Allahabad High Court: మొదటి భార్యను చూసుకోలేని ముస్లిం వ్యక్తికి రెండో పెళ్లి చేసుకునే హక్కు లేదు.
Allahabad High Court verdict on second marriage of Muslim man: ముస్లిం వ్యక్తి రెండో వివాహంపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మొదటి భార్య, ఆమె సంతానాన్ని చూసుకోలేని ముస్లిం వ్యక్తికి రెండో పెళ్లి చేసుకునే హక్కు లేదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఒక ముస్లిం వ్యక్తి తన భార్య, పిల్లలను చూసుకోకపోతే, ఖురాన్ అతన్ని రెండవ వివాహం చేసుకోవడానికి అనుమతించదని తీర్పు వెల్లడించింది. మొదటి భార్య అనుమతి లేకుండా రెండో వివాహాం చేసుకున్న వ్యక్తి మొదటి భార్యను శిక్షించడమే అవుతుందని అంది. న్యాయమూర్తులు సూర్య ప్రకాష్ కేసర్వాణి, రాజేంద్ర కుమార్ లో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక ముస్లిం వ్యక్తి తన భార్య, పిల్లలను పోషించే సామర్థ్యం లేకుంటే.. పవిత్ర ఖురాన్ పేర్కొన్న ఆదేశాల మేరకు మరో స్త్రీని వివాహం చేసుకోలేదని పేర్కొంది.
Read Also: Komatireddy Rajgopal Reddy : దేశంలోనే ఇది అతిపెద్ద కుంభకోణం ధరణి
Also Read
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
- Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే.. అజీజ్ ఉర్ రెహ్మన్, హమీదున్నీషా మే 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. అయితే మొదటి భార్యకు తెలియకుండా అజీజ్ ఉర్ రెహ్మన్ మరో వివాహం చేసుకున్నాడు. రెండోభార్యకు కూడా పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని మొదటి భార్య హమీదున్నీషాకు తెలియకుండా దాచిపెట్టాడు. దీంతో హమీదున్నీషా తన భర్త దగ్గర నుంచి విడిపోయి పుట్టింటికి చేరింది. 2015లో అజీజ్ ఉర్ రెహ్మన్ ఉత్తర్ ప్రదేశ్ లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన మొదటి భార్య తనతో కలిసి ఉండేలా ఆదేశించాలని కోరాడు. ఫ్యామిలీ హైకోర్టు ఈ కేసును తిరస్కరించడంతో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసులో ఖురాన్ లోని సురా 4 అయత్ 3ని ప్రస్తావించింది అలహాబాద్ హైకోర్టు. మొదటి భార్య ఉండగానే ముస్లిం వ్యక్తి రెండో పెళ్లి చేసుకునేందుకు చట్టబద్ధమైన హక్కు కలిగి ఉన్నాడని వివరించింది. అయితే.. అతను మొదటి భార్యను తనతో జీవించమని బలవంతం చేయమని కోరడం అన్యాయం, అసమానతకు దారి తీస్తుందని కోర్టు పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతీ భారతీయుడు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని.. ఆర్టికల్ 14 అందరికీ సమానత్వపు హక్కును కల్పిస్తుందని.. ఆర్టిక్ 15(2) ప్రకారం వ్యక్తిగత చట్టాల పేరుతో పౌరులు రాజ్యాంగ హక్కులను దూరం చేయడం కుదరదని స్పష్టం చేసింది. గౌరవప్రదంగా జీవించే హక్కు జీవించే హక్కుల్లో భాగం అని.. మహిళను గౌరవించలేదని సమాజాన్ని నాగరికత అనలేమని కోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
Ravibabu : డబ్బు, టైం ఉంటే ఏ వెధవైనా సినిమా అద్భుతంగా చేస్తాడు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
-
Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
-
Faria Abdullah: అమ్మ హిందూ.. నాన్న ముస్లిం.. కానీ అసలైన ట్విస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో