Rajasthan: దళిత బాలుడి హత్య.. రాజస్థాన్లో రాజకీయ ప్రకంపనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: తాగునీటి కుండను తాకినందుకు టీచర్ తీవ్రంగా కొట్టడం వల్ల ఓ దళిత బాలుడు మృతి చెందిన ఘటన రాజస్థాన్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. రాజస్థాన్లోని బరన్ మునిసిపల్ కౌన్సిల్లోని 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు మంగళవారం తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు పంపారు. దళితులపై దౌర్జన్యాలపై వేదన వ్యక్తం చేస్తూ పార్టీ ఎమ్మెల్యే పనా చంద్ మేఘ్వాల్కు మద్దతు ఇచ్చారు. జలోర్లో తాగునీటి కుండను తాకినందుకు ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టడం వల్ల తొమ్మిదేళ్ల దళిత బాలుడు మృతి చెందిన రెండు రోజుల తర్వాత బరన్-అత్రు ఎమ్మెల్యే సోమవారం తన రాజీనామా లేఖను గెహ్లాట్కు పంపారు. ఇదిలా ఉండగా, జలోర్లోని సురానా గ్రామంలో బాలుడి ఇంటికి రాజకీయ నేతలు దారులు కట్టారు.
కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మంగళవారం బాలుడి ఇంటికి చేరుకుని దళితుల విశ్వాసాన్ని గెలుచుకోవడానికి బలమైన సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోస్తారా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మమతా భూపేష్, పీడబ్ల్యూడీ మంత్రి భజన్ లాల్ జాతవ్, విపత్తు నిర్వహణ సహాయ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్తో కలిసి బాలుడి ఇంటికి వెళ్లారు.ఆయన కుటుంబానికి పార్టీ ఫండ్ నుండి ₹ 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. త్వరిత విచారణకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మేఘ్వాల్ చర్యకు మద్దతుగా బరన్ మునిసిపల్ కౌన్సిల్లోని 25 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లలో 12 మంది దళితులు, అణగారిన వర్గాలపై దౌర్జన్యాలపై వేదన వ్యక్తం చేశారు. దళితులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేకు మద్దతుగా రాజీనామా లేఖలు పంపామని కౌన్సిలర్ యోగేంద్ర మెహతా వెల్లడించారు. రోహితాశ్వ సక్సేనా, రాజారాం మీనా, రేఖా మీనా, లీలాధర్ నగర్, హరిరాజ్ ఎర్వాల్, పీయూష్ సోనీ, ఊర్వశి మేఘవాల్, యశ్వంత్ యాదవ్, అన్వర్ అలీ, జ్యోతి జాతవ్, మయాంక్ మథోడియా తమ రాజీనామా లేఖలను పంపినట్లు ఆయన తెలిపారు. వారు తమ రాజీనామా లేఖల కాపీలను బుధవారం కోట డివిజనల్ కమిషనర్కు సమర్పిస్తారని మెహతా తెలిపారు.ఇదిలావుండగా, కోటాలో ఇటావా మున్సిపల్ కౌన్సిల్కు చెందిన నామినేటెడ్ కౌన్సిలర్ సురేష్ మహావార్ కూడా తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు.
Also Read
- Rahul Gandhi on NEET Paper Leak: "యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే".. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
Super Vasuki Train: ఆరు ఇంజిన్లు.. 295 బోగీలు.. దేశంలో అతి పెద్ద పొడవైన రైలు ఇదే..!!
మరోవైపు ఈ దారుణోదంతంపై రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) మంగళవారం తాఖీదు జారీ చేసింది. బాలుడి మరణానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి చోటుచేసుకుందో తమకు ఏడు రోజుల్లోగా తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు- బాలుడి మృతి రాజకీయంగానూ కలకలం రేపుతోంది. ఉపాధ్యాయుడు కొట్టిన అనంతరం ఈ నెల 13న బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు స్పందించారు. ఆ బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలను ఆదేశించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!