AIADMK-BJP: బీజేపీ, అన్నాడీఎంకే పొత్తును ప్రకటించిన అమిత్ షా..
- అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు ప్రకటించిన అమిత్ షా..
- తమిళనాడు ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం..
AIADMK-BJP: తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. మాజీ సీఎం ఎడప్పాడి పళని స్వామి నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.
ఈ సమావేశంలో పళని స్వామి మాట్లాడుతూ.. రెండు పార్టీలు గతంలో పొత్తు పెట్టుకున్నాయి. రెండు పార్టీలు కలిసే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వెళ్తామని చెప్పారు. అవసరమైతే రెండు పార్టీలు ‘‘కామన్ మినిమమ్ ప్రోగ్రామ్’’ని రూపొందిస్తామని అమిత్ షా చెప్పారు.
అన్నాడీఎంకేకి ఎలాంటి షరతులు, డిమాండ్లు లేవని, ఆ పార్టీ అంతర్గత విషయాల్లో తాము జోక్యం చేసుకోమని, ఈ కూటమి ఎన్డీయేకి, అన్నా డీఎంకేకి రెండింటికి ప్రయోజనకంగంగా ఉంటుందని అమిత్ షా చెప్పారు.
Also Read
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
Read Also: Wearing Tight Jeans: వేసవిలో జీన్స్ ధరిస్తున్నారా?
1988లో దివంగత మాజీ సీఎం జయలలిత నేతృత్వంలో బీజేపీ అన్నాడీఎంకే పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు లోక్సభలో భారీ విజయాన్ని నమోదు చేసిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు. ఒక దశల్లో ఈ కూటమి తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలకు 30 స్థానాలు గెలుచుకుందని ఆయన చెప్పారు. తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీయే సులభంగా గెలుస్తుందని షా ధీమా వ్యక్తం చేశారు.
సీట్ల పంపిణీ, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రిత్వ శాఖల పంపిణీ రెండు తర్వాత నిర్ణయించబడుతాయని అమిత్ షా చెప్పారు. తమిళనాడులో నిజమైన సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి డీఎంకే సనాతన ధర్మం, త్రిభాషా విధానం వంటి వాటిని లేవనెత్తుతోందని ఆయన విమర్శించారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, దళితులు-మహిళలపై దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేస్తారని చెప్పారు. రూ. 39,000 కోట్ల మద్యం కుంభకోణం, ఇసుక తవ్వకాల కుంభకోణం, ఎల్సీటీఓ స్కామ్, రవాణా కుంభకోణాలను డీఎంకే పార్టీ చేసిందని అమిత్ షా దుయ్యబట్టారు. తమిళనాడు ప్రజలకు డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్, అతడి కొడుకు ఉదయనిధి స్టాలిన్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
#WATCH | Chennai, Tamil Nadu: On BJP-AIADMK alliance for Tamil Nadu Vidhan Sabha elections, Union Home Minister Amit Shah says, "Seat distribution and the distribution of ministries after the government is formed, both will be decided later… In Tamil Nadu, the DMK is bringing… pic.twitter.com/wn0j1eyhZt
— ANI (@ANI) April 11, 2025
#WATCH | Chennai, Tamil Nadu: On NDA alliance for Tamil Nadu Vidhan Sabha elections, Union Home Minister Amit Shah says, "These elections will be contested under the leadership of PM Modi on a national level and under the leadership of AIADMK leader Edappadi K. Palaniswami on the… pic.twitter.com/NHgNC4SviR
— ANI (@ANI) April 11, 2025
తాజావార్తలు
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
-
Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
-
MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి
-
North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
-
Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!