Rajasthan: దళిత బాలుడి హత్య.. రాజస్థాన్లో రాజకీయ ప్రకంపనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: తాగునీటి కుండను తాకినందుకు టీచర్ తీవ్రంగా కొట్టడం వల్ల ఓ దళిత బాలుడు మృతి చెందిన ఘటన రాజస్థాన్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. రాజస్థాన్లోని బరన్ మునిసిపల్ కౌన్సిల్లోని 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు మంగళవారం తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు పంపారు. దళితులపై దౌర్జన్యాలపై వేదన వ్యక్తం చేస్తూ పార్టీ ఎమ్మెల్యే పనా చంద్ మేఘ్వాల్కు మద్దతు ఇచ్చారు. జలోర్లో తాగునీటి కుండను తాకినందుకు ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టడం వల్ల తొమ్మిదేళ్ల దళిత బాలుడు మృతి చెందిన రెండు రోజుల తర్వాత బరన్-అత్రు ఎమ్మెల్యే సోమవారం తన రాజీనామా లేఖను గెహ్లాట్కు పంపారు. ఇదిలా ఉండగా, జలోర్లోని సురానా గ్రామంలో బాలుడి ఇంటికి రాజకీయ నేతలు దారులు కట్టారు.
కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మంగళవారం బాలుడి ఇంటికి చేరుకుని దళితుల విశ్వాసాన్ని గెలుచుకోవడానికి బలమైన సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోస్తారా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మమతా భూపేష్, పీడబ్ల్యూడీ మంత్రి భజన్ లాల్ జాతవ్, విపత్తు నిర్వహణ సహాయ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్తో కలిసి బాలుడి ఇంటికి వెళ్లారు.ఆయన కుటుంబానికి పార్టీ ఫండ్ నుండి ₹ 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. త్వరిత విచారణకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మేఘ్వాల్ చర్యకు మద్దతుగా బరన్ మునిసిపల్ కౌన్సిల్లోని 25 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లలో 12 మంది దళితులు, అణగారిన వర్గాలపై దౌర్జన్యాలపై వేదన వ్యక్తం చేశారు. దళితులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేకు మద్దతుగా రాజీనామా లేఖలు పంపామని కౌన్సిలర్ యోగేంద్ర మెహతా వెల్లడించారు. రోహితాశ్వ సక్సేనా, రాజారాం మీనా, రేఖా మీనా, లీలాధర్ నగర్, హరిరాజ్ ఎర్వాల్, పీయూష్ సోనీ, ఊర్వశి మేఘవాల్, యశ్వంత్ యాదవ్, అన్వర్ అలీ, జ్యోతి జాతవ్, మయాంక్ మథోడియా తమ రాజీనామా లేఖలను పంపినట్లు ఆయన తెలిపారు. వారు తమ రాజీనామా లేఖల కాపీలను బుధవారం కోట డివిజనల్ కమిషనర్కు సమర్పిస్తారని మెహతా తెలిపారు.ఇదిలావుండగా, కోటాలో ఇటావా మున్సిపల్ కౌన్సిల్కు చెందిన నామినేటెడ్ కౌన్సిలర్ సురేష్ మహావార్ కూడా తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు.
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
Super Vasuki Train: ఆరు ఇంజిన్లు.. 295 బోగీలు.. దేశంలో అతి పెద్ద పొడవైన రైలు ఇదే..!!
మరోవైపు ఈ దారుణోదంతంపై రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) మంగళవారం తాఖీదు జారీ చేసింది. బాలుడి మరణానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి చోటుచేసుకుందో తమకు ఏడు రోజుల్లోగా తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు- బాలుడి మృతి రాజకీయంగానూ కలకలం రేపుతోంది. ఉపాధ్యాయుడు కొట్టిన అనంతరం ఈ నెల 13న బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు స్పందించారు. ఆ బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలను ఆదేశించారు.
తాజావార్తలు
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
Telegram, Signal: వాట్సాప్ యూజర్నేమ్ వివాదం.. టెలిగ్రామ్, సిగ్నల్కు కేంద్రం నోటీసులు.. కారణమేంటి?
-
T20 World Cup 2026: సెమీస్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఢీ!
-
Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!