Maharashtra: ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ కారుపై రాళ్ల దాడి.. తలకు గాయాలు
- మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ కారుపై రాళ్ల దాడి
- గుర్తు తెలియని వ్యక్తులు కారుపై రాళ్లతో దాడి
- తలకు గాయం.. ఆస్పత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ కారుపై రాళ్ల దాడి జరిగింది. సోమవారం సాయంత్రం నాగ్పూర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు కారుపై రాళ్లతో దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. దేశ్ముఖ్ నార్ఖేడ్లో బహిరంగ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కటోల్ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన కుమారుడు సలీల్ దేశ్ముఖ్కు ప్రచారం చేసేందుకు నార్ఖేడ్ వెళ్లారు. ప్రచారం ముగించుకుని తిరిగి కారులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. తలకు గాయం కావడంతో రక్తం కారింది. బట్టలు కూడా రక్తపుమరకలయ్యాయి.
ఇది కూడా చదవండి: FIFA Friendly Match: ఇండియా vs మలేసియా ఫుట్బాల్ మ్యాచ్ డ్రా..
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
మహారాష్ట్రలో సోమవారం ప్రచార హోరు ముగిసింది. గత కొద్దిరోజులుగా నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అభ్యర్థులంతా ఓటర్లను దర్శనం చేసుకున్నారు. ఇక ప్రధాని మోడీ దగ్గర నుంచి కేంద్రమంత్రులు వరకు ప్రచారం నిర్వహించారు. అలాగే రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ, ఇండియా కూటమిలోని ముఖ్యనాయకులంతా ప్రచారం చేపట్టారు. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి నేతలంతా పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించారు. మాటల తూటాలు పేల్చుకున్నారు. సోమవారంతో ప్రచారమైతే ముగిసింది. ఇక పోలింగ్ మిగిలి ఉంది.
ఇది కూడా చదవండి: Kolkata Doctor Case: నిందితుడు సంజయ్రాయ్ తరలింపులో పోలీసులు కొత్త ట్రిక్!
నవంబర్ 20న మహారాష్ట్ర, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జార్ఖండ్లో నవంబర్ 13న తొలి విడత పోలింగ్ ముగిసింది. చివరి విడత బుధవారం జరగనుంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఫస్ట్ ఫేజ్లో 43 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. మిగతా స్థానాలకు బుధవారం జరగనుంది. ఇక మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడ్డాయి. ఈసారి ప్రజలు ఎవరికి పట్టంకడతారో చూడాలి.
ఇది కూడా చదవండి: Naga Chaitanya Wedding Card: శుభ లేఖలను పంచుతున్న అక్కినేని ఫ్యామిలీ.. శుభలేఖను చూసారా?
नागपुर के पास काटोल में NCP शरद पवार गुट के नेता अनिल देशमुख पर हुआ हमला#AnilDeshmukh | Anil Deshmukh | #Maharashtra pic.twitter.com/Fg16WRa66u
— News24 (@news24tvchannel) November 18, 2024
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!