Rajasthan: దళిత బాలుడి హత్య.. రాజస్థాన్లో రాజకీయ ప్రకంపనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: తాగునీటి కుండను తాకినందుకు టీచర్ తీవ్రంగా కొట్టడం వల్ల ఓ దళిత బాలుడు మృతి చెందిన ఘటన రాజస్థాన్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. రాజస్థాన్లోని బరన్ మునిసిపల్ కౌన్సిల్లోని 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు మంగళవారం తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు పంపారు. దళితులపై దౌర్జన్యాలపై వేదన వ్యక్తం చేస్తూ పార్టీ ఎమ్మెల్యే పనా చంద్ మేఘ్వాల్కు మద్దతు ఇచ్చారు. జలోర్లో తాగునీటి కుండను తాకినందుకు ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టడం వల్ల తొమ్మిదేళ్ల దళిత బాలుడు మృతి చెందిన రెండు రోజుల తర్వాత బరన్-అత్రు ఎమ్మెల్యే సోమవారం తన రాజీనామా లేఖను గెహ్లాట్కు పంపారు. ఇదిలా ఉండగా, జలోర్లోని సురానా గ్రామంలో బాలుడి ఇంటికి రాజకీయ నేతలు దారులు కట్టారు.
కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మంగళవారం బాలుడి ఇంటికి చేరుకుని దళితుల విశ్వాసాన్ని గెలుచుకోవడానికి బలమైన సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోస్తారా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మమతా భూపేష్, పీడబ్ల్యూడీ మంత్రి భజన్ లాల్ జాతవ్, విపత్తు నిర్వహణ సహాయ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్తో కలిసి బాలుడి ఇంటికి వెళ్లారు.ఆయన కుటుంబానికి పార్టీ ఫండ్ నుండి ₹ 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. త్వరిత విచారణకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మేఘ్వాల్ చర్యకు మద్దతుగా బరన్ మునిసిపల్ కౌన్సిల్లోని 25 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లలో 12 మంది దళితులు, అణగారిన వర్గాలపై దౌర్జన్యాలపై వేదన వ్యక్తం చేశారు. దళితులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేకు మద్దతుగా రాజీనామా లేఖలు పంపామని కౌన్సిలర్ యోగేంద్ర మెహతా వెల్లడించారు. రోహితాశ్వ సక్సేనా, రాజారాం మీనా, రేఖా మీనా, లీలాధర్ నగర్, హరిరాజ్ ఎర్వాల్, పీయూష్ సోనీ, ఊర్వశి మేఘవాల్, యశ్వంత్ యాదవ్, అన్వర్ అలీ, జ్యోతి జాతవ్, మయాంక్ మథోడియా తమ రాజీనామా లేఖలను పంపినట్లు ఆయన తెలిపారు. వారు తమ రాజీనామా లేఖల కాపీలను బుధవారం కోట డివిజనల్ కమిషనర్కు సమర్పిస్తారని మెహతా తెలిపారు.ఇదిలావుండగా, కోటాలో ఇటావా మున్సిపల్ కౌన్సిల్కు చెందిన నామినేటెడ్ కౌన్సిలర్ సురేష్ మహావార్ కూడా తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
Super Vasuki Train: ఆరు ఇంజిన్లు.. 295 బోగీలు.. దేశంలో అతి పెద్ద పొడవైన రైలు ఇదే..!!
మరోవైపు ఈ దారుణోదంతంపై రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) మంగళవారం తాఖీదు జారీ చేసింది. బాలుడి మరణానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి చోటుచేసుకుందో తమకు ఏడు రోజుల్లోగా తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు- బాలుడి మృతి రాజకీయంగానూ కలకలం రేపుతోంది. ఉపాధ్యాయుడు కొట్టిన అనంతరం ఈ నెల 13న బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు స్పందించారు. ఆ బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలను ఆదేశించారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!