Delhi Elections: మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా
- మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా
- సంకల్ప్ పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక బీజేపీ ఇప్పటి వరకు రెండు మేనిఫెస్టోలు విడుదల చేయగా.. తాజాగా మూడో మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మూడో మేనిఫెస్టోను విడుదల చేశారు. సంకల్ప్ పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు. సంకల్ప్ పత్రలో బూటకపు వాగ్దానాలు లేవని.. ఢిల్లీలో చేయాల్సిన పనులను గూర్చే హామీలు ఇస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు . పేదలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఆగిపోవని.. బీజేపీ అన్ని హామీలు నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Thandel: ప్రమాదంలో తండేల్ డైరెక్టర్ సహా సినిమాటోగ్రాఫర్.. ఏమైందంటే?
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
ఇప్పటికే మొదటి విడత హామీలో మహిళలు లక్ష్యంగా వాగ్దానాలు చేసింది. రెండో విడతలో యువత, విద్యార్థులు లక్ష్యంగా హామీలు ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ సంస్థల్లో నిరుపేద విద్యార్థులకు ప్రీ-స్కూల్ నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీల వరకు ఉచిత విద్య, రూ. 15,000 నగదు సాయం.. అలాగే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రయాణ రీయింబర్స్మెంట్తో పాటు పలు ఉచిత హామీలను ఇచ్చింది. అంతేకాకుండా టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు నెలవారీ రూ.1,000 స్టైఫండ్ అందుతుందని బీజేపీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Republic Day 2025 : తెలంగాణలో విశిష్ట సేవా పతకాలు వచ్చింది వీరికే
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక్కడ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ట్రై చేస్తోంది. అధికారం కోసం పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.
#WATCH | Delhi | Union Home Minister Amit Shah releases the BJP 'Sankalp Patra' at party headquarters ahead of the #DelhiElections2025. Delhi BJP President Virendraa Sachdeva and other senior party leaders also present. pic.twitter.com/sFFvcSEUhT
— ANI (@ANI) January 25, 2025
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్పై 100% టారిఫ్లు? అమెరికా హౌస్లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!