Rajasthan: దళిత బాలుడి హత్య.. రాజస్థాన్లో రాజకీయ ప్రకంపనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: తాగునీటి కుండను తాకినందుకు టీచర్ తీవ్రంగా కొట్టడం వల్ల ఓ దళిత బాలుడు మృతి చెందిన ఘటన రాజస్థాన్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. రాజస్థాన్లోని బరన్ మునిసిపల్ కౌన్సిల్లోని 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు మంగళవారం తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు పంపారు. దళితులపై దౌర్జన్యాలపై వేదన వ్యక్తం చేస్తూ పార్టీ ఎమ్మెల్యే పనా చంద్ మేఘ్వాల్కు మద్దతు ఇచ్చారు. జలోర్లో తాగునీటి కుండను తాకినందుకు ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టడం వల్ల తొమ్మిదేళ్ల దళిత బాలుడు మృతి చెందిన రెండు రోజుల తర్వాత బరన్-అత్రు ఎమ్మెల్యే సోమవారం తన రాజీనామా లేఖను గెహ్లాట్కు పంపారు. ఇదిలా ఉండగా, జలోర్లోని సురానా గ్రామంలో బాలుడి ఇంటికి రాజకీయ నేతలు దారులు కట్టారు.
కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మంగళవారం బాలుడి ఇంటికి చేరుకుని దళితుల విశ్వాసాన్ని గెలుచుకోవడానికి బలమైన సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోస్తారా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మమతా భూపేష్, పీడబ్ల్యూడీ మంత్రి భజన్ లాల్ జాతవ్, విపత్తు నిర్వహణ సహాయ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్తో కలిసి బాలుడి ఇంటికి వెళ్లారు.ఆయన కుటుంబానికి పార్టీ ఫండ్ నుండి ₹ 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. త్వరిత విచారణకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మేఘ్వాల్ చర్యకు మద్దతుగా బరన్ మునిసిపల్ కౌన్సిల్లోని 25 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లలో 12 మంది దళితులు, అణగారిన వర్గాలపై దౌర్జన్యాలపై వేదన వ్యక్తం చేశారు. దళితులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేకు మద్దతుగా రాజీనామా లేఖలు పంపామని కౌన్సిలర్ యోగేంద్ర మెహతా వెల్లడించారు. రోహితాశ్వ సక్సేనా, రాజారాం మీనా, రేఖా మీనా, లీలాధర్ నగర్, హరిరాజ్ ఎర్వాల్, పీయూష్ సోనీ, ఊర్వశి మేఘవాల్, యశ్వంత్ యాదవ్, అన్వర్ అలీ, జ్యోతి జాతవ్, మయాంక్ మథోడియా తమ రాజీనామా లేఖలను పంపినట్లు ఆయన తెలిపారు. వారు తమ రాజీనామా లేఖల కాపీలను బుధవారం కోట డివిజనల్ కమిషనర్కు సమర్పిస్తారని మెహతా తెలిపారు.ఇదిలావుండగా, కోటాలో ఇటావా మున్సిపల్ కౌన్సిల్కు చెందిన నామినేటెడ్ కౌన్సిలర్ సురేష్ మహావార్ కూడా తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
Super Vasuki Train: ఆరు ఇంజిన్లు.. 295 బోగీలు.. దేశంలో అతి పెద్ద పొడవైన రైలు ఇదే..!!
మరోవైపు ఈ దారుణోదంతంపై రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) మంగళవారం తాఖీదు జారీ చేసింది. బాలుడి మరణానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి చోటుచేసుకుందో తమకు ఏడు రోజుల్లోగా తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు- బాలుడి మృతి రాజకీయంగానూ కలకలం రేపుతోంది. ఉపాధ్యాయుడు కొట్టిన అనంతరం ఈ నెల 13న బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు స్పందించారు. ఆ బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలను ఆదేశించారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!