Akhilesh Yadav: రాహుల్కి అఖిలేష్ కండీషన్.. దేనికి సంకేతం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీ (Rahul Gandhis Yatra) చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో కొనసాగుతోంది. ఈనెల 16న వారణాసిలో యాత్ర ప్రవేశించింది. ఈనెల 21 వరకు రాహుల్ యాత్ర యూపీలో కొనసాగుతుంది. ఈరోజు అమేథీ నియోజకవర్గంలోకి రాహుల్ యాత్ర ప్రవేశించనుంది.
ఇదిలా ఉంటే సమాజ్వాదీ పార్టీ.. ఇండియా కూటమిలో మిత్రపక్షం. ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఇండియా కూటమి సమావేశాల్లో అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం రాహుల్ యాత్ర యూపీలో కొనసాగుతున్నా.. అఖిలేష్ మాత్రం ఎక్కడా పాల్గొనలేదు. దీంతో కూటమిలో ఏదో జరుగుతుందన్న లుకలుకలు వినపడుతున్నాయి. ఇప్పటికే జేడీయూ అధ్యక్షుడు నితీష్కుమార్ ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లిపోయారు. అఖిలేష్పై కూడా అలాంటి అనుమానాలే రేకెత్తుతున్నాయి. ఈ అంశంపై తాజాగా అఖిలేష్ క్లారిటీ ఇచ్చారు.
Also Read
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
ప్రస్తుతం సీట్ల పంపకాలపై కాంగ్రెస్తో సమాజ్వాదీ పార్టీ చర్చలు జరుగుతున్నాయని.. సీట్ల పంపకాలు పూర్తయ్యాక భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని తేల్చిచెప్పారు. సీట్ల పంచాయితీ తేలాకే రాహుల్ను కలుస్తానని అఖిలేష్ కుండబద్దలు కొట్టినట్టు (Condition) చెప్పారు. మరో రెండు రోజుల్లో రాహుల్ యాత్ర యూపీలో ముగుస్తోంది. ఈనెల 22 నుంచి రాష్ట్రంలో పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో యాత్రను కుదించి ఈనెల 21కి ముగించాలని రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండ్రోజుల్లోనైనా అఖిలేష్ పాల్గొంటారా? లేదంటే డుమ్మా కొడతారా? అన్నది వేచి చూడాలి.
మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పడిన ఇండియా కూటమి ఇప్పుడు ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఎవరికీ వారే చర్చలు లేకుండా సీట్లు ప్రకటించేసుకుంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్, ఆప్, సమాజ్వాదీ పార్టీలు ఇప్పటికే ఒంటరి పోరుకే సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో కూటమిలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు తలెత్తాయి.
ఇంకోవైపు బీజేపీ ఎన్నికల మూడ్లోకి వచ్చేసింది. శని, ఆదివారాల్లో ఢిల్లీ వేదికగా భవిష్యత్ కార్యాచరణపై రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించింది. బీజేపీకి 370 సీట్లు.. ఎన్డీఏ కూటమికైతే 400 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసింది. ఇంత కాన్ఫిడెన్స్గా కమలనాథులు ఉంటే.. ఇండియా కూటమి మాత్రం సీట్ల పంచాయితీతోనే తర్జన భర్జన పడుతోంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?