Bharatpol: నేడు ‘భారత్పోల్’ పోర్టల్ను ప్రారంభించనున్న అమిత్ షా.. ఇక, నేరస్థులకు దబిడిదిబిడే
- నేడు ‘భారత్పోల్’ పోర్టల్ను ప్రారంభించనున్న అమిత్ షా..
- జాతీయ, అంతర్జాతీయ నేరగాళ్ల నెట్వర్క్ను ట్రాక్ చేయడానికి ఈ పోర్టల్..
- 'భారత్పోల్'తో సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుందని సీబీఐ వెల్లడి
Bharatpol: జాతీయ, అంతర్జాతీయ నేరగాళ్ల నెట్వర్క్ను ట్రాక్ చేసి పట్టుకోవడం ఇప్పుడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరింత ఈజీగా మారనుంది. భారతదేశంలో నేరాలు చేసి విదేశాలకు పారిపోవడం లేదా భారత్ లోని అజ్ఞాత ప్రాంతాల్లో తలదాచుకునే నేరస్థుల ఆటకట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ టెక్నాలజీతో ఇండియన్ పోలీసులు తక్షణమే క్రిమినల్ రికార్డులు షేర్ చేసి ఆ వివరాలను అప్లోడ్ చేయడంతో ఇంటర్పోల్ను అలర్ట్ చేయవచ్చు అన్నమాట. దీని కోసం ‘భారత్పోల్’ అనే పోర్టల్ను సీబీఐ తయారు చేసింది. దీన్ని ఈరోజు (జనవరి 7) కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రారంభించనున్నారు.
Read Also: Ghatkesar: కారు దగ్ధం కేసులో ట్విస్ట్.. సజీవదహనం అయిన ఆ జంట ఎవరంటే..!
Also Read
- PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
కాగా, నేరస్థులపై సకాలంలో ఉక్కుపాదం మోపడంతో పాటు వారిని ట్రాక్ చేసి పట్టుకోవడమే ఈ ‘భారత్పోల్’ ముఖ్య లక్ష్యం. అయితే, సాధారణంగా భారతదేశంలో, విదేశాలలో తలదాచుకున్న నేరస్థులను అరెస్టు చేసేందుకు.. సమాచారాన్ని పొందడానికి రాష్ట్ర పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంటుంది. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సీబీఐని కాంటాక్ట్ కావాలి.. ఆ తర్వాత సీబీఐ ఇంటర్పోల్ను సంప్రదించి అవసరమైన నోటీసులు ఇస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండటంతో ‘భారత్పోల్’తో ఈ సమస్య సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని సీబీఐ వెల్లడించింది.
Read Also: Venkatesh: పెళ్ళాలకి మీ ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు
ఇక, తాజా టెక్నాలజీతో దర్యాప్తు సంస్థలు, రాష్ట్రాలు నేరుగా భారత్పోల్తో కనెక్ట్ అయి ఉంటాయి. నేరగాళ్ల సమాచారం లేదా స్థానాన్ని కనుగోల్సి వచ్చినప్పుడు పోలీసులు భారత్పోల్ ద్వారా నేరుగా ఇంటర్పోల్కు రిక్వెస్ట్ పంపిస్తారు. ఇంటర్పోల్ ఆ అభ్యర్థనను ఒప్పుకుంటే, సంబంధిత నేరస్థుడికి వ్యతిరేకంగా రెడ్ నోటీసు, డిఫ్యూజన్ నోటీసులు, ఇతర రకాల నోటీసులను జారీ చేస్తుంది. ఇంటర్పోల్తో కమ్యూనికేషన్ను ఈజీగా చేయడం, వేగవంతం చేయడమే భారత్పోల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
తాజావార్తలు
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో