Bharatpol: నేడు ‘భారత్పోల్’ పోర్టల్ను ప్రారంభించనున్న అమిత్ షా.. ఇక, నేరస్థులకు దబిడిదిబిడే
- నేడు ‘భారత్పోల్’ పోర్టల్ను ప్రారంభించనున్న అమిత్ షా..
- జాతీయ, అంతర్జాతీయ నేరగాళ్ల నెట్వర్క్ను ట్రాక్ చేయడానికి ఈ పోర్టల్..
- 'భారత్పోల్'తో సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుందని సీబీఐ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharatpol: జాతీయ, అంతర్జాతీయ నేరగాళ్ల నెట్వర్క్ను ట్రాక్ చేసి పట్టుకోవడం ఇప్పుడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరింత ఈజీగా మారనుంది. భారతదేశంలో నేరాలు చేసి విదేశాలకు పారిపోవడం లేదా భారత్ లోని అజ్ఞాత ప్రాంతాల్లో తలదాచుకునే నేరస్థుల ఆటకట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ టెక్నాలజీతో ఇండియన్ పోలీసులు తక్షణమే క్రిమినల్ రికార్డులు షేర్ చేసి ఆ వివరాలను అప్లోడ్ చేయడంతో ఇంటర్పోల్ను అలర్ట్ చేయవచ్చు అన్నమాట. దీని కోసం ‘భారత్పోల్’ అనే పోర్టల్ను సీబీఐ తయారు చేసింది. దీన్ని ఈరోజు (జనవరి 7) కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రారంభించనున్నారు.
Read Also: Ghatkesar: కారు దగ్ధం కేసులో ట్విస్ట్.. సజీవదహనం అయిన ఆ జంట ఎవరంటే..!
Also Read
- INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
కాగా, నేరస్థులపై సకాలంలో ఉక్కుపాదం మోపడంతో పాటు వారిని ట్రాక్ చేసి పట్టుకోవడమే ఈ ‘భారత్పోల్’ ముఖ్య లక్ష్యం. అయితే, సాధారణంగా భారతదేశంలో, విదేశాలలో తలదాచుకున్న నేరస్థులను అరెస్టు చేసేందుకు.. సమాచారాన్ని పొందడానికి రాష్ట్ర పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంటుంది. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సీబీఐని కాంటాక్ట్ కావాలి.. ఆ తర్వాత సీబీఐ ఇంటర్పోల్ను సంప్రదించి అవసరమైన నోటీసులు ఇస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండటంతో ‘భారత్పోల్’తో ఈ సమస్య సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని సీబీఐ వెల్లడించింది.
Read Also: Venkatesh: పెళ్ళాలకి మీ ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు
ఇక, తాజా టెక్నాలజీతో దర్యాప్తు సంస్థలు, రాష్ట్రాలు నేరుగా భారత్పోల్తో కనెక్ట్ అయి ఉంటాయి. నేరగాళ్ల సమాచారం లేదా స్థానాన్ని కనుగోల్సి వచ్చినప్పుడు పోలీసులు భారత్పోల్ ద్వారా నేరుగా ఇంటర్పోల్కు రిక్వెస్ట్ పంపిస్తారు. ఇంటర్పోల్ ఆ అభ్యర్థనను ఒప్పుకుంటే, సంబంధిత నేరస్థుడికి వ్యతిరేకంగా రెడ్ నోటీసు, డిఫ్యూజన్ నోటీసులు, ఇతర రకాల నోటీసులను జారీ చేస్తుంది. ఇంటర్పోల్తో కమ్యూనికేషన్ను ఈజీగా చేయడం, వేగవంతం చేయడమే భారత్పోల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
తాజావార్తలు
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!