Uddhav Thackeray: ఠాక్రేని అస్థిరపరిచేందుకు ఫడ్నవీస్ ప్లాన్.. మాజీ హోంమంత్రి ఆరోపణలు..
- ఠాక్రేని అస్థిరపరిచేందుకు ఫడ్నవీస్ ప్లాన్..
- మాజీ హోంమంత్రి ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ హోంమంత్రి దేశ్ముఖ్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు మరో ముగ్గురు ‘మహా వికాస్ అఘాడీ’ నేలపై తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయాలని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తనపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. తనపై దర్యాప్తు నిలిపేయడానికి ఫడ్నవీస్ ఈ ప్రతిపాదన చేసినట్లు దేశ్ముఖ్ ఆరోపించారు. అయితే, దేశ్ముఖ్ చేసిన వ్యాఖ్యలను ఫడ్నవీస్ ఖండించారు.
‘‘మూడేళ్ల క్రితం దేవేంద్ర ఫడ్నవీస్ ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, అనిల్ పరబ్, అజిత్ పవార్లపై తప్పుడు ఆరోపలు చేస్తూ అఫిడవిట్ ఇవ్వాలని నన్ను అడిగారు. అందుకు నేను నిరాకరించాను. అందుకే నాపైకి ఈడీ, సీబీఐలను పంపారు. 13 నెలల పాటు జైలులో ఉంచారు’’ అని ఎన్సీపీ(శరద్ పవార్) నేత అయిన అనిల్ దేశ్ముఖ్ చెప్పారు.
Also Read
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
Read Also: Shruti Haasan: అప్పుడే పదిహేనేళ్లా? డాటర్ ఆఫ్ కమల్ టు శృతి జర్నీ!
శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్ పార్టీల ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వంలో అనిల్ దేశ్ముఖ్ మహారాష్ట్ర హోం మంత్రిగా పనిచేశారు. ముంబైలోని హోటల్, బార్ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేయమని పోలీసు అధికారుల్ని ఆదేశించారని అప్పటి ముంబై కమిషనర్ ఆరోపించడంతో అనిల్ దేశ్ముఖ్ 2021లో తన హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 2021లో మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయగా, ఏప్రిల్ 2022లో అవినీతి కేసులో సీబీఐ చేత అరెస్ట్ చేయబడ్డాడు.
అయితే, ఈ ఆరోపణలపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. అవన్నీ నిరాధారమైనవని ఖండించారు. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లపై దేశ్ముఖ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అనేక వీడియోలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఆ వీడియోలను బహిరంగపరచడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. దేశ్ముఖ్కి చెందిన ఆధారాలనపు ఫడ్నవీస్ బయటపెట్టాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఆందోళనకు దిగారు. దేశ్ముఖ్ చెప్పేదే నిజం కావచ్చు, ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని పటోలే చెప్పారు.
తాజావార్తలు
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!