Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ పోటీపై కొనసాగుతోన్న సందిగ్ధత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలకు మరికొన్ని రోజులు మిగిలి ఉండగా.. రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య ఎన్నికలు జరుగుతాయని పార్టీ ప్రకటించింది, అయితే అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ రాహుల్ గాంధీ ఇప్పటి వరకు వైఖరిని క్లియర్ చేయలేదు.కాంగ్రెస్ వ్యూహకర్తలు ఇప్పటివరకు రాహుల్ గాంధీని అధ్యక్ష పదవికి పోటీ చేసేలా ఒప్పించడంలో విఫలమయ్యారు. దీనివల్ల కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. రాహుల్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఎలాంటి స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. రాహుల్ గాంధీ నుండి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో ఎన్నికల తేదీని లాక్ చేయాల్సిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించకపోవడం గమనార్హం.
సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఆఫ్ కాంగ్రెస్ ప్రకారం.. పార్టీ ఎన్నికలకు సన్నాహాలు పూర్తిచేసింది. మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలోని అథారిటీ ఎన్నికలకు సకాలంలో సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పుడు ఎన్నికల తేదీలను ప్రకటించడానికి బంతి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కోర్టులో ఉంది.రాష్ట్రాలలో ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కానప్పటికీ, తాము షెడ్యూల్కు కట్టుబడి ఉంటామని.. ఎన్నికల షెడ్యూల్ కోసం సీడబ్ల్యూసీ తుది పిలుపునిస్తుందని మధుసూదన్ మిస్త్రీ అన్నారు. అన్ని రాష్ట్రాల నుండి 9,000 మందికి పైగా ప్రతినిధులు ఎన్నికల్లో పాల్గొంటారన్నారు.
Also Read
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
- DMK: స్టాలిన్కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్బై
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
Rajasthan: దళిత బాలుడి హత్య.. రాజస్థాన్లో రాజకీయ ప్రకంపనలు
పార్టీ ప్రకటించిన ప్రకారం.. ఆగస్టు 21న కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. సెప్టెంబర్ 20లోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. రాష్ట్రాల అధ్యక్షులను కూడా ఆగస్టు 20 నాటికి ఎన్నుకోవాలి. ఇప్పటివరకు ఈ ప్రక్రియ ఏ రాష్ట్రంలోనూ పూర్తి కాలేదు. రాహుల్ గాంధీ వైఖరిపై స్పష్టత లేకపోవడంతో నాయకత్వం అయోమయంలో పడిందని, ఎన్నికల నాటికి ఇది పూర్తవుతుందా లేదా అనే సందేహంలో పార్టీ ఉన్నట్లు సమాచారం.సెప్టెంబరు 7న కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించనుండగా, యాత్ర సుదీర్ఘంగా సాగుతుందని, అప్పటికి ఎన్నికలు నిర్వహించకుంటే మరింత జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ అంతర్గత ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాహుల్ గాంధీ నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ఇష్టపడని పక్షంలో అశోక్ గెహ్లాట్, మల్లికార్జున్ ఖర్గే, ముకుల్ వాస్నిక్, కుమారి శైలజా, కేసీ వేణుగోపాల్ వంటి పేర్లను పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే ఇలా జరిగేందుకు చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయి. ఒకవేళ రాహుల్ అంగీకరించకపోతే సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
-
CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
ట్రెండింగ్
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!