Amit Shah: జమ్మూకశ్మీర్లో కీలక ప్రకటన.. ఆ వర్గానికి కోటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah Announced A Quota To Gujjar Bakarwal Pahari Communities In Jammu Kashmir: తన జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్లతో పాటు పహారీ సామాజిక వర్గానికీ ఎస్టీ హోదా కల్పించి.. త్వరలోనే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎస్టీ కోటాలో గుజ్జర్లు, బకర్వాల్లు, పహారీలకు ఎలాంటి తగ్గుదల ఉండదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ వాటాను పొందుతారని వెల్లడించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల.. జమ్మూకశ్మీర్లోని అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అందించేందుకు మార్గం సుగమం అయ్యిందన్నారు.
ఇదే సమయంలో అమిత్ షా జమ్మూకశ్మీర్లోని విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో జమ్మూకశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఇక్కడ కేవలం మూడు రాజకీయ కుటుంబాలే పాలించేవని మండిపడ్డారు. కానీ ఇప్పుడు పంచాయతీలు, కౌన్సిల్లకు.. న్యాయమైన ఎన్నికల ద్వారా ఎన్నికైన 30 వేల మంది వ్యక్తుల వద్ద అధికారం ఉందని చెప్పారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి ఇంతకుముందు కేంద్రం చాలా నిధులు ఇచ్చిందని, అయితే ఆ డబ్బంతా కొందరే దోచుకున్నారని ఆరోపణలు చేశారు. కానీ.. ఇప్పుడు కేవలం ప్రజల సంక్షేమం కోసం ఆ నిధులు ఖర్చు అవుతున్నాయన్నారు. ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టేందుకు ప్రధాని మోదీ పటిష్టమైన చర్యలు తీసుకున్నారని.. దాంతో భద్రతా సిబ్బంది మరణాల సంఖ్య చాలా తగ్గిందన్నారు. గతంలో ఏడాదికి 1200 మంది ప్రాణాలు కోల్పేతే.. ఇప్పుడా సంఖ్య 136కి తగ్గిందని పేర్కొన్నారు.
Also Read
- Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Sugar Shortage: దేశంలో చక్కెర కొరతా..? ధరలు పెరుగుతాయా..? క్లారిటీ ఇచ్చిన AISTA
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
ఇదిలావుండగా.. చట్టపరమైన ప్రక్రియ పూర్తైన తర్వాత, రిజర్వేషన్ ప్రయోజనాలను జమ్మూకశ్మీర్లోని ఆయా వర్గాల ప్రజలు పొందుతారు. అయితే.. పహారీలకు ఎస్టీ హోదా కార్యరూపం దాల్చాలంటే, కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్లో రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఒకవేళ అది మంజూరైతే మాత్రం, ఒక భాష మాట్లాడే సమూహానికి రిజర్వేషన్లు కల్పించడం.. దేశంలోనే మొదటిసారి అవుతుంది.
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!