అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు.. నేడు పార్లమెంట్లో అమిత్ షా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది.. అయితే, అసదుద్దీన్ ఒవైసీపై జరిగిన దాడి ఘటనపై ఇవాళ పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన ఘటనపై ఇవాళ రాజ్యసభలో ఉదయం 11.10 గంటలకు, లోక్సభలో సాయంత్రం 4.10 గంటలకు ప్రకటన చేయనున్నారు అమిత్ షా.. ఇక, ఆదివారం కన్నుమూసిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్కు నివాళులర్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు గంటపాటు వాయిదా పడనున్నాయి..
Read Also: పెరగనున్న కీలక వడ్డీ రేట్లు..!
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
కాగా, ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఒవైసీ.. తిరిగి ఢిల్లీకి వెళ్తుండగా.. మీరట్లోని టోల్ప్లాజా వద్ద ఒవైసీ కారుపై మూడు-నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు.. టోల్ ప్లాజా వద్ద ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇక, ఈ ఘటనతో హైదరాబాద్ ఎంపీకి ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకోగా.. ఆ వెంటనే ఆయన తిరస్కరించారు. లోక్సభలో ఒవైసీ మాట్లాడుతూ, తనకు భద్రత అక్కర్లేదని, బదులుగా తనను అందరితో సమానంగా “ఎ కేటగిరీ” పౌరుడిగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. నాకు జెడ్ కేటగిరీ భద్రత వద్దు.. మీ అందరితో సమానంగా నేను ‘ఎ’ కేటగిరీ పౌరుడిగా ఉండాలనుకుంటున్నాను. నాపై కాల్పులు జరిపిన వారిపై చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం ఎందుకు ప్రయోగించలేదు? అని ప్రశ్నించారు. దీంతో.. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
-
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!