Amul: ఎక్స్ యూజర్లపై ‘‘అమూల్’’ ఫిర్యాదు.. తిరుపతి లడ్డూ వివాదమే కారణం..
- ఎక్స్ యూజర్లపై అమూల్ ఫిర్యాదు..
- తిరుపతి లడ్డూల్లో అమూల్ నెయ్యి ఉపయోగించారని తప్పుడు ప్రచారం..
- తాము ఎలాంటి నెయ్యి సప్లై చేయలేదని స్పష్టం చేసిన అమూల్..
- తమ సంస్థ పరువు తీయాలనే తప్పుడు ప్రచారం..
- అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అమూల్ ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amul: తిరుమల తిరుపతి దేశస్థానం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని ఉపయోగించారని, అందులో జంతువులకు సంబంధించిన కొవ్వు ఉందనే వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వెంకన్న భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి తోడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా నివేదిక కోరింది.
ఇదిలా ఉంటే, లడ్డూల తయారీలో తమ నెయ్యి ఉపయోగించినట్లు వస్తున్న ఆరోపణలపై ప్రముఖ డైరీ ఉత్పత్తుల సంస్థ అమూల్ మండిపడింది. తమపై వస్తున్న తప్పుడు కథనాలపై అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అమూల్ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిని కంపెనీ సరఫరా చేసిందని అమూల్ పరువు తీసే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
Read Also: Lebanon: లెబనాన్లో పేజర్ పేలుళ్లలో ఈ బ్యూటీ హస్తం..! ఈమె ఎవరో తెలుసా..?
గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) మేనేజింగ్ డైరెక్టర్, జయేన్ మెహతా ఈ సమస్యను ప్రస్తావిస్తూ.. ‘‘తిరుపతి దేవస్థానం లడ్డూలలో ఉపయోగించే నెయ్యి కల్తీది అని చాలా రోజులుగా పోస్టులు వ్యాపిస్తున్నాయి. కొంత మంది నెయ్యి సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. అమూల్ తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయలేదని నేను స్పష్టం చేస్తున్నాను. అమూల్ని ఈ వివాదంలోకి లాగా దాని ప్రతిష్ట దిగజార్చే వారే మేము పోలీసులు వద్ద ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి కారణం’’ అని అన్నారు.
అమూల్ 3.6 మిలియన్ల రైతుల కుటుంబాలకు చెందినదని, ఈ తప్పుడు ప్రచారం, తప్పుడు సమాచారం వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, అందుకు మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అమూల్ ఎప్పుడూ తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయలేదని చెప్పారు. తమ ఉత్పత్తులు నాణ్యతకు తగ్గట్లు ఉంటాయని చెప్పారు. తాము వినియోగదారులకు ప్రీమియం నెయ్యిని అందచేస్తున్నామని మెహతా చెప్పారు. మరోవైపు హిందూ సంస్థలు, కేంద్రమంత్రులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని, నిందితులను శిక్షించాలని కోరారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!