Tamil Nadu: తమిళనాడును కుదిపోస్తున్న లాకప్ డెత్.. స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్
- తమిళనాడును కుదిపోస్తున్న లాకప్ డెత్
- స్టాలిన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్
తమిళనాడులో జరిగిన లాకప్ డెత్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. పోలీస్ కస్టడీలో ఆలయ గార్డు అజిత్ కుమార్ మరణించిడంపై పొలిటికల్గా తీవ్ర దుమారం రేపుతోంది. డీఎంకే పాలనలో లాకప్ డెత్లకు రాష్ట్రం మాతృభూమిగా మారిందంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: Pashamilaram-Incident : రెండు నెలల కిందే పెళ్లి.. సిగాచి మృతుల్లో నవదంపతులు..
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
గత వారం మాదపురం కాళీఅమ్మన్ ఆలయానికి మహిళ కారులో వచ్చింది. అక్కడే పని చేస్తున్న ఆలయ గార్డు అజిత్ కుమార్కు తాళాలు ఇచ్చి పార్కు చేయమని చెప్పింది. అయితే అతడికి కారు నడపడం చేతకాకపోవడంతో మరొకరి సహాయం తీసుకున్నాడు. అయితే దర్శనం అనంతరం కారు తీసుకెళ్తుండగా కారులో 80 గ్రాముల బంగార ఆభరణాలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జూన్ 27న అజిత్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీస్ విచారణలో అజిత్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరు అయింది. పోలీసులు కొట్టడం వల్లే అజిత్ ప్రాణాలు పోయాయంటూ ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. డీఎంకే ప్రభుత్వంపై అన్నాడీఎంకే, బీజేపీ విమర్శలు గుప్పించింది. మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Telangana BJP : టీబీజేపీ అధ్యక్షుడిగా రామచందర్రావు.. అధికారికంగా ప్రకటన
పోలీసుల వివరాల ప్రకారం.. అజిత్ కుమార్ దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లు వెల్లడించారు. అయితే ఆభరణాలు దాచి పెట్టిన చోటికి తీసుకెళ్లినప్పుడు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా మూర్ఛ వ్యాధితో మరణించినట్లు చెప్పుకొచ్చారు. విచారణలో అనేక పేర్లు చెప్పాడని.. చివరికి అతడే నేరాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటన రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. హైకోర్టు కూడా విచారణ చేపట్టింది. అన్నాడీఎంకే నేతృత్వంలోని ప్రతిపక్షాలు న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. పోలీసు సిబ్బందిని అరెస్టు చేయాలని కోరాయి. అలాగే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. డీఎంకే పాలనలో 24 కస్టోడియల్ మరణాలు జరిగాయని తమిళనాడు బీజేపీ ఆరోపించింది. ఇక సోమవారం మద్రాస్ హైకోర్టు ఈ విషయాన్ని స్వయంగా విచారణకు స్వీకరించింది. అజిత్ ఏమైనా ఉగ్రవాదా? అని నిలదీసింది. అతనిపై ఎందుకు దాడి జరిగిందని ప్రశ్నించింది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?