Amit Shah: జమ్మూకశ్మీర్లో కీలక ప్రకటన.. ఆ వర్గానికి కోటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah Announced A Quota To Gujjar Bakarwal Pahari Communities In Jammu Kashmir: తన జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్లతో పాటు పహారీ సామాజిక వర్గానికీ ఎస్టీ హోదా కల్పించి.. త్వరలోనే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎస్టీ కోటాలో గుజ్జర్లు, బకర్వాల్లు, పహారీలకు ఎలాంటి తగ్గుదల ఉండదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ వాటాను పొందుతారని వెల్లడించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల.. జమ్మూకశ్మీర్లోని అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అందించేందుకు మార్గం సుగమం అయ్యిందన్నారు.
ఇదే సమయంలో అమిత్ షా జమ్మూకశ్మీర్లోని విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో జమ్మూకశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఇక్కడ కేవలం మూడు రాజకీయ కుటుంబాలే పాలించేవని మండిపడ్డారు. కానీ ఇప్పుడు పంచాయతీలు, కౌన్సిల్లకు.. న్యాయమైన ఎన్నికల ద్వారా ఎన్నికైన 30 వేల మంది వ్యక్తుల వద్ద అధికారం ఉందని చెప్పారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి ఇంతకుముందు కేంద్రం చాలా నిధులు ఇచ్చిందని, అయితే ఆ డబ్బంతా కొందరే దోచుకున్నారని ఆరోపణలు చేశారు. కానీ.. ఇప్పుడు కేవలం ప్రజల సంక్షేమం కోసం ఆ నిధులు ఖర్చు అవుతున్నాయన్నారు. ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టేందుకు ప్రధాని మోదీ పటిష్టమైన చర్యలు తీసుకున్నారని.. దాంతో భద్రతా సిబ్బంది మరణాల సంఖ్య చాలా తగ్గిందన్నారు. గతంలో ఏడాదికి 1200 మంది ప్రాణాలు కోల్పేతే.. ఇప్పుడా సంఖ్య 136కి తగ్గిందని పేర్కొన్నారు.
Also Read
- PM Narendra Modi: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు ప్రధాని మోడీ లేఖ, ఐదు సంకల్పాలకు పిలుపు
- Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ఇదిలావుండగా.. చట్టపరమైన ప్రక్రియ పూర్తైన తర్వాత, రిజర్వేషన్ ప్రయోజనాలను జమ్మూకశ్మీర్లోని ఆయా వర్గాల ప్రజలు పొందుతారు. అయితే.. పహారీలకు ఎస్టీ హోదా కార్యరూపం దాల్చాలంటే, కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్లో రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఒకవేళ అది మంజూరైతే మాత్రం, ఒక భాష మాట్లాడే సమూహానికి రిజర్వేషన్లు కల్పించడం.. దేశంలోనే మొదటిసారి అవుతుంది.
తాజావార్తలు
-
Akhil Akkineni : సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ షాకింగ్ కామెంట్స్
-
Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. మ్యాచ్ రద్దయినా చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారతీయ కెప్టెన్గా రికార్డ్..
-
Australian Cricketer: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆస్ట్రేలియా క్రికెటర్కు జీవితకాల జైలు శిక్ష!
-
PM Narendra Modi: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు ప్రధాని మోడీ లేఖ, ఐదు సంకల్పాలకు పిలుపు
-
AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!