Kerala: ఆపరేషన్ థియేటర్ లో లాంగ్ స్లీవ్ స్క్రబ్ జాకెట్లు ధరించేందుకు అనుమతివ్వండి – ముస్లిం వైద్య విద్యార్థినుల విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala:| ఆపరేషన్ థియేటర్ లోకి హిజాబ్ ధరించి వెళ్లడానికి అనుమతి లేకపోవడంతో తమకు వేరే వాటిని ధరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముస్లిం వర్గానికి చెందిన మహిళా వైద్య విద్యార్థినులు కోరారు. హిజాబ్కు బదులుగా లాంగ్ స్లీవ్ స్ర్కబ్ జాకెట్లు, సర్జికల్హుడ్స్ ధరించడానికి అనుమతి ఇవ్వాలని విద్యార్థినులు తిరువనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్కు లేఖ రాశారు.
Reas akso: Lust stories 2 : లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్నా..
Also Read
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
- Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
- Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
2018, 2021, 2022 ఎంబీబీఎస్ బ్యాచ్ లకు చెందిన ఆరుగురు విద్యార్థులు సంతకాలు చేసిన లేఖను జూన్ 26న ప్రిన్సిపాల్కు అందజేశారు. ఆపరేషన్ రూమ్ లోపల హిజాబ్ ధరించలేమని కాబట్టి లాంగ్ స్లీవ్ స్క్రబ్ జాకెట్లు, సర్జికల్ హుడ్స్ ధరించడానికి అనుమతి ఇవ్వాలని కేరళలోని తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివే ముస్లిం విద్యార్థినులు ప్రిన్సిపాల్ ను కోరారు. ముస్లిం మహిళలు ఏ పరిస్థితుల్లోనూ హిజాబ్ ధరించడం తప్పనిసరి అని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. అయితే ఆపరేషన్ థియేటర్ లోపల తల కప్పుకుని వెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు.
హిజాబ్ ధరించిన మహిళలు హాస్పిటల్, ఆపరేషన్ గది నిబంధనలను పాటించేటప్పుడు, మతపరమైన దుస్తులు ధరించడం, నియమాన్ని కాపాడుకోవడం మధ్య సమతుల్యతను కాపాడటం చాలా కష్టమని లేఖలో పేర్కొన్నారు.
Reas akso: DK Shivakumar: “సిద్ధరామయ్య భయపడ్డారు..అదే నేనైతే”.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు..
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లినెట్ జె మోరిస్ ఈ లేఖను అందుకున్న విషయాన్ని ధృవీకరించారు. విద్యార్థుల నుంచి అలాంటి డిమాండ్ ఉందని, ఈ విషయాన్ని చర్చించవచ్చని వారికి తెలియజేశామని ‘ఏషియానెట్ న్యూస్ ఆన్ లైన్’ తో చెప్పారు. అయితే ఆపరేషన్ రూమ్ లో ఫుల్ హ్యాండ్ గౌన్ ధరించడం సవాలుతో కూడుకున్నదని పేర్కొంటూ ప్రిన్సిపాల్ విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ‘రోగులను చూసుకునేటప్పుడు తరచూ చేతులు శుభ్రంగా ఉండాలి. లేదంటే అంటువ్యాధులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది’ అని ప్రిన్సిపాల్ తెలిపారు. ఆపరేషన్ గదిలో ఏమి చేయాలో ప్రతి ఒక్కరికీ తెలుసునని.. శస్త్రచికిత్స గదుల్లో మోచేయి నుండి కిందకి తరచుగా చేతులు కడుక్కోవడం సాధారణమని ప్రిన్సిపాల్ మోరిస్ తెలిపారు. ఇదే ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేసినట్టు చెప్పారు. పరిశుభ్రమైన వాతావరణాన్ని కలిగి ఉండేందుకు సార్వత్రిక ప్రమాణాలను అనుసరిస్తామని స్పష్టం చేశారు. అయితే లేఖ ఆధారంగా విద్యార్థుల అభ్యర్థనలను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
తాజావార్తలు
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
-
Kia Syros Flex Fuel: 100% ఇథనాల్తోనూ నడుస్తుంది.. కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వచ్చేసింది..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!