Amit Shah: కాంగ్రెస్, జేడీయూ టిప్పు సుల్తాన్ను నమ్ముకుంటున్నాయి.. బీజేపీ మాత్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం కర్ణాటకలో పర్యటించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరులో సెంట్రల్ అరెకానట్ మరియు కోకో మార్కెటింగ్ మరియు ప్రాసెసింగ్ కో-ఆపరేటివ్ లిమిటెడ్ (క్యాంప్కో) స్వర్ణోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, జేడీయూపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. 18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ను కాంగ్రెస్, జేడీ(ఎస్)లు విశ్వసించాయని, ఈ రెండు పార్టీల వల్ల కర్ణాటకకు ఎలాంటి మేలు జరగలేదని ఆయన ఆరోపించారు. బీజేపీ మాత్రం 16వ శతాబ్దపు తుళువ రాణి ఉల్లాల్ రాణి అబ్బక్క చౌటా స్పూర్తితో సుసంపన్నమైన పాలన అందిస్తోందని ఆయన అన్నారు.
Read Also: Viral: ఆ ప్రాంతంలో ప్లేట్ తన్నుతూ భర్తలకు భోజనం పెడతారు.. ఎందుకో తెలుసా?
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని.. ప్రతిపక్ష పార్టీ కర్ణాటకను గాంధీ కుటుంబానికి ఏటీఎంగా ఉపయోగించుకుందని ఆరోపించారు. టిప్పును నమ్మే జేడీఎస్, కాంగ్రెస్లకు ఓటేయాలా లేక రాణి అబ్బక్కపై విశ్వాసం ఉంచిన బిజెపికి ఓటేయాలా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో తదుపరి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలి..? ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని దేశభక్తులా..? లేక కర్ణాటకను ఏటీఎంగా మార్చుకున్న గాంధీ కుటుంబ పార్టీ కాంగ్రెస్ కా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, జేడీయూ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని.. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కర్ణాటక అభివృద్ధి చెందిందని అమిత్ షా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతులు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పను గుర్తుంచుకుంటారని.. ఆయన నాయకత్వంలోనే బెంగళూర్ అభివృద్ధి చెందిందని అన్నారు.
- Tags
- Amith Shah
- bjp
- congress
- JDS
- karnataka
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!