Bharatpol: నేడు ‘భారత్పోల్’ పోర్టల్ను ప్రారంభించనున్న అమిత్ షా.. ఇక, నేరస్థులకు దబిడిదిబిడే
- నేడు ‘భారత్పోల్’ పోర్టల్ను ప్రారంభించనున్న అమిత్ షా..
- జాతీయ, అంతర్జాతీయ నేరగాళ్ల నెట్వర్క్ను ట్రాక్ చేయడానికి ఈ పోర్టల్..
- 'భారత్పోల్'తో సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుందని సీబీఐ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharatpol: జాతీయ, అంతర్జాతీయ నేరగాళ్ల నెట్వర్క్ను ట్రాక్ చేసి పట్టుకోవడం ఇప్పుడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరింత ఈజీగా మారనుంది. భారతదేశంలో నేరాలు చేసి విదేశాలకు పారిపోవడం లేదా భారత్ లోని అజ్ఞాత ప్రాంతాల్లో తలదాచుకునే నేరస్థుల ఆటకట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ టెక్నాలజీతో ఇండియన్ పోలీసులు తక్షణమే క్రిమినల్ రికార్డులు షేర్ చేసి ఆ వివరాలను అప్లోడ్ చేయడంతో ఇంటర్పోల్ను అలర్ట్ చేయవచ్చు అన్నమాట. దీని కోసం ‘భారత్పోల్’ అనే పోర్టల్ను సీబీఐ తయారు చేసింది. దీన్ని ఈరోజు (జనవరి 7) కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రారంభించనున్నారు.
Read Also: Ghatkesar: కారు దగ్ధం కేసులో ట్విస్ట్.. సజీవదహనం అయిన ఆ జంట ఎవరంటే..!
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
కాగా, నేరస్థులపై సకాలంలో ఉక్కుపాదం మోపడంతో పాటు వారిని ట్రాక్ చేసి పట్టుకోవడమే ఈ ‘భారత్పోల్’ ముఖ్య లక్ష్యం. అయితే, సాధారణంగా భారతదేశంలో, విదేశాలలో తలదాచుకున్న నేరస్థులను అరెస్టు చేసేందుకు.. సమాచారాన్ని పొందడానికి రాష్ట్ర పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంటుంది. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సీబీఐని కాంటాక్ట్ కావాలి.. ఆ తర్వాత సీబీఐ ఇంటర్పోల్ను సంప్రదించి అవసరమైన నోటీసులు ఇస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండటంతో ‘భారత్పోల్’తో ఈ సమస్య సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని సీబీఐ వెల్లడించింది.
Read Also: Venkatesh: పెళ్ళాలకి మీ ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు
ఇక, తాజా టెక్నాలజీతో దర్యాప్తు సంస్థలు, రాష్ట్రాలు నేరుగా భారత్పోల్తో కనెక్ట్ అయి ఉంటాయి. నేరగాళ్ల సమాచారం లేదా స్థానాన్ని కనుగోల్సి వచ్చినప్పుడు పోలీసులు భారత్పోల్ ద్వారా నేరుగా ఇంటర్పోల్కు రిక్వెస్ట్ పంపిస్తారు. ఇంటర్పోల్ ఆ అభ్యర్థనను ఒప్పుకుంటే, సంబంధిత నేరస్థుడికి వ్యతిరేకంగా రెడ్ నోటీసు, డిఫ్యూజన్ నోటీసులు, ఇతర రకాల నోటీసులను జారీ చేస్తుంది. ఇంటర్పోల్తో కమ్యూనికేషన్ను ఈజీగా చేయడం, వేగవంతం చేయడమే భారత్పోల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!