Amit Shah: “ఓటు బ్యాంకు” భయంతో, ఉగ్రవాద దాడులపై కాంగ్రెస్, ఆర్జేడీలు మౌనం..
- ఓటు బ్యాంకు భయంతోనే ఉగ్రవాద దాడులపై కాంగ్రెస్, ఆర్జేడీ మౌనం..
- బీహార్ ఎన్నికల ప్రచారంలో విరుచుకుపడిన అమిత్ షా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్పై ప్రధాని నరేంద్రమోడీని ప్రశంసించారు. యూపీఏ ప్రభుత్వ సమయంలో పాకిస్తాన్ ప్రతీ రోజూ దాడులు చేసేదని, ఓటు బ్యాంకు కోల్పోతామనే భయంతో కాంగ్రెస్, ఆర్జేడీలు మౌనంగా ఉన్నాయని విమర్శించారు. బీహార్లోని ఖగారియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన షా, ఉరి, పుల్వామా, పహల్గామ్లలో జరిగిన ఉగ్రవాద దాడుల తర్వాత ప్రతీకారం తీర్చుకోవడం ద్వారా ప్రధాని మోదీ భారతదేశాన్ని సురక్షితంగా ఉంచారని చెప్పారు.
Also Read
- West Bengal: "వాడికి ఇదే సరైన శిక్ష".. అత్యాచారం-హత్య కేసు నిందితుడి మృతదేహాన్ని స్వీకరించడానికి నిరాకరించిన తల్లి
- Made in India Weapons: బ్రహ్మోస్ నుంచి ఆకాశ్తీర్ వరకు.. రక్షణ ఎగుమతుల్లో భారత జైత్రయాత్ర
- Amarnath Yatra: అమర్నాథ్ యాత్రికులకు షాకింగ్ న్యూస్.. 5 రోజుల్లోనే! అసలు ఏం జరిగింది?
- Love Marriage: తల్లడిల్లిన కన్నపేగు.. తల్లిదండ్రులు కాళ్లమీద పడి వేడుకున్నా.. ప్రియుడితోనే వెళ్లిన కూతురు (వీడియో)
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాకిస్తాన్ ప్రతీరోజూ దాడులు చేస్తున్నా, ఓటు బ్యాంకు కోసం సోనియా, మన్మోహన్, లలూ ప్రభుత్వాలు మౌనంగా ఉన్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ‘ఓటరు అధికార్ యాత్ర’పై కూడా అమిత్ షా విమర్శలు చేశారు. రాహుల్ యాత్ర రాష్ట్రంలోని చొరబాటుదారుల్ని రక్షించడానికి అని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం బీహార్లోని చొరబాటుదారుల్ని ఏరిపారేస్తుందని చెప్పారు. ప్రధాని మోడీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చిందని, 2027 నాటికి భారత్ మూడో స్థానానికి చేరుకుంటుందని అన్నారు. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్లో నవంబర్ 6, నవంబర్ 11న రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
Pakistan: లైంగిక నేరస్తుడు ‘‘డాడీ’’పై బ్రిటన్తో పాకిస్తాన్ డీల్.!
-
Jofra Archer: ‘నేను ముందే చెప్పా.. సూర్యవంశీని అవుట్ చేయడం ఎలానో నాకు తెలుసని’..
-
Kadiyam Srihari: “నేనేం తప్పు చేయలేదు”.. మంత్రి కొండా సురేఖ లేఖపై స్పందించిన కడియం శ్రీహరి
-
Kangana Ranaut: కేతన్ హత్య నేపథ్యంలో యువతకు కంగనా రనౌత్ కీలక సలహా
-
Team India: బ్యాటింగ్ నుంచి కెప్టెన్సీ వరకు.. టీమిండియా వరుస వైఫల్యాల వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..