Maldives Row: భారత్తో వివాదం నేపథ్యంలో చైనా, జిన్పింగ్పై మాల్దీవ్స్ అధ్యక్షుడి ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives Row: భారత్-మాల్దీవుల మధ్య వివాదం నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనా, ఆ దేశ అధ్యక్షుడు జి జిన్పింగ్పై ప్రశంసలు కురిపించాడు. చైనాతో తమ దేశ సంబంధాల గురించి గొప్పగా చెప్పారు. రెండు దేశాలు ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నాయని.. మాల్దీవ్స్ సార్వభౌమాధికారానికి పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. 1972లో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నప్పటి నుండి మాల్దీవుల అభివృద్ధికి చైనా సహాయం అందించిందని ప్రశంసలు కురిపించాడు.
గతేడాది నవంబర్లో అక్కడ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఇండియా వ్యతిరేక వైఖరి అవలంభించి ముయిజ్జూ గెలుపొందాడు. అప్పటి నుంచి భారత్కి వ్యతిరేకంగా, చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ఇండియా, మాల్దీవ్స్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆ దేశ మంత్రులు ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈ సమస్య మరింత పెద్దదిగా మారింది. భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ముగ్గురు మంత్రుల్ని మాల్దీవ్స్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Also Read
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
Read Also: Hanuman: ‘హనుమాన్ దెబ్బ’ కేజీఎఫ్, కాంతార రికార్డులు అబ్బా.. పుష్పతో సమానంగా కలెక్షన్స్
ఇదిలా ఉంటే ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన ముయిజ్జూ పలు ఒప్పందాలు చేసుకున్నాడు. మాల్దీవ్స్ తిరిగిరాగానే చైనాను పొగుడుతూ వ్యాఖ్యలు చేస్తున్నాడు. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వైపాక్షిక సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లిందని ఆయన అన్నారు. చైనా మాల్దీవ్స్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే దేశం కాదని.. అందుకే రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని చైనా ప్రభుత్వ మీడియా సీజీటీఎన్ ఛానెల్కి ఇచ్చి ఇంటర్వ్యూలో ముయిజ్జూ చెప్పాడు. భవిష్యత్తులో చైనా-మాల్దీవ్స్ బంధం మరింత దృఢమవుతుందని అన్నారు. జి జిన్పింగ్ పౌరుల ప్రయోజనాలకు మొదటిస్థానం ఇస్తున్నారని, ఆయన నాయకత్వంలో చైనా ఆర్థిక వ్యవస్థ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాల్దీవులు తన లక్ష్యాలను సాధించేందుకు చైనా ప్రభుత్వం సాయం చేస్తుందని, ఈమేరకు జిన్ పింగ్ హామీ ఇచ్చినట్లు ముయిజ్జు తెలిపారు.
మార్చి 15లోగా మాల్దీవుల్లో ఉన్న 88 మంది భారత సైనిక సిబ్బంది వెళ్లిపోవాలని మరోసారి ఆ దేశం చెప్పింది. శనివారం మీడియాతో మాట్లాడుతూ, పరోక్షంగా భారత్ ని ఉద్దేశించి ముయిజ్జూ విమర్శలు చేశారు. మేము చిన్నవాళ్లం కావచ్చు, కానీ మమ్మల్ని బెదిరించే లైసెన్స్ మీకు ఇవ్వలేదని అన్నారు. ఆహార వస్తువులు, ఔషధాలు, ఇతర దిగుమతులపై భారత్పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ముయిజ్జూ కొత్త ప్రణాళికను ప్రకటించారు.
తాజావార్తలు
-
Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్బై.. సీఎస్కే భవిష్యత్పై బెంగ!
-
Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
ట్రెండింగ్
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!