Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ పోటీపై కొనసాగుతోన్న సందిగ్ధత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలకు మరికొన్ని రోజులు మిగిలి ఉండగా.. రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య ఎన్నికలు జరుగుతాయని పార్టీ ప్రకటించింది, అయితే అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ రాహుల్ గాంధీ ఇప్పటి వరకు వైఖరిని క్లియర్ చేయలేదు.కాంగ్రెస్ వ్యూహకర్తలు ఇప్పటివరకు రాహుల్ గాంధీని అధ్యక్ష పదవికి పోటీ చేసేలా ఒప్పించడంలో విఫలమయ్యారు. దీనివల్ల కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. రాహుల్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఎలాంటి స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. రాహుల్ గాంధీ నుండి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో ఎన్నికల తేదీని లాక్ చేయాల్సిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించకపోవడం గమనార్హం.
సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఆఫ్ కాంగ్రెస్ ప్రకారం.. పార్టీ ఎన్నికలకు సన్నాహాలు పూర్తిచేసింది. మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలోని అథారిటీ ఎన్నికలకు సకాలంలో సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పుడు ఎన్నికల తేదీలను ప్రకటించడానికి బంతి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కోర్టులో ఉంది.రాష్ట్రాలలో ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కానప్పటికీ, తాము షెడ్యూల్కు కట్టుబడి ఉంటామని.. ఎన్నికల షెడ్యూల్ కోసం సీడబ్ల్యూసీ తుది పిలుపునిస్తుందని మధుసూదన్ మిస్త్రీ అన్నారు. అన్ని రాష్ట్రాల నుండి 9,000 మందికి పైగా ప్రతినిధులు ఎన్నికల్లో పాల్గొంటారన్నారు.
Also Read
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
Rajasthan: దళిత బాలుడి హత్య.. రాజస్థాన్లో రాజకీయ ప్రకంపనలు
పార్టీ ప్రకటించిన ప్రకారం.. ఆగస్టు 21న కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. సెప్టెంబర్ 20లోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. రాష్ట్రాల అధ్యక్షులను కూడా ఆగస్టు 20 నాటికి ఎన్నుకోవాలి. ఇప్పటివరకు ఈ ప్రక్రియ ఏ రాష్ట్రంలోనూ పూర్తి కాలేదు. రాహుల్ గాంధీ వైఖరిపై స్పష్టత లేకపోవడంతో నాయకత్వం అయోమయంలో పడిందని, ఎన్నికల నాటికి ఇది పూర్తవుతుందా లేదా అనే సందేహంలో పార్టీ ఉన్నట్లు సమాచారం.సెప్టెంబరు 7న కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించనుండగా, యాత్ర సుదీర్ఘంగా సాగుతుందని, అప్పటికి ఎన్నికలు నిర్వహించకుంటే మరింత జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ అంతర్గత ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాహుల్ గాంధీ నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ఇష్టపడని పక్షంలో అశోక్ గెహ్లాట్, మల్లికార్జున్ ఖర్గే, ముకుల్ వాస్నిక్, కుమారి శైలజా, కేసీ వేణుగోపాల్ వంటి పేర్లను పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే ఇలా జరిగేందుకు చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయి. ఒకవేళ రాహుల్ అంగీకరించకపోతే సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
-
GT Biggest Win: ఎస్ఆర్హెచ్పై గుజరాత్ చరిత్రాత్మక విజయం.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ విక్టరీ!
-
Avatar 3: ఫైనల్గా OTTలోకి ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ramani Kalyanam : వీల్చైర్లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
-
Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!