అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు.. నేడు పార్లమెంట్లో అమిత్ షా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది.. అయితే, అసదుద్దీన్ ఒవైసీపై జరిగిన దాడి ఘటనపై ఇవాళ పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన ఘటనపై ఇవాళ రాజ్యసభలో ఉదయం 11.10 గంటలకు, లోక్సభలో సాయంత్రం 4.10 గంటలకు ప్రకటన చేయనున్నారు అమిత్ షా.. ఇక, ఆదివారం కన్నుమూసిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్కు నివాళులర్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు గంటపాటు వాయిదా పడనున్నాయి..
Read Also: పెరగనున్న కీలక వడ్డీ రేట్లు..!
Also Read
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
- Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
- UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
కాగా, ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఒవైసీ.. తిరిగి ఢిల్లీకి వెళ్తుండగా.. మీరట్లోని టోల్ప్లాజా వద్ద ఒవైసీ కారుపై మూడు-నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు.. టోల్ ప్లాజా వద్ద ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇక, ఈ ఘటనతో హైదరాబాద్ ఎంపీకి ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకోగా.. ఆ వెంటనే ఆయన తిరస్కరించారు. లోక్సభలో ఒవైసీ మాట్లాడుతూ, తనకు భద్రత అక్కర్లేదని, బదులుగా తనను అందరితో సమానంగా “ఎ కేటగిరీ” పౌరుడిగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. నాకు జెడ్ కేటగిరీ భద్రత వద్దు.. మీ అందరితో సమానంగా నేను ‘ఎ’ కేటగిరీ పౌరుడిగా ఉండాలనుకుంటున్నాను. నాపై కాల్పులు జరిపిన వారిపై చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం ఎందుకు ప్రయోగించలేదు? అని ప్రశ్నించారు. దీంతో.. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!