Bharatpol: నేడు ‘భారత్పోల్’ పోర్టల్ను ప్రారంభించనున్న అమిత్ షా.. ఇక, నేరస్థులకు దబిడిదిబిడే
- నేడు ‘భారత్పోల్’ పోర్టల్ను ప్రారంభించనున్న అమిత్ షా..
- జాతీయ, అంతర్జాతీయ నేరగాళ్ల నెట్వర్క్ను ట్రాక్ చేయడానికి ఈ పోర్టల్..
- 'భారత్పోల్'తో సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుందని సీబీఐ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharatpol: జాతీయ, అంతర్జాతీయ నేరగాళ్ల నెట్వర్క్ను ట్రాక్ చేసి పట్టుకోవడం ఇప్పుడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరింత ఈజీగా మారనుంది. భారతదేశంలో నేరాలు చేసి విదేశాలకు పారిపోవడం లేదా భారత్ లోని అజ్ఞాత ప్రాంతాల్లో తలదాచుకునే నేరస్థుల ఆటకట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ టెక్నాలజీతో ఇండియన్ పోలీసులు తక్షణమే క్రిమినల్ రికార్డులు షేర్ చేసి ఆ వివరాలను అప్లోడ్ చేయడంతో ఇంటర్పోల్ను అలర్ట్ చేయవచ్చు అన్నమాట. దీని కోసం ‘భారత్పోల్’ అనే పోర్టల్ను సీబీఐ తయారు చేసింది. దీన్ని ఈరోజు (జనవరి 7) కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రారంభించనున్నారు.
Read Also: Ghatkesar: కారు దగ్ధం కేసులో ట్విస్ట్.. సజీవదహనం అయిన ఆ జంట ఎవరంటే..!
Also Read
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
కాగా, నేరస్థులపై సకాలంలో ఉక్కుపాదం మోపడంతో పాటు వారిని ట్రాక్ చేసి పట్టుకోవడమే ఈ ‘భారత్పోల్’ ముఖ్య లక్ష్యం. అయితే, సాధారణంగా భారతదేశంలో, విదేశాలలో తలదాచుకున్న నేరస్థులను అరెస్టు చేసేందుకు.. సమాచారాన్ని పొందడానికి రాష్ట్ర పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంటుంది. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సీబీఐని కాంటాక్ట్ కావాలి.. ఆ తర్వాత సీబీఐ ఇంటర్పోల్ను సంప్రదించి అవసరమైన నోటీసులు ఇస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండటంతో ‘భారత్పోల్’తో ఈ సమస్య సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని సీబీఐ వెల్లడించింది.
Read Also: Venkatesh: పెళ్ళాలకి మీ ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు
ఇక, తాజా టెక్నాలజీతో దర్యాప్తు సంస్థలు, రాష్ట్రాలు నేరుగా భారత్పోల్తో కనెక్ట్ అయి ఉంటాయి. నేరగాళ్ల సమాచారం లేదా స్థానాన్ని కనుగోల్సి వచ్చినప్పుడు పోలీసులు భారత్పోల్ ద్వారా నేరుగా ఇంటర్పోల్కు రిక్వెస్ట్ పంపిస్తారు. ఇంటర్పోల్ ఆ అభ్యర్థనను ఒప్పుకుంటే, సంబంధిత నేరస్థుడికి వ్యతిరేకంగా రెడ్ నోటీసు, డిఫ్యూజన్ నోటీసులు, ఇతర రకాల నోటీసులను జారీ చేస్తుంది. ఇంటర్పోల్తో కమ్యూనికేషన్ను ఈజీగా చేయడం, వేగవంతం చేయడమే భారత్పోల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
తాజావార్తలు
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!