Delhi Elections: మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా
- మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా
- సంకల్ప్ పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక బీజేపీ ఇప్పటి వరకు రెండు మేనిఫెస్టోలు విడుదల చేయగా.. తాజాగా మూడో మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మూడో మేనిఫెస్టోను విడుదల చేశారు. సంకల్ప్ పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు. సంకల్ప్ పత్రలో బూటకపు వాగ్దానాలు లేవని.. ఢిల్లీలో చేయాల్సిన పనులను గూర్చే హామీలు ఇస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు . పేదలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఆగిపోవని.. బీజేపీ అన్ని హామీలు నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Thandel: ప్రమాదంలో తండేల్ డైరెక్టర్ సహా సినిమాటోగ్రాఫర్.. ఏమైందంటే?
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ఇప్పటికే మొదటి విడత హామీలో మహిళలు లక్ష్యంగా వాగ్దానాలు చేసింది. రెండో విడతలో యువత, విద్యార్థులు లక్ష్యంగా హామీలు ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ సంస్థల్లో నిరుపేద విద్యార్థులకు ప్రీ-స్కూల్ నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీల వరకు ఉచిత విద్య, రూ. 15,000 నగదు సాయం.. అలాగే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రయాణ రీయింబర్స్మెంట్తో పాటు పలు ఉచిత హామీలను ఇచ్చింది. అంతేకాకుండా టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు నెలవారీ రూ.1,000 స్టైఫండ్ అందుతుందని బీజేపీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Republic Day 2025 : తెలంగాణలో విశిష్ట సేవా పతకాలు వచ్చింది వీరికే
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక్కడ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ట్రై చేస్తోంది. అధికారం కోసం పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.
#WATCH | Delhi | Union Home Minister Amit Shah releases the BJP 'Sankalp Patra' at party headquarters ahead of the #DelhiElections2025. Delhi BJP President Virendraa Sachdeva and other senior party leaders also present. pic.twitter.com/sFFvcSEUhT
— ANI (@ANI) January 25, 2025
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..