Amul: ఎక్స్ యూజర్లపై ‘‘అమూల్’’ ఫిర్యాదు.. తిరుపతి లడ్డూ వివాదమే కారణం..
- ఎక్స్ యూజర్లపై అమూల్ ఫిర్యాదు..
- తిరుపతి లడ్డూల్లో అమూల్ నెయ్యి ఉపయోగించారని తప్పుడు ప్రచారం..
- తాము ఎలాంటి నెయ్యి సప్లై చేయలేదని స్పష్టం చేసిన అమూల్..
- తమ సంస్థ పరువు తీయాలనే తప్పుడు ప్రచారం..
- అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అమూల్ ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amul: తిరుమల తిరుపతి దేశస్థానం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని ఉపయోగించారని, అందులో జంతువులకు సంబంధించిన కొవ్వు ఉందనే వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వెంకన్న భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి తోడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా నివేదిక కోరింది.
ఇదిలా ఉంటే, లడ్డూల తయారీలో తమ నెయ్యి ఉపయోగించినట్లు వస్తున్న ఆరోపణలపై ప్రముఖ డైరీ ఉత్పత్తుల సంస్థ అమూల్ మండిపడింది. తమపై వస్తున్న తప్పుడు కథనాలపై అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అమూల్ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిని కంపెనీ సరఫరా చేసిందని అమూల్ పరువు తీసే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
- Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
Read Also: Lebanon: లెబనాన్లో పేజర్ పేలుళ్లలో ఈ బ్యూటీ హస్తం..! ఈమె ఎవరో తెలుసా..?
గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) మేనేజింగ్ డైరెక్టర్, జయేన్ మెహతా ఈ సమస్యను ప్రస్తావిస్తూ.. ‘‘తిరుపతి దేవస్థానం లడ్డూలలో ఉపయోగించే నెయ్యి కల్తీది అని చాలా రోజులుగా పోస్టులు వ్యాపిస్తున్నాయి. కొంత మంది నెయ్యి సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. అమూల్ తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయలేదని నేను స్పష్టం చేస్తున్నాను. అమూల్ని ఈ వివాదంలోకి లాగా దాని ప్రతిష్ట దిగజార్చే వారే మేము పోలీసులు వద్ద ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి కారణం’’ అని అన్నారు.
అమూల్ 3.6 మిలియన్ల రైతుల కుటుంబాలకు చెందినదని, ఈ తప్పుడు ప్రచారం, తప్పుడు సమాచారం వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, అందుకు మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అమూల్ ఎప్పుడూ తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయలేదని చెప్పారు. తమ ఉత్పత్తులు నాణ్యతకు తగ్గట్లు ఉంటాయని చెప్పారు. తాము వినియోగదారులకు ప్రీమియం నెయ్యిని అందచేస్తున్నామని మెహతా చెప్పారు. మరోవైపు హిందూ సంస్థలు, కేంద్రమంత్రులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని, నిందితులను శిక్షించాలని కోరారు.
తాజావార్తలు
-
Mohsin Naqvi: ఐపీఎల్ ఫైనల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీని బీసీసీఐ ఆహ్వానించిందా? క్లారిటీ ఇదిగో..
-
Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
-
David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ నుంచి క్రేజీ లీక్ వైరల్!
-
Sunil Narine: ఇంకా చాలా మ్యాచ్లు ఆడాలని ఉంది.. ఒక్కసారిగా ఏడ్చేసిన కేకేఆర్ స్టార్ సునీల్ నరైన్!
-
Healthy Breakfast Recipe: రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఇదే బెస్ట్ బ్రేక్ఫాస్ట్..! ప్రోటీన్ అధికంగా ఉండే శనగ చాట్ ఇలా ట్రై చేయండి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..