Amul: ఎక్స్ యూజర్లపై ‘‘అమూల్’’ ఫిర్యాదు.. తిరుపతి లడ్డూ వివాదమే కారణం..
- ఎక్స్ యూజర్లపై అమూల్ ఫిర్యాదు..
- తిరుపతి లడ్డూల్లో అమూల్ నెయ్యి ఉపయోగించారని తప్పుడు ప్రచారం..
- తాము ఎలాంటి నెయ్యి సప్లై చేయలేదని స్పష్టం చేసిన అమూల్..
- తమ సంస్థ పరువు తీయాలనే తప్పుడు ప్రచారం..
- అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అమూల్ ఫిర్యాదు..
Amul: తిరుమల తిరుపతి దేశస్థానం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని ఉపయోగించారని, అందులో జంతువులకు సంబంధించిన కొవ్వు ఉందనే వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వెంకన్న భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి తోడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా నివేదిక కోరింది.
ఇదిలా ఉంటే, లడ్డూల తయారీలో తమ నెయ్యి ఉపయోగించినట్లు వస్తున్న ఆరోపణలపై ప్రముఖ డైరీ ఉత్పత్తుల సంస్థ అమూల్ మండిపడింది. తమపై వస్తున్న తప్పుడు కథనాలపై అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అమూల్ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిని కంపెనీ సరఫరా చేసిందని అమూల్ పరువు తీసే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Lebanon: లెబనాన్లో పేజర్ పేలుళ్లలో ఈ బ్యూటీ హస్తం..! ఈమె ఎవరో తెలుసా..?
గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) మేనేజింగ్ డైరెక్టర్, జయేన్ మెహతా ఈ సమస్యను ప్రస్తావిస్తూ.. ‘‘తిరుపతి దేవస్థానం లడ్డూలలో ఉపయోగించే నెయ్యి కల్తీది అని చాలా రోజులుగా పోస్టులు వ్యాపిస్తున్నాయి. కొంత మంది నెయ్యి సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. అమూల్ తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయలేదని నేను స్పష్టం చేస్తున్నాను. అమూల్ని ఈ వివాదంలోకి లాగా దాని ప్రతిష్ట దిగజార్చే వారే మేము పోలీసులు వద్ద ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి కారణం’’ అని అన్నారు.
అమూల్ 3.6 మిలియన్ల రైతుల కుటుంబాలకు చెందినదని, ఈ తప్పుడు ప్రచారం, తప్పుడు సమాచారం వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, అందుకు మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అమూల్ ఎప్పుడూ తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయలేదని చెప్పారు. తమ ఉత్పత్తులు నాణ్యతకు తగ్గట్లు ఉంటాయని చెప్పారు. తాము వినియోగదారులకు ప్రీమియం నెయ్యిని అందచేస్తున్నామని మెహతా చెప్పారు. మరోవైపు హిందూ సంస్థలు, కేంద్రమంత్రులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని, నిందితులను శిక్షించాలని కోరారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!