Amaranath Yatra: అమర్నాథ్ మార్గంలో భారీ వర్షం.. యాత్రకు మళ్లీ బ్రేక్
Amaranath Yatra: పవిత్ర పుణ్యక్షేత్రమైన అమర్నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. కశ్మీర్ లోయలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణం కారణంగా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అమర్నాథ్ పవిత్ర గుహ పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదలు ముంచెత్తుతున్నాయి. పర్వత ప్రాంతం నుంచి వరదలు వస్తుండడంతో భక్తులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. 4 వేల మంది యాత్రికులను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. మూడుగంటల పాటు ఏకధాటిగా వర్షం కురియడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గుహ చుట్టుపక్కల ఉన్న పర్వతాలలో భారీ వర్షాల కారణంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రిజర్వాయర్లు, సమీపంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అధికారులు వెంటనే అలర్ట్ ప్రకటించారు. ఇప్పటివరకు 4,000 మందికి పైగా యాత్రికులను సురక్షిత ప్రాంతానికి తరలించామని.. పరిస్థితి అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు.
Praja Sangrama Yatra: మూడో విడతకు ముహూర్తం.. మునుపటి కంటే భారీగా..
Also Read
జులై 8న క్లౌడ్ బరస్ట్ కారణంగా అమరనాథ్ గుహకు సమీపంలో సంభవించిన వరదల కారణంగా 15 మంది మృతి చెందగా.. 40 మందికి పైగా గల్లంతయ్యారు. గుహ సమీపంలో అనేక గుడారాలు గల్లంతయ్యాయి. భద్రతా దళాలకు చెందిన విపత్తు నిర్వహణా సంస్థలు వెంటనే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించాయి. అప్పుడు కూడా అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. మళ్లీ జులై 16న యాత్రను తిరిగి ప్రారంభించారు. 43 రోజుల పాటు సాగే వార్షిక అమర్నాథ్ యాత్ర జూన్ 30న రెండు ప్రధాన మార్గాల్లో ప్రారంభమైంది. ఆగస్టు 11న రక్షా బంధన్ సందర్భంగా అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. ఇప్పటివరకు దాదాపు 2లక్షల 30 వేల మంది యాత్రికులు మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో