసులు, స్పై ఏజెన్సీ విచారించిన తర్వాత బుధవారం డిల్లీకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెను ప్రశ్నించగా.. నేను ఇప్పుడు ఏం మాట్లాడనని అంజూ చెప్పారు. మరోవైపు ఆమె భర్త అరవింద్ కూడా అంజూ గురించి మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం లేదు. వీరిద్దరు విడాకులు తీసుకునేందుకు మరో మూడు నుంచి ఐదు నెలల సమయం పట్టనుంది. అంజు ఇండియాకు రావడానికి ఒక నెల మాత్రమే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందింది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆమె తన పిల్లల సంరక్షణను విడాకుల తర్వాత మాత్రమే పొందవచ్చు.
తాజావార్తలు
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!